యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్.. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల్లుడు అదుర్స్’ అనే ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కేతిక శర్మ ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు సమాచారం. ‘రాక్షసుడు’ హిట్ తర్వాత బెల్లంకొండ జోరు మీద ఉన్నాడు. కేతిక శర్మ ప్రస్తుతం ‘రోమాంటిక్’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నది. కాగా ‘అల్లుడు అదుర్స్’ చిత్రం మాస్ ఆడియన్స్ దృష్టిలో ఉంచుకొని తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో సోనూ సూద్ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. రామ్, లక్ష్మణ్ […]
తెలుగులో ఘనవిజయం సాధించడంతో పాటు యువహీరో రాంచరణ్కు ఎంతో పేరు తెచ్చిపెట్టిన రంగస్థలం చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయబోతున్నారట. ఈ తమిళంలో లారెన్స్ హీరోగా నటించనున్నట్టు సమాచారం. రామ్ చరణ్, సుకుమార్ కలయికలో 2018లో వచ్చిన చిత్రం రంగస్థలం భారీ విజయాన్ని నమోదు చేసింది. పీరియాడిక్ రివేంజ్ డ్రామాగా సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిట్టిబాబు పాత్రలో రామ్చరణ్ నటన విశేషంగా ఆకట్టుకున్నది. చిట్టిబాబు పాత్రను తమిళంలో లారెన్స్ చేయబోతున్నారని టాక్. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన […]
సారథిన్యూస్, అన్నవరం: ఏపీలో కరోనా విలయతాండవం చేస్తున్నది. దాదాపు అన్ని జిల్లాలకు వ్యాధి విస్తరించింది. కేసులతోపాటు మరణాల సంఖ్య అధికంగానే ఉన్నది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంలో 39 మంది సిబ్బందికి కరోనా సోకింది. శుక్రవారం 10 మంది అర్చకులకు కరోనా సోకడంతో.. శనివారం ఆలయంలో పనిచేస్తున్న 300 మంది సిబ్బందికి పరీక్షలు చేశారు. దీంతో మరో 29 కొత్తకేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం వారంతా హోం క్వారంటైన్లో ఉండి చికిత్స […]
కొన్నేండ్లుగా సరైన హిట్ పడకపోవడంతో రవితేజ డీలా పడిపోయాడు. మార్కెట్ కూడా తగ్గిపోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్కొట్టాలని కసిగా ఉన్నాడు. ఈ క్రమంలో గోపిచంద్ మలినేని డైరెక్షన్లో క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శృతీహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. తమన్ బాణీలు సమకూర్చుతున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే.. రాక్షసుడు ఫేమ్ రమేశ్వర్మతో మరో సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించాడు రవితేజ. ఈ చిత్రంలో ఆయన డబల్ రోల్ చేయనున్నట్టు టాక్. ఇప్పటికే […]
సారథిన్యూస్, నల్లగొండ : నకిలీ విత్తనాల కేసులో కర్నూలు జిల్లాకు చెందిన కర్నాటి మధుసూదన్రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు చండూర్ సీఐ సురేష్ కుమార్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం భారీగా నకిలీ పట్టివిత్తనాలు పట్టుకున్న నల్లగొండ జిల్లా పోలీసులు కేసులో విచారణ పూర్తి చేసి ఎస్పీ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు.. సీఐ సురేష్ కుమార్ శనివారం మధుసూదన్రెడ్డిని వరంగల్ కు తరలించారు. నల్లగొండ కలెక్టర్ ఆదేశాల మేరకు […]
సారథిన్యూస్, హైదరాబాద్ : కరోనా బారిన పడి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కోలుకున్నారు. కొవిడ్ దాటికి కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా అధికార పార్టీ టీఆర్ఎస్కు చెందిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో తన కుటుంబ సభ్యులకు, ఇంట్లో పని వారికీ కూడా కరోనా టెస్టులు చేయించారు. సుధీర్రెడ్డి భార్య, ఇద్దరు కొడుకులు, వంటమనిషికి కరోనా సోకినట్లు అధికారులు […]
ఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. వరుసగా రెండో రోజూ దేశంలో 60 వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. శుక్రవారం ఒక్క రోజే దేశంలో కొత్తగా 61,537 మందికి కరోనా సోకడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,88,612కి చేరింది. అలాగే, రికార్డు స్థాయిలో ఒక్కరోజే 933మంది మృత్యువాత పడటంతో మొత్తం మృతుల సంఖ్య 42,518కి పెరిగింది. దేశంలో మరణాల రేటు ప్రస్తుతం 2.05గా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. మరోవైపు, […]
ముంబై: పంటను తక్కువ టైంలో, చౌకగా రవాణా చేయాలనుకుంటాడు రైతు. అందుకు కిసాన్ రైలు బాటలు వేయనుంది. శుక్రవారం మహారాష్ట్రలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొలి కిసాన్ రైలును ప్రారంభిచారు. రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహారాష్ట్రలోని దేవలాలీ నుంచి బయల్దేరే ఈ రైలు 14 స్టేషన్ల ద్వారా ప్రయాణించి బిహార్లోని దానాబాద్కు చేరుకుంటుంది. ప్రయాణ సమయం 31 గంటల 45 నిమిషాలు. రోడ్డు […]