Breaking News

POLITICS

అధికార పార్టీ చెబితేనే ఓకే!

అధికార పార్టీ చెబితేనే ఓకే!

వడ్ల కొనుగోళ్లలోనూ రాజకీయమే రొటేషన్ పద్ధతి పాటించని మెప్మా కలెక్టర్​కు ఫిర్యాదుచేయనున్న మహిళా సంఘాలు సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: వడ్ల కొనుగోలులోనూ రాజకీయ నడుస్తోంది. నాగర్ కర్నూల్​నగర పంచాయతీల పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు సెంటర్లలో అధికార పార్టీ మద్దతుదారులైన మహిళా సంఘాలకే కట్టబెడుతూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం  వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించింది. వీటిని ఒక్కో ఏడాది ఒక్కో మహిళా సంఘం నిర్వహించడం […]

Read More

నూతన నాయుడు ఇంట్లో దళిత యువకుడికి గుండు

అమరావతి: బిగ్​బాస్​ఫేం, పవన్​కల్యాణ్​ అభిమాని, ‘పరాన్నజీవి’ దర్శకుడు నూతన్​ నాయుడు ఇంట్లో దళిత యువకుడు ఘోర అవమానానికి గురయ్యాడు. కర్రి శ్రీకాంత్​ అనే ఓ దళిత యువకుడు నూతన్ ​నాయుడు ఇంట్లో పనిచేస్తున్నాడు. నూతన్​ భార్య మధుప్రియ శ్రీకాంత్​పై దొంగతనం నేరం మోపడంతో అతడు పనికి రావడం లేదు. ఈ క్రమంలో నూతన్​ నాయుడు భార్య మధుప్రియ.. శ్రీకాంత్​ను తన ఇంటికి పిలిపించి అతడికి గుండు కొట్టించింది. కాగా ఈ ఘటనపై దళితసంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ […]

Read More

తెలుగు తమ్ముళ్లు.. డీలా

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లోని టీడీపీ కార్యకర్తలు అధినేత చంద్రబాబు వైఖరితో డీలా పడిపోయారట. కరోనా నెపంతో టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ కే పరిమితమయ్యారు. కనీసం యువనేత లోకేశ్​ కూడా వారిని పలుకరించడం లేదు. దీంతో తెలుగుదేశం కార్యకర్తలు తీవ్ర నిస్తేజంలో కూరుకుపోయినట్టు సమాచారం. మరోవైపు ఏపీలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇటీవలే ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్​ ఏపీలో పర్యటించి కీలకవ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని.. ఆ స్థానాన్ని భర్తీచేయాలని ఆయన […]

Read More

రమేశ్​ ఆస్పత్రి చుట్టూ రాజకీయం

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో రాజకీయాలు వేడెక్కాయి. ప్రస్తుతం రమేశ్​ ఆస్పత్రి, స్వర్ణప్యాలెస్​ అగ్నిప్రమాదంపై అధికార ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. రమేశ్​ ఆస్పత్రి కరోనా పేషెంట్లను స్వర్ణప్యాలెస్ హోటల్​లో ఉంచి చికిత్స అందించింది. ఈ క్రమంలో అగ్నిప్రమాదం జరిగి అందులో ఉన్న 10 మంది చనిపోయారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా, రమేశ్​ ఆస్పత్రి యజమాని రమేశ్​బాబు పరారీలో ఉన్నాడు. రమేశ్​ బాబు కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి ప్రభుత్వం కక్ష గట్టిందని.. ప్రతిపక్ష టీడీపీ […]

Read More
అయోధ్యలో రామాలయం నిర్మాణానికి ఆహ్వానితులు వీరే

అయోధ్యకు విచ్చేయండి

అయోధ్య: అయోధ్యలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌నున్న ‘శ్రీరాముడి మందిర నిర్మాణం భూమి పూజ‌కు విచ్చేయండి’ అంటూ రామ‌భ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు ఆహ్వానాల‌ను పంపుతోంది. ఆగస్టు 5న‌ జ‌రిగే ఆల‌య నిర్మాణం పునాది రాయి కార్య‌క్ర‌మానికి సుమారు 250 మంది అతిథుల‌ను పిల‌వనున్న‌ట్లు స‌మాచారం. అయోధ్యలోని ప్ర‌ముఖ సాధువులు, రాముడి గుడి నిర్మాణం కోసం పోరాడిన వ్య‌క్తులు ఈ లిస్టులో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి ఈ కార్య‌క్ర‌మానికి రావాల్సిందిగా శ‌నివారం ఆహ్వానం అందింది. అలాగే […]

Read More

ఆడియో క్లిప్పులతో దొరికిపోయారు

జైపూర్‌‌: రాజస్థాన్‌ పొలిటికల్‌ డ్రామా రోజుకో మలుపు తిరుతున్నది. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనాలని చూస్తోందని ఆరోపించిన కాంగ్రెస్‌, 19 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్‌ మరో ముందు అడుగు వేసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలతో బేరాలు ఆడారని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షకావత్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భన్వర్‌‌లాల్‌ శర్మపై కేసు పెట్టింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీకి అమ్ముడు పోయారని విచారణలో వెల్లడైందని చెప్పింది. బీజేపీతో డీలింగ్‌ పెట్టుకున్నారని ఆడియో […]

Read More

వెంటిలేటర్‌‌పై కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్​పై ఉన్నదని ఏ శక్తి దాన్ని కాపాడలేదని ఆప్​ అధికార ప్రతినిధి రాఘవ చాదా విమర్శించారు. ఓ వైపు కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే భారతీయజనతాపార్టీ, కాంగ్రెస్​ అధికారం కోసం కుట్రలు పన్నుతున్నాయని, ఈ రెండు పార్టీలకు ప్రజలపై ప్రేమలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని, ఇక భవిష్యత్తులో దేశాన్ని కాపాడే పరిస్థితి కూడా లేదని అన్నారు. పార్టీకి యువత అవసరం ఉందని, పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు చాలా చర్యలు అవసరం అని […]

Read More

బీజేపీవి శవరాజకీయాలు

కోల్‌కతా: బీజేపీ ఎమ్మెల్యే ఆత్మహత్యను ఆ పార్టీ నేతలు రాజకీయం చేయాలని చూస్తున్నారని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ విషయమై ఆమె రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు బుధవారం లేఖ‌‌ రాశారు. బీజేపీ ప్రతినిధుల బృందం మిమ్మల్ని కలిసి వాస్తవాలను వక్రీకరించి చెప్పారని, ఆ విషయమై మీకు క్లారిటీ ఇచ్చేందుకే ఈ విషయంపై రాస్తున్నాను అని మమతా బెనర్జీ అన్నారు. ‘ఎమ్మెల్యే తరచూ ప్రజలను కలిసే మొబైల్‌ షాప్‌ దగ్గర ఉరి వేసుకుని కనిపించారు. పోస్ట్‌మార్టం […]

Read More