ఢిల్లీ: నీట్, జేఈఈను ఆపాలంటూ విపక్షాలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నాయి. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి ఈ పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బుధవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విపక్ష పార్టీల సీఎంలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నీట్, జేఈఈ అంశాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. ఆమె మొదటి నుంచి ఈ పరీక్షలను రద్దు చేయాలని కోరుతున్నారు. ఇటీవలే ప్రధాని మోడీకి లేఖ […]
సారథిన్యూస్, ఖమ్మం: కరోనా బాధితులకు సాయం చేస్తూ, కరోనా అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్న ప్రముఖ సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాసరావు దంపతులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కాగా వీరిద్దరూ మద్దులపల్లి కరోనా కేర్సెంటర్లో చికిత్సపొందుతున్నారు. అక్కడ వారిని ఎవరూ పట్టించుకోకపోవడం, వైద్యం సరిగ్గా అందకపోవడంతో తమకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి పువ్వాడ అజయ్ను కోరారు. వెంటనే స్పందించిన మంత్రి వీరిద్దరినీ ప్రత్యేక అంబులెన్స్లో హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్లోని మమత […]
కోల్కతా: బీజేపీ ఎమ్మెల్యే ఆత్మహత్యను ఆ పార్టీ నేతలు రాజకీయం చేయాలని చూస్తున్నారని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ విషయమై ఆమె రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు బుధవారం లేఖ రాశారు. బీజేపీ ప్రతినిధుల బృందం మిమ్మల్ని కలిసి వాస్తవాలను వక్రీకరించి చెప్పారని, ఆ విషయమై మీకు క్లారిటీ ఇచ్చేందుకే ఈ విషయంపై రాస్తున్నాను అని మమతా బెనర్జీ అన్నారు. ‘ఎమ్మెల్యే తరచూ ప్రజలను కలిసే మొబైల్ షాప్ దగ్గర ఉరి వేసుకుని కనిపించారు. పోస్ట్మార్టం […]
కోల్కతా: ‘ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఓ కాలనాగు. ఆమె ఆర్థికవ్యవస్థను నాశనం చేశారు’ అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇలాంటి పనికిరాని ఆర్థికమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. పాము కాటుకు మనునుషులు చనిపోయినట్లుగా, నిర్మల ఆర్థిక వ్యవహారాల కారణంగా సామాన్య జనం చనిపోతున్నారని మండిపడ్డారు. పెంట్రోల్ ధరల పెంపుకు నిరసనగా ఆదివారం బంకురా జిల్లాలో ఏర్పాటుచేసిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థికమంత్రి పదవికి నిర్మల వెంటనే […]
కోల్కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్పై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. మార్నింగ్ వాక్కు వెళ్లిన తనపై టీఎంసీ మద్దతు దారులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. దాడిలో దిలీప్ వాహనం కూడా ధ్వంసమైంది. అతడి భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. బుధవారం దిలీప్ ఘోష్ రాజర్హట్ నుంచి కోచపుకుర వరకు ఆయన మార్నింగ్వాక్కు వెళ్తుండగా కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. కాగా తనపై టీఎంసీ నేత టపాక్ ముఖర్జీ ఆయన అనుచరులు దాడి […]
న్యూఢిల్లీ : మన దేశంలో రాజకీయ హింసను ప్రమోట్ చేసే ఏకైక రాష్ట్రం పశ్చిమబెంగాల్ అని కేంద్ర హోంమంత్రి అమిత్షా అన్నారు. మంగళవారం పశ్చిమబెంగాల్లో వర్చువల్గా నిర్వహించిన ‘బంగ్లార్ జనసంబేశ్’ ర్యాలీలో పాల్గొన్న ఆయన దీదీపై విమర్శలు చేశారు. లోక్సభ ఎలక్షన్స్లో 303 స్థానాలు గెలిచిన దానికంటే.. బెంగాల్లో 18 సీట్లు గెలవడం చాలా గొప్ప అని అమిత్ షా అన్నారు. పొలిటికల్ గొడవల్లో 2014 నుంచి ఇప్పటి వరకు 100 మంది బీజేపీ వర్కర్లు ప్రాణాలు […]
అమిత్షా, కేంద్రంపై మమత ఫైర్ కోల్కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేంద్ర ప్రభుత్వం మధ్య పొలిటికల్ వార్ రోజు రోజుకు ముదురుతోంది. కేంద్ర మంత్రి అమిత్ షాపై దీదీ తీవ్రవిమర్శలు చేశారు. అమిత్షా, తన మధ్య జరిగిన సంభాషణలను దీదీ మీడియాతో చెప్పారు. వైరస్ను కంట్రోల్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆరోపిస్తున్న హోం మంత్రి అమిత్ షా తానే స్వయంగా ఎందుకు రంగంలోకి దిగడం లేదో చెప్పాలని అన్నారు. ‘పదే పదే బెంగాల్కు […]