ఎమ్మార్పీఎస్వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మల్లాయిపల్లి బాలిక కుటుంబానికి మందకృష్ణ పరామర్శ సామాజిక సారథి, వనపర్తి: మల్లాయిపల్లి బాలిక లైంగిక దాడి కేసును ఫాస్ట్రాక్కోర్టుకు అప్పగించాలని ఎమ్మార్పీఎస్వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మల్లాయిపల్లి బాలిక కుటుంబాన్ని ఆయన పరమార్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు, మహిళలపై లైంగిక దాడులు, హత్యలు పెరిగిపోయాయని, ఒక వారం రోజుల్లోనే చెన్నూరు నియోజకవర్గం మంచిర్యాల, వనపర్తి జిల్లా మల్లాయిపల్లిలలో […]
రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తును 10వరకు నిలిపివేయాలి పంజాబ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం పంజాబ్ పర్యటనకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రతపర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయన పర్యటనలో భద్రతా లోపాలపై వస్తున్న ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించిన అన్ని వివరాలతో కూడిన రికార్డులను సురక్షితంగా భద్రపరచవలసిన జవాబుదారీతనం, బాధ్యతలను […]
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వారాలపాటు కేసుల భౌతిక విచారణను వాయిదా వేసింది. తిరిగి వర్చువల్ విధానంలోనే విచారణ కొనసాగించాలని నిర్ణయించింది. రెండు వారాల తర్వాత సమీక్షించి అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు అత్యున్నత ధర్మాసనం ప్రకటించింది. కోర్టు తాజా నిర్ణయాన్ని బార్ అసోసియేషన్ సహా అన్ని ఇతర పార్టీలకు తెలియజేసినట్టు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ చిరాగ్ భాను సింగ్, బీఎల్ఎన్ […]
న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన సీనియర్ న్యాయవాది పి.నిరూప్ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ గా నియమితులయ్యారు. డిసెంబర్ 8న ఫుల్ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టు ఎంపికచేసిన మొట్టమొదటి సీనియర్ అడ్వకేట్ నిరూప్ కావడం విశేషం. నిరూప్ తండ్రి మాజీమంత్రి పి.రామచంద్రారెడ్డి కూడా స్వయాన న్యాయవాది. ఆయన మూడు దశాబ్దాలుగా సుప్రీంకోర్టులో సేవలు అందిస్తున్నారు. 31 జాతీయ ప్రాముఖ్యత కలిగిన కేసుల్లో తీర్పులు నివేదించారు. ముఖ్యంగా ప్రైవేట్ ఇంటర్నేషనల్లా, ఎన్విరాన్ మెంటల్ లా, […]
మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు కొలిక్కి తేవచ్చు ఆస్తుల పంపకాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడంతో కాలయాపన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సామాజిక సారథి, హైదరాబాద్ ప్రతినిధి: సమాజంలో విశ్వసనీయత కలిగిన వ్యక్తులు ముందుకు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యల పరిష్కారానికి తక్కువ సమయం పడుతుందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి చివరి ప్రత్యామ్నాయంగా కోర్టు తలుపులు తట్టాలని సూచించారు. శనివారం […]
చైతన్య తమ్హానే.. మరాఠీలో పేరున్న డైరెక్టర్. 2014లో ఆయన తీసిన ‘కోర్ట్’ అనే సినిమాతో చాలా ఫేమ్ సంపాదించాడు. రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయిన చైతన్య ఇప్పుడు ఇండియాలోనే కాదు తను రీసెంట్గా తీసిన మూవీతో వెన్నీస్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెండు అవార్డులు దక్కించుకుని వరల్డ్ ఫేమస్ అయ్యాడు. ‘ది డిసైపుల్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా మొత్తం ఒక యువ సంగీత దర్శకుడి సినీప్రయాణం.. జీవితంలో అతడుపడ్డ కష్టాలు.. వాటిని ఎలా […]
న్యూఢిల్లీ: సిక్కుల ఊచకోత కేసులో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ కు జీవిత ఖైదు విధిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇది చిన్న కేసు కాదని, నిందితుడికి బెయిల్ ఇవ్వడం కుదరదని చీఫ్ జస్టిస్ ఎస్ఎ బోబ్డె నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు.. ఇకనుంచి ఆ అవసరం లేదని రిపోర్టులు చెబుతున్నాయని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. బెయిల్ కు సంబంధించి నిందితుడు పెట్టుకున్న పిటిషన్ […]
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎన్నికలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటీషన్ను శుక్రవారం అత్యున్నత ధర్మాసనం కొట్టేసింది. ఎన్నికలకు ఇప్పటికీ నోటిఫికేషన్ జారీచేయలేదని.. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం స్పష్టం చేసింది. బీహార్లో కరోనా ప్రభావం అధికంగా ఉన్నదని పిటిషన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అసాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నందున […]