Breaking News

Day: July 15, 2020

గురుకుల కాలేజీల్లో ప్రవేశాలు

గురుకుల కాలేజీల్లో ప్రవేశాలు

సారథి న్యూస్​, హైదరాబాద్‌: మహాత్మాజ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన (బీసీ) సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధీనంలోని గురుకుల కాలేజీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును పొడిగించినట్లు సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 10 వరకు ఉన్న గడువును 19 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమం జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌మీడియట్ ఫస్టియర్​లో బాలబాలికలకు, మహిళా డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్​లో అడ్మిషన్లు ఉంటాయని వివరించారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, […]

Read More
తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ

తెలంగాణలో 15 మంది ఐఏఎస్‌ల బదిలీ

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది. అడిషనల్ సీఈవోగా జ్యోతి బుద్ధప్రకాష్‌, వైద్యారోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సయ్యద్‌ అలీ ముర్తుజారజీ, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి, ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్‌ గా అదర్‌ సిన్హా, నాగర్‌కర్నూల్‌ కలెక్టర్​గా ఎల్‌.శర్మన్‌, పాఠశాల విద్యాడైరెక్టర్‌గా శ్రీదేవసేన, హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ గా వాకాటి కరుణ, పర్యాటక, […]

Read More
నాగర్​కర్నూల్​కలెక్టర్​గా ఎల్‌.శర్మన్‌

నాగర్​కర్నూల్ ​కలెక్టర్​గా ఎల్‌.శర్మన్‌

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: నాగర్​కర్నూల్ ​జిల్లా కలెక్టర్​గా ఎల్‌.శర్మన్‌ ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇంతకుముందు పనిచేసిన కలెక్టర్​ ఈ.శ్రీధర్​ను బదిలీచేసిన విషయం తెలిసిందే. వనపర్తి జిల్లా కలెక్టర్ ​యాష్మిన్​బాషాకు ఇన్​చార్జ్ ​బాధ్యతలు అప్పగించారు. తాజాగా శ్రీధర్​ను గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిగా నియమించారు. అయితే నూతనంగా నియమితులైన కలెక్టర్​ ఎల్.శర్మన్​ఉమ్మడి మహబూబ్​నగర్ ​జిల్లా జాయింట్​ కలెక్టర్​గా పనిచేశారు. అంతేకాదు శర్మన్​ గతంలో నాగర్​కర్నూల్​ ఆర్డీవోగానూ పనిచేశారు.

Read More
కుండపోత వాన

కుండపోత వాన

రోజంతా విడవని వాన ఏకమైన వాగులు, వంకలు పలు పట్టణాల్లో లోతట్టుకాలనీలు జలమయం సారథి న్యూస్, మెదక్, నారాయణఖేడ్, భద్రాద్రి కొత్తగూడెం: వానాకాలం మొదలయ్యాక తొలిసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాన దంచికొట్టింది. బుధవారం దాదాపు అన్ని జిల్లాల్లో భారీవర్షం కురిసింది. మహబూబ్​నగర్​, వికారాబాద్​, జోగుళాంబ గద్వాల, హైదరాబాద్​, వరంగల్​, ఖమ్మం జిల్లాలో వాన దంచికొట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో కుండపోత వానపడింది. చిలప్‌చేడ్‌ మండలంలో అత్యధికంగా 9.3సెం.మీ., కొల్చారం […]

Read More

సీబీఎస్‌ఈ టెన్త్​ ఫలితాలు విడుదల

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ పదోతరగతి రిజల్ట్స్‌ విడుదలయ్యాయి. బుధవారం ఉదయం ఫలితాలను వెబ్‌సైట్‌లో ఉంచారు. ఉమాంగ్‌ యాప్‌, టోల్‌ఫ్రీ నంబర్‌‌ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని అధికారులు చెప్పారు. ఈ ఏడాది 91.46 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు అధికారులు వెల్లడించారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఉత్తీర్ణతశాతం పెరిగింది. దాదాపు 41,804 మంది విద్యార్థులు 95 శాతం మార్కులు స్కోర్‌‌ చేశారు. సీబీఎస్‌ఈ ఇప్పటికే పన్నెండోతరగతి ఫలితాలు విడుదల చేసింది. కరోనా కారణంగా టెన్త్‌, పన్నెండోతరగతి పరీక్షలను […]

Read More

బీజేపీవి శవరాజకీయాలు

కోల్‌కతా: బీజేపీ ఎమ్మెల్యే ఆత్మహత్యను ఆ పార్టీ నేతలు రాజకీయం చేయాలని చూస్తున్నారని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ విషయమై ఆమె రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు బుధవారం లేఖ‌‌ రాశారు. బీజేపీ ప్రతినిధుల బృందం మిమ్మల్ని కలిసి వాస్తవాలను వక్రీకరించి చెప్పారని, ఆ విషయమై మీకు క్లారిటీ ఇచ్చేందుకే ఈ విషయంపై రాస్తున్నాను అని మమతా బెనర్జీ అన్నారు. ‘ఎమ్మెల్యే తరచూ ప్రజలను కలిసే మొబైల్‌ షాప్‌ దగ్గర ఉరి వేసుకుని కనిపించారు. పోస్ట్‌మార్టం […]

Read More

సచిన్​ పైలట్​కు మరో షాక్​

న్యూఢిల్లీ: సొంతపార్టీపైనే తిరుగుబాటు చేసి రెండుసార్లు సీఎల్పీ సమావేశానికి డుమ్మా కొట్టడంతో సచిన్‌పైలెట్‌పై చర్యలు తీసుకుని పదవి నుంచి తొలగించిన కాంగ్రెస్‌ బుధవారం ఉదయం తాజాగా నోటీసులు జారీ చేసింది. సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని లేదంటే అనర్హతను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ నోటీసుల్లో చెప్పింది. సచిన్‌ పైలెట్‌తో పాటు ఆయన తరఫు 18 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల తర్వాత వాళ్లు ఇచ్చే వివరణను బట్టి సీఎల్పీ […]

Read More

నిర్లక్ష్యం వహిస్తే అంతేమరి

సారథిన్యూస్​, వంగూర్​: విధుల్లో నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శి సస్పెండ్​ అయ్యారు. నాగర్​కర్నూల్​ జిల్లా వంగూర్​ గ్రామపంచాయతీ కార్యదర్శి రాజుగౌడ్ విధుల్లో నిర్లక్ష్యం వహించారు. విధులకు సరిగ్గా హాజరుకావడం లేదని.. ప్రజలను పట్టించుకోవడం లేదని అతడిపై ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ చేపట్టిన కలెక్టర్​ షేక్​ యాస్మిన్​ బాషా.. కార్యదర్శిని సస్పెండ్​ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. వీరితోపాటు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో అలసత్వం వహిస్తే […]

Read More