Breaking News

Day: November 16, 2020

బిహార్​లో కొలువు దీరిన నితీష్ సర్కార్‌

బిహార్​లో కొలువుదీరిన నితీష్ సర్కార్‌

పాట్నా: బిహార్‌ ముఖ్యమంత్రిగా నితీష్‌ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం పీఠాన్ని వరుసగా నాలుగోసారి ఆయన సొంతం చేసుకున్నారు. అంతేకాదు 69 ఏళ్ల నితీష్​ కుమార్​ ఎక్కువ సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఘనతను దక్కించుకున్నారు. సోమవారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ ఫగు చౌహాన్‌ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి బీజేపీ నేత, కేంద్రమంత్రి అమిత్‌షా, జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. 

Read More
పంచారామాలకు స్పెషల్​ బస్సులు

పంచారామాలకు స్పెషల్​ బస్సులు

సారథి న్యూస్, శ్రీకాకుళం: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలైన పంచారామాలకు శ్రీకాకుళం నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను నడిపించనున్నట్లు డీఎం వరలక్ష్మి తెలిపారు. వాటికి సంబంధించిన పోస్టర్లను సోమవారం శ్రీకాకుళంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటకు బస్సు సర్వీసులను నడిపిస్తున్నట్లు వివరించారు. ఈనెల 20 నుంచి ప్రారంభంకానున్న తుంగభద్ర పరిష్కారాల దృష్ట్యా ప్రజలకు అసౌకర్యం కలగకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు […]

Read More
స్పీడ్​ పెంచిన ‘వకీల్​ సాబ్’

స్పీడ్​ పెంచిన ‘వకీల్​ సాబ్’

పవన్‌ కళ్యాణ్ తన రీ ఎంట్రీ తర్వాత జెట్‌ స్పీడ్​లో దూసుకెళ్తున్నాడు. వరుస ప్రాజెక్ట్స్​అనౌన్స్​చేసి సర్‌‌ప్రైజ్ చేస్తున్నాడు. ఇందులో రెండు రీమేకులే కావడం విశేషం. ప్రస్తుతం వేణుశ్రీరామ్‌ డైరెక్షన్‌లో చేస్తున్న ‘వకీల్ సాబ్‌’.. బాలీవుడ్‌ సూపర్‌‌ హిట్ ‘పింక్‌’కి రీమేక్. సాగర్‌‌ చంద్ర దర్శకత్వంలో రానున్న చిత్రం మలయాళ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కి రీమేక్. ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలైంది. ఇందులో ఇద్దరు హీరోలు ఉంటారు. ఇద్దరికీ సమానమైన ప్రత్యేకత ఉంటుంది. మాతృకలో […]

Read More
బీజేపీకి సిద్ధాంతం లేదు.. రాద్ధాంతమే

బీజేపీకి సిద్ధాంతం లేదు.. రాద్ధాంతమే

సారథి న్యూస్, హైదరాబాద్: బీజేపీకి ఒకప్పుడు సిద్ధాంతం ఉండేదని, ఇప్పుడది అబద్ధాలతో రాద్ధాంతం చేసే పార్టీగా మారిందని మంత్రి టి.హరీశ్​రావు ఎద్దేవాచేశారు. గోబెల్స్ ప్రచారంతో అబద్ధాల పునాదుల మీద బీజేపీ రాజకీయంగా ఎదగాలని అనుకుంటోందని, ఆ వ్యవహారశైలిని టీఆర్ఎస్​ కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సోమవారం పటాన్ చెరులో నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహక సమావేశంలో టీఆర్ఎస్ ​నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి హరీశ్​రావు మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు ఏం చేశాయని ఓట్లు వేయాలని సూటిగా ప్రశ్నించారు. 70ఏళ్ల […]

Read More
4 కేజీబీవీలకు రూ.14 కోట్లు మంజూరు

4 కేజీబీవీలకు రూ.14 కోట్లు మంజూరు

సారథి న్యూస్​, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మరో నాలుగు కస్తూర్బాగాంధీ(కేజీబీవీ) బాలికల స్కూళ్ల భవనాల నిర్మాణాలకు రూ.14 కోట్లు మంజూరైనట్లు మంత్రి టి.హరీశ్​ రావు తెలిపారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆ దిశగా జిల్లాలో మండలానికి ఒక కస్తూర్బా బాలికల పాఠశాలను మంజూరు చేశామని చెప్పారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం తొగుట, రాయ్ పోల్ మండలాలు, హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం, జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండలంలోని కస్తూర్బా బాలికల […]

Read More
‘గాలి సంపత్’.. షూటింగ్​ షురూ

‘గాలి సంపత్’.. షూటింగ్​ షురూ

హీరో శ్రీవిష్ణు నటిస్తున్న మరో కొత్త సినిమా ప్రారంభమైంది. ‘గాలి సంపత్’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అనీష్ కృష్ణ గతంలో ‘అలా ఎలా, లవర్’ వంటి చిత్రాలకు డైరెక్టర్​గా పనిచేశారు. అనిల్ రావిపూడి సినిమాకు కో డైరెక్టర్ పనిచేస్తున్నారు. రైటర్ గా చేసిన ఆయన మిత్రుడు ఎస్.కృష్ణ ప్రొడ్యూసర్ గా పరిచయమవుతున్నారు. ఆయనతో పాటు సాహు గారపాటి, హరీశ్​పెద్ది కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి సమర్పిస్తూ స్క్రీన్ ప్లే […]

Read More
ఫిర్యాదులు ఎప్పటికప్పుడే పరిష్కరించండి

ఫిర్యాదులు ఎప్పటికప్పుడే పరిష్కరించండి

సారథి న్యూస్, వాజేడు, ములుగు: ప్రజాసమస్యలపై ప్రత్యేక దృష్టిసారించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారిణి కె.రమాదేవి సూచించారు. సోమవారం ములుగు జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులతో ప్రజావిజ్ఞప్తులు, ఈ- ఆఫీస్, పల్లెప్రగతి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ శాఖలకు సంబంధించి ఇప్పటివరకు 646 దరఖాస్తులు రాగా, 358 పరిష్కరించామని, 288 దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయని తెలిపారు. ప్రజావాణిలో 21 రెవెన్యూ శాఖకు సంబంధించి, మూడు ఆసరా పెన్షన్లు, […]

Read More
సబ్​ట్రెజరీ ద్వారా సత్వర సేవలు

సబ్ ​ట్రెజరీ ద్వారా సత్వర సేవలు

సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రూ.1.8 కోట్ల వ్యయంతో నిర్మించిన సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్​డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సోమవారం ప్రారంభించారు. రెండు అంతస్తుల్లో నిర్మించిన భవనంలో వసతులు బాగున్నాయని కితాబిచ్చారు. సత్వర సేవలు అందించి జిల్లాలోనే నంబర్​వన్​ట్రెజరీగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో 76 సబ్ ట్రెజరీ భవనాలకు ఒకేసారి నిర్మాణ అనుమతులు వస్తే నరసన్నపేటలో భవనం మొదటిసారిగా ప్రారంభానికి నోచుకోవడం గొప్ప విషయమని అన్నారు. అంతకుముందు ఆయన పూజలు చేశారు. […]

Read More