Breaking News

చిత్తూరు

అనుమానమే పెనుభూతమై..

సారథి న్యూస్​, చిత్తూరు : చిత్తూరు జిల్లా వి కోట మండలం పాముగానిపల్లిలో అనుమానం పెనుభూతమై పచ్చని కాపురంలో చిచ్చు రగిలింది. తాగుడుకు బానిసైన భర్త ప్రభాకర్​ రెడ్డి (32)  భార్య రేణుక (22)పై అనుమానం పెంచుకుని సోమవారం ఉదయం భార్యభర్తలిద్దరూ గొడవ పడ్డారు. పాముగానిపల్లె సమీపంలోని పొలం వద్ద ఇరువురు ఘర్షణ పడి కోపంతో వెంట తెచ్చుకున్న కత్తితో భార్య మెడపై నరికాడు. ఆమె స్పాట్​లోనే చనిపోయింది. అనంతరం అతను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. […]

Read More

లారీ బోల్తా.. నలుగురి మృతి

చిత్తూరు: లారీ బోల్తాపడడంతో నలుగురు మృతిచెందారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా తంబల్లపల్లి నియోజకవర్గం పీటీయం మండలం కర్ణాటక సరిహద్దు ప్రాంతం చేలూరు వద్ద బుధవారం చోటుచేసుకుంది. కర్ణాటకలోని చేలూరు సమీపంలోని పాలసముద్రం వద్ద రైతు పొలంలో బోరు వేసేందుకు వెళ్తుండగా.. మార్గమధ్యంలో లారీ వేగం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులను తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు.

Read More
శ్రీకాళహస్తి సంపూర్ణ లాక్ డౌన్

శ్రీకాళహస్తి సంపూర్ణ లాక్ డౌన్

సారథి న్యూస్, శ్రీకాళహస్తి: కేవలం 80 వేల జనాభా ఉన్న చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో ఏకంగా 40కి పైగా కరోనా కేసులు నమోదు కావడంతో పట్టణాన్ని అధికారులు అష్టదిగ్బంధం చేశారు. పట్టణంలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి ప్రజలు ఎవరినీ బయ టకు వెళ్లనివ్వబోమని, పాలు, మందులు, నిత్యావసరాలను వలంటీర్ల సాయంతో ఇళ్ల వద్దనే అందిస్తామని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఉదయం […]

Read More