Breaking News

MINISTER

ఏరోస్సేస్‌ రంగంలో గణనీయమైన ప్రగతి

ఏరోస్సేస్‌ లో గణనీయమైన ప్రగతి

టాటా ఏరోస్టక్చ్రర్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్​ సామాజిక సారథి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రగతిశీల విధానాలు, మౌలిక సదుపాయాలతో ఏరోస్సేస్‌ రంగం ఐదేళ్లలో అపూర్వమైన వృద్ధిని సాధించిందని మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. ఐదేళ్లుగా తెలంగాణ పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తోందన్నారు. టీఎస్‌ ఐపాస్‌తో వేగంగా, పారదర్శకంగా అభివృద్ధి కొనసాగుతుందన్నారు. ఏరోస్పేస్‌ సెక్టార్‌లో 2020లో తెలంగాణకు అవార్డు వచ్చిందని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. మంగళవారం ఆదిభట్లలో టాటా ఏరోస్టక్చ్రర్​లిమిటెడ్‌ ఫైటర్‌ వింగ్స్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌ […]

Read More
పారదర్శకంగా ’డబుల్‌’ లబ్ధిదారుల ఎంపిక

పారదర్శకంగా ’డబుల్‌’ లబ్ధిదారుల ఎంపిక

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సామాజిక సారథి, హైదరాబాద్‌: పేదల కోసం నిర్మించి ఇస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. సోమవారం సనత్‌నగర్‌ నియోజకవర్గం పరిధిలోని బన్సీలాల్‌పేట్‌ డివిజన్‌ చాచా నెహ్రూనగర్‌లో నిర్మించిన 264 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను పంపిణీ చేసేందుకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు చేపట్టిన ప్రత్యేకబస్తీ సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా […]

Read More
కాంగ్రెస్, బీజేపీకి రైతుల ప్రయోజనాలు పట్టవు

కాంగ్రెస్, బీజేపీకి రైతుల ప్రయోజనాలు పట్టవు

మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సామాజికసారథి, హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీలకు రైతుల ప్రయోజనాలు పట్టవని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రం కేంద్రానికి సహకారం అందిస్తుందని అన్నారు. ధాన్యం కొనుగోలు మీల్లింగ్ ఎగుమతి అంతా ఎఫ్​సీఐ బాధ్యత అని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి బియ్యం తరలించాలని పలుమార్లు కలెక్టర్లు సివిల్ సప్లై శాఖ కేంద్రానికి లేఖ రాసినా కూడా […]

Read More
ప్రజలకు చేరువలో అంబులెన్స్

ప్రజలకు చేరువలో అంబులెన్స్

సామాజిక సారథి, శ్రీరంగపూర్: ప్రజావసరాలకోసం అంబులెన్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శ్రీరంగపూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రభుత్వం గురువారం నూతన అంబులెన్స్ ను కేటాయించగా, అంబులెన్స్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ వారి అవసరం కోసం అంబులెన్స్ ను ఉపయోగించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read More
మేడారం జాతరపై మంత్రి సమీక్ష

మేడారం జాతరపై మంత్రి సమీక్ష

 సామాజిక సారథి, ములుగు: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరపై రాష్ట్ర గిరిజన, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్ స్థానిక అధికారులతో బుధవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకూ జరగనున్న జాతర కోసం వసతుల కల్పన, ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సలహాలు సూచనలు అందించారు. ముందుగా మేడారం అమ్మవార్లు సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. జంపన్న వాగు […]

Read More
ఆర్టీసీ బాదుడు

ఆర్టీసీ బాదుడు

ఇక పెరగనున్న బస్సుచార్జీలు ఆర్డినరీ బస్సుల్లో కి.మీ. 0.25 పైసలు ఇతర బస్సుల్లో 0.30 పైసలు ప్రభుత్వానికి యాజమాన్యం ప్రతిపాదనలు చార్జీల పెంపు అనివార్యమైంది: మంత్రి అజయ్​ మూడేళ్లలో ఆర్టీసీకి రూ.4,260 కోట్ల నష్టం నష్టాల తగ్గింపునకు మరోమార్గం లేదు: ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ సామాజిక సారథి, హైదరాబాద్‌: అందరూ ఊహించిన విధంగానే ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి. ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 0.25 పైసలు, ఇతర బస్సుల్లో 0.30 పైసలు మేర చార్జీలు ప్రభుత్వం పెంచనుంది. […]

Read More
నెలసంది గోసపడుతున్నం

నెలసంది గోసపడుతున్నం

కొనమని వేడుకున్నా అధికారులు పట్టించుకుంటలేరు రేపటిలోగా కొనపోతే కుప్పపోసి అంటుపెడ్తం మంత్రి హరీశ్​రావు ఎదుట అన్నదాతల గగ్గోలు సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: ‘నెలరోజులుగా వరి కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు గాస్తున్నాం. మా పంటను కొనుగోలు చేయమని వేడుకున్నా అధికారులు స్పందించడం లేదు’ అని రైతులు మంత్రి హరీశ్​రావు ఎదుట గోడును వెళ్లబోసుకున్నారు. వడ్లను రైస్ మిల్లు యాజమాన్యాలు కూడా కొనుగోలు చేయడం లేదని ఆయన దృష్టికి తెచ్చారు. తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఒక్కసారి […]

Read More
హాస్టళ్లలో జాగ్రత్తగా ఉండాలి

హాస్టళ్లలో జాగ్రత్తగా ఉండాలి

కరోనా నిలకడగానే ఉంది మూడో దశ ముప్పుపట్ల అప్రమత్తంగా ఉండాలి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సామాజిక సారథి, హైదరాబాద్‌: కరోనా విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పాఠశాలల్లో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మంత్రి సోమవారం కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. విద్యాసంస్థల్లో ఎవరికి వారు కొవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం, […]

Read More