సారథి న్యూస్, అచ్చంపేట: నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సోమవారం తన క్యాంపు ఆఫీసులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా పేద దళిత రైతులకు పట్టాపాసు బుక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎల్.శర్మన్, నాగర్ కర్నూల్ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పోకల మనోహర్, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ తులసీరాం, వివిధ గ్రామాల రైతులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఆర్డీవో, […]
హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఆర్డీవోలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్ ఆర్డీవోగా ఎస్.మోహన్రావు నియమితులయ్యారు. అలాగే ఎల్లారెడ్డి ఆర్డీవోగా ఎస్.శ్రీను, ఆందోల్-జోగిపేట ఆర్డీవోగా వి.విక్టర్, వనపర్తి ఆర్డీవోగా పి.అమరేందర్, నిర్మల్ ఆర్డీవోగా రాథోడ్ రమేష్, బాన్స్ వాడ ఆర్డీవోగా బి.రాజాగౌడ్, మేడ్చల్-మల్కాజ్గిరి ఎస్డీసీగా జి.లింగ్యానాయక్ నియమితులయ్యారు.
సారథి న్యూస్, కర్నూలు: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భారీ విగ్రహాల ప్రతిష్టాపనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ప్రజలు ఇళ్ల వద్దనే చిన్న చిన్న మట్టి విగ్రహాలను ఏర్పాటుచేసుకుని పూజిస్తున్నారు. నగరంలోని బుధవారపేట 15వ వార్డులో వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేదార్నాథ్ఇంటివద్దే మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు. రెండొందల బిందెల నీళ్లు తమ భక్తిని నాటుకున్నారు. మట్టి గణపయ్య విశిష్టతను తెలియజేసేలా ఈ వినాయకుడిని నిలబెట్టినట్లు తెలిపారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారని తెలిపారు.
సారథి న్యూస్, అచ్చంపేట: శ్రీశైలం పవర్ హౌస్లో సంభవించిన అగ్నిప్రమాద ఘటనలో మృత్యువాతపడిన తెలంగాణ జెన్కో ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతూ తోటి ఉద్యోగులు దోమలపెంట జెన్ కో కాలనీలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు పాల్గొని నివాళులర్పించారు. కార్యక్రమంలో హైడల్ డైరెక్టర్ వెంకట్ రాజాం, సీఈ ప్రభాకర్ రావు, టీఆర్ వీకేఎస్నాయకులు రాఘవేంద్రరెడ్డి, సీఐటీయూ నాయకుడు సునిందర్, 327 యూనియన్నుంచి యాదయ్య, ఇంజినీరింగ్ అసోసియేషన్ నుంచి అనిల్, చరణ్, ఏఐటీయూసీ […]
సారథి న్యూస్, పెద్దపల్లి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతువేదిక నిర్మాణాలను ప్రణాళికాబద్దంగా, సకాలంలో పూర్తిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న రైతు వేదికల నిర్మాణంపై సోమవారం పంచాయతీరాజ్శాఖ ఈఎన్సీతో కలిసి ఎన్టీపీసీలోని మిలీనియంహాల్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులను సంఘటితం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు. నియంత్రిత వ్యవసాయసాగు ద్వారా రాష్ట్రంలోని రైతులంతా పెట్టుబడికి తగిన దిగుబడి సాధిస్తారని […]
సారథి న్యూస్, గద్వాల: నిత్యం దొంగతనాలు చేస్తూ.. పోలీసులను పరుగులు పెట్టిస్తున్న ఓ ముఠా ఎట్టకేలకు చిక్కింది. జోగుళాంబ గద్వాల జిల్లా శాంతినగర్ పీఎస్ పరిధిలో గత మూడేండ్లుగా ఓ ముఠా తరుచూ దొంగతనాలకు పాల్పడుతున్నది. ఇప్పటికీ ఈ ముఠా సభ్యులు 11 దొంగతనాలు చేశారు. ఈ నెల 18న రాజోలి వైన్షాప్లో ఈ దొంగలు చోరీ చేసి రూ. 45 వేలు, మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. సోమవారం […]
సారథిన్యూస్, రామడుగు: రోడ్డు ప్రమాదం అతడి జీవితాన్ని అతలాకుతలం చేసింది. తనను నమ్ముకున్న భార్యా, బిడ్డలను రోడ్డున పడేసింది. పనిచేసుకుంటే గానీ పూటగడవని ఆ కుటుంబానికి ఇప్పడు పెద్దకష్టమే వచ్చి పడింది. దాతలు ముందుకొచ్చి తమను ఆదుకోవాలని ప్రస్తుతం ఆ కుటుంబం దీనంగా వేడకుంటున్నది. కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన రాజశేఖర్ మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటినుంచి అతడు మంచానికే పరిమితమయ్యాడు. అతడికి మెదడులో రక్తం గడ్డకట్టిందని.. ఆపరేషన్ చేసేందుకు రూ. […]
ఢిల్లీ: కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగకుండానే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ ముగిసింది. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే కొనసాగించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నది. సోమవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని ఊహాగానాలు వెల్లువెత్తడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే పలు నాటకీయ పరిణామాల మధ్య సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. సోనియాగాంధీ పేరును పార్టీ సీనియర్ నాయకులు మన్మోహన్ […]