**రాజీమార్గంతో కేసుల శాశ్వత పరిష్కారం **పైకోర్టుల్లో అప్పీలు లేకుండా కేసుల పరిష్కారానికి అవకాశం -జిల్లా జడ్జి డి.రాజేష్ బాబు సామాజిక సారథి , నాగర్ కర్నూల్: …. న్యాయానికి గొప్ప, పేద అన్న తేడా లేదు. ఏ పౌరుడూ ఆర్థిక, మరే ఇతర కారణాల వల్ల న్యాయం పొందే అవకాశాలు కోల్పోరాదన్న ఉద్దేశంతో.. పౌరులకు ఉచిత న్యాయ సహాయం అందించాలని భారత అత్యున్నత న్యాయస్థానం భావించి లోక్ అదాలత్ ను ప్రవేశపెట్టింది.ఆర్థిక లావాదేవీలు, బీమా తదితర కేసులను […]
సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ లండన్లో గ్రీన్ యాపిల్ అవార్డులను అందుకున్నారు. మొజాంజాహీ మార్కెట్, సచివాలయం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదగిరిగుట్ట దేవాలయానికి గ్రీన్ యాపిల్ అవార్డులు వచ్చాయి. ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్లింగ్స్ క్యాటగిరీలో ఈ అవార్డులు లభించాయి. దేశంలోని నిర్మాణాలు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకోనుండడం ఇదే తొలిసారి కాగా, ఒక్క తెలంగాణకే ఐదు విభాగాల్లో […]
– కాంగ్రెస్లోకి పొంగులేటి, జూపల్లి– పార్టీలో చేరడంపై స్పష్టత ఇచ్చిన నేతలు– 30న కాంగ్రెస్ ఖమ్మం సభలో చేరిక సామాజికసారథి, హైదరాబాద్: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో చేరడం ఖాయమైంది. ఆయన ఏ రోజు కాంగ్రెస్లో చేరబోతున్నారనే దానిపై కూడా స్పష్టత వచ్చింది. ఈ నెలాఖరున అంటే జూన్ 30న పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావు తదితరులు కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఈనెల 22న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ […]
– తెలంగాణ అభివృద్ధికి రూ.5 లక్షల 27వేల కోట్లు– వివిధ కార్యక్రమాలకు కేంద్రం ప్రభుత్వం మంజూరు– గుజరాత్ కంటే తెలంగాణకే ఎక్కువ నిధులు– కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ప్రజెంటేషన్ సామాజికసారథి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో రూ.5 లక్షల 27వేల కోట్లు ఖర్చు చేసిందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. 2017లో జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి కేంద్రం తెలంగాణకు రూ. 8,379 కోట్లు ఇచ్చిందని తెలిపారు. తొమ్మిదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన […]
– లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తెలంగాణ వర్సిటీ వీసీ– వీసీ ఇంట్లో 8 గంటల పాటు సోదాలు– పలు కీలకపత్రాలు స్వాధీనం.. అనంతరం అరెస్ట్ సామాజికసారథి, హైదరాబాద్: నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ దాచేపల్లి రవీందర్ గుప్తాను ఏసీబీ అధికారులు శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. తార్నాకలోని ఆయన నివాసంలో దాదాపు 8గంటల పాటు సోదాలు నిర్వహించిన అనంతరం రవీందర్ గుప్తాను అరెస్టు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని భీమ్గల్లో […]
– 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు– అధికారులతో స్పీకర్ పోచారం సమీక్ష సామాజికసారథి, హైదరాబాద్: ఈ నెల 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నట్లు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరిగేందుకు ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీస్శాఖ అధికారులతో శాసనసభలో బుధవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, […]
సామాజికసారథి, రామకృష్ణాపూర్: కాంగ్రెస్ పార్టీ 138 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం పట్టణంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పల్లె రాజు అధ్వర్యంలో పార్టీ జెండాను బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు రాంబాబు, రాజయ్య, దేవేందర్, రామకృష్ణ, భూమేష్, రవి తదితరులు పాల్గొన్నారు.
సామాజికసారథి, చేవెళ్ల: విద్యార్థుల ఫీజ్ రీయంబర్స్మెంట్, పెండింగులో ఉన్న స్కాలర్షీప్ను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి రాజేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం చేవెళ్లలోని పలు పాఠశాల విద్యార్థులతో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. విద్యాసంస్థల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో సమస్యలను పరిష్కరించాలని, దానితోపాటు […]