సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యను ఇతివృత్తంగా తీసుకొని రాంగోపాల్వర్మ.. మర్డర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ‘మర్డర్’ సినిమా తన కుమారుడి హత్యకేసు విచారణను ప్రభావితం చేస్తుందని.. అందువల్ల సినిమా విడుదలను నిలిపివేయాలని ప్రణయ్ తండ్రి కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్డు ఈ విచారణ పూర్తయ్యేవరకు ‘మర్డర్’ సినిమాను విడుదల చేయొద్దని సోమవారం […]
లక్నో: వైద్యవిద్యార్థిని దారుణహత్యకు గురైన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రాలో గురువారం వెలుగుచూసింది. కొంతకాలంగా ఆమెను ప్రేమపేరుతో వేధిస్తున్న యువకుడే కిడ్నాప్చేసి హత్యచేశాడని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈఘటనపై ప్రస్తుతం యూపీ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఢిల్లీలోని శివపురి ప్రాంతానికి చెందిన డాక్టర్ యోగిత గౌతమ్(25) ఆగ్రా ఎస్ ఎన్ మెడికల్ కళాశాలలో గైనకాలజీ విభాగంలో వైద్యురాలిగా పని చేస్తున్నారు. అదే కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం నుంచి ఆమె కనిపించడం లేదు. […]
4 నెలల క్రితం తండ్రిని…ఇప్పుడు భార్యని.. అక్రమ సంబంధం అనుమానంతో ఇద్దరినీ హతమార్చిన వ్యక్తి పెన్ పహాడ్ మండలం జల్మల్ కుంట తండాలో దారుణం.. తండ్రి కేసులో జైలు నుంచి వచ్చిన పది రోజులకే భార్యను చంపిన నిందితుడు సారథిన్యూస్, పెన్ పహాడ్ : సొంత తండ్రే తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం సజావుగా సాగుతున్న సంసారంలో చిచ్చుపెట్టింది. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం జల్మల్ కుంట తండాకు చెందిన లునవత్ స్వామి, […]
రీసెంట్గా ‘పవర్ స్టార్’ సినిమాను ఆర్జీవి వరల్డ్లో విడుదల చేసిన ఆర్జీవి ఇప్పుడు ‘మర్డర్’ కుటుంబకథా చిత్రమ్ ట్రైలర్ను విడుదల చేశాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు తీసే వర్మ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్య నేపథ్యంలో ‘మర్డర్’ సినిమాను ‘కుటుంబ కథా చిత్రమ్’ అనే ట్యాగ్ లైన్తో తీస్తున్న విషయం తెలిసిందే. అగ్రకులానికి చెందిన ఓ యువతి కులాంతర వివాహం చేసుకున్న తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులను వర్మ ఈ చిత్రంలో స్పష్టంగా చూపిస్తున్నట్టు […]
సారథిన్యూస్, రంగారెడ్డి: ఓ వివాహిత హత్యకు గురైంది. కాగా ఆమెను చంపింది తొమ్మిదో భర్త కావడం విశేషం. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పహాడిషరీఫ్ పరిధిలోని శ్రీరామ కాలనీలో చోటుచేసుకున్నది. వరలక్ష్మి (35)ని కొంతకాలం క్రితం శ్రీరామ కాలనీకి చెందిన నాగరాజు (36) వివాహం చేసుకున్నాడు. కాగా వరలక్ష్మి అప్పటికే ఎనిమిది పెళ్లిళ్లు చేసుకొని.. వేర్వేరు కారణాలతో భర్తలకు విడాకులు ఇచ్చింది. నాగరాజు ఆమెకు తొమ్మిదోభర్త. కాగా ఇటీవల భార్య, భర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. మంగళవారం […]
సారథి న్యూస్, భువనేశ్వర్: పదవ తరగతి చదువుతున్న ఓ బాలిక సోమవారం తన ఇంట్లో అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. భువనేశ్వర్లోని డుమ్డుమా ఏరియా ఫేజ్-2 లో ఈ దారుణం జరిగింది. ఈ ఘటన పై సమాచారమందుకున్న పోలీసులు బాలిక ఇంటికి చేరుకొని.. మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు గానీ, గుర్తులు కానీ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని, బాలిక కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని భావిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రష్మి మోహపాత్రా తెలిపారు. మృతదేహాన్ని […]
సారథి న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ ఎల్బీనగర్లోని శాతవాహన కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి కన్న కొడుకుని హత్య చేసి ఆత్మహత్య చేసుకుంది. భువనగిరి జిల్లా వలిగొండ మండలం వరకట్పల్లికి చెందిన శంకరయ్య, మమత దంపతులు కొంత కాలంగా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాతవాహన కాలనీలో ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కొడుకు రియాన్ష్(3) ఉన్నాడు. సోమవారం రాత్రి మమత కుమారుడి చేతిని గాయపరిచి అనంతరం మూడంతస్తుల భవనం పైనుంచి దూకి అత్మహత్యకు పాల్పడింది. తీవ్ర […]
సారథి న్యూస్, చిత్తూరు : చిత్తూరు జిల్లా వి కోట మండలం పాముగానిపల్లిలో అనుమానం పెనుభూతమై పచ్చని కాపురంలో చిచ్చు రగిలింది. తాగుడుకు బానిసైన భర్త ప్రభాకర్ రెడ్డి (32) భార్య రేణుక (22)పై అనుమానం పెంచుకుని సోమవారం ఉదయం భార్యభర్తలిద్దరూ గొడవ పడ్డారు. పాముగానిపల్లె సమీపంలోని పొలం వద్ద ఇరువురు ఘర్షణ పడి కోపంతో వెంట తెచ్చుకున్న కత్తితో భార్య మెడపై నరికాడు. ఆమె స్పాట్లోనే చనిపోయింది. అనంతరం అతను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. […]