బీఎస్పీ స్టేట్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ సామాజిక సారథి మునుగోడు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను వెంటనే అరెస్టు చేయాలి బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పద్మశాలీలను కలిసిన సమయంలో నేతన్నలను ఆరాధ్యధైవమైన మగ్గంపై కాళ్ళుపెట్టి అవమానించడాన్ని నిరసిస్తూ, బహుజన్ సమాజ్ పార్టీ […]
లక్నో: వైద్యవిద్యార్థిని దారుణహత్యకు గురైన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రాలో గురువారం వెలుగుచూసింది. కొంతకాలంగా ఆమెను ప్రేమపేరుతో వేధిస్తున్న యువకుడే కిడ్నాప్చేసి హత్యచేశాడని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈఘటనపై ప్రస్తుతం యూపీ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఢిల్లీలోని శివపురి ప్రాంతానికి చెందిన డాక్టర్ యోగిత గౌతమ్(25) ఆగ్రా ఎస్ ఎన్ మెడికల్ కళాశాలలో గైనకాలజీ విభాగంలో వైద్యురాలిగా పని చేస్తున్నారు. అదే కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం నుంచి ఆమె కనిపించడం లేదు. […]
మానోపాడు: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో పరిశుభ్రత ఎంతో ముఖ్యమని జోగుళాంబ గద్వాల డీఎంహెచ్వో చందునాయక్ పేర్కొన్నారు. గురువారం ఆయన మానోపాడు పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆస్పత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పీహెచ్సీ ఆవరణలో చెత్త పేరుకుపోయి ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసవాల సంఖ్యను పెంచాలని సూచించారు. రోగులకు విధిగా శానిటైజర్ లను అందించడంతోపాటు కరోన మహమ్మారి పట్ల భయం తొలగించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సవిత, సూపరవైజర్లు చంద్రన్న, లలిత […]
నోయిడా: కరోనా బారినపడ్డ ఓ యువతిని వైద్యుడు లైంగికంగా వేధించాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా జైపీ దవాఖానలో చోటుచేసుకున్నది. ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న ఓ యువతికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆమె జైపీ దవాఖానలో చేరింది. కాగా జైపీ దవాఖానలో పనిచేస్తున్న ఓ యువ వైద్యుడికి కూడా కరోనా సోకింది. కాగా దవాఖాన సిబ్బంది.. వీరిద్దరికీ ఒకే గదిని( ట్విన్బెడ్ షేరింగ్రూమ్) కేటాయించారు. దీంతో యువతితో సదరు వైద్యుడు అసభ్యంగా […]
కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో ఎవరు దగ్గినా, తుమ్మినా అనుమానంగా చూసే పరిస్థితి నెలకొన్నది. సాధారణ దగ్గొచ్చినా కరోనా ఏమోనని అందరూ తెగ ఆందోళన పడుతున్నారు. ఈ క్రమంలో మాములు దగ్గు, జలుబుకు ఆందోళన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. 24 గంటలన్నా ఎక్కువగా దగ్గు వస్తే డాక్టర్ను సంప్రదించడం మేలు. కానీ సాధారణ దగ్గును తగ్గించుకొనేందుకు మాత్రం కొన్ని చిట్కాలు పాటిస్తే మేలంటున్నారు ఆయుర్వేద డాక్టర్లు. అవి ఏమిటో చూద్దాం..అల్లం దివ్య ఔషధంగ్లాసు నీటిలో అర […]
సారథిన్యూస్, ఖమ్మం: కరోనా వచ్చిందంటూ తనపై సాక్షాత్తూ ఖమ్మం డీఎమ్హెచ్వో డాక్టర్ మాలతి దుష్ప్రచారం చేశారని జిల్లాకు చెందిన డాక్టర్ శంకర్నాయక్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. డీఎమ్హెచ్వోపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ కావాలని తనకు పాజిటివ్ వచ్చందంటూ రిపోర్టులు మార్చి కొందరు తప్పుడు సమాచారాన్ని వైరల్ చేశారని మండిపడ్డారు. తన కరోనా నెగెటివ్ వచ్చన రిపోర్టులను శంకర్నాయక్ కలెక్టర్ కు చూపించారు. డీఎంఅండ్హెచ్వో పనితీరు సక్రమంగా లేదని ఆమె […]