త్వరలోనే అందుబాటులోకి రానుంది బీఎస్ఎఫ్ 57వ రైజింగ్ డేలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జైసల్మేర్: దేశభద్రతకు డ్రోన్ల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో వాటి విధ్వంసక టెక్నాలజీని బీఎస్ఎఫ్, డీఆర్డీవో, ఎన్ఎస్జీ సంస్థలతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నామని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. త్వరలోనే ఇది భద్రతా బలగాలకు అందుబాటులోకి రానుందని తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వానికి సరిహద్దు భద్రతే.. దేశ భద్రత అని చెప్పారు. సరిహద్దుల రక్షణకు కావాల్సిన అత్యాధునిక సాంకేతికతను […]
సామాజిక సారథి, నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటై 15ఏళ్లు గడుస్తున్నా సమస్యల నుంచి మాత్రం బయటపడటం లేదని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. యూనివర్సిటీలో సరిపడా బోధన సిబ్బంది లేక సమస్యలతో సతమతమవుతున్నారని, వందలాది మంది పేదవిద్యార్థులు చదివే యూనివర్సిటీలో విద్యాబోధన సరిగ్గాలేదన్నారు. ఆస్పత్రి నిర్మించినా నిరూపయోగంగా ఉండటంపై విస్మయం వ్యక్తం చేశారు. డాక్టర్లను నియమించక […]
రైతులకు గుడ్న్యూస్ 15వ తేదీలోగా రైతుల ఖాతాల్లోకి అవసరమయ్యే నిధి రూ.7,500కోట్లు అధికారులకు సీఎం కేసీఆర్ఆదేశాలు సిద్ధంచేస్తున్న వ్యవసాయ, ఆర్థికశాఖలు వానాకాలంలో 60.84 లక్షల మందికి పంపిణీ సామాజిక సారథి, హైదరాబాద్: రాష్ట్ర రైతులకు గుడ్ న్యూస్.. యాసంగిలో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు డబ్బు త్వరలోనే చేతికి రానుంది. యాసంగి సీజన్ పంట సాగు ఇప్పటికిప్పుడే ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరో 10రోజుల్లో రైతుబంధు నిధులు పంపిణీ చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ఆదేశాలు ఇచ్చారు. ఎకరానికి […]
భూవివాదం కేసులో నల్లగొండ టూ టౌన్పోలీసుల ఓవరాక్షన్ సోషల్మీడియాలో వైరల్గా మారిన ఘటన ఉదంతంపై విచారణకు ఆదేశించిన ఎస్పీ రంగనాథ్ విచారణ అధికారిగా డీటీసీ ఎస్పీ సతీష్ చోడగిరి సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: ఓ కేసు విషయంలో ఓ దళిత యువకుడిని పోలీసులు విచారణ పేరుతో నల్లగొండ టూ టౌన్పోలీస్ స్టేషన్కు పిలిచి చితకబాదారు. ఈ ఘటనలో అతని కాలు విరిగింది. ఉదంతం కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సంఘటనపై సమగ్ర విచారణకు […]
గాంధీభవన్లో కాంగ్రెస్నేత మల్లికార్జున ఖర్గే నివాళి దేవరయాంజల్ లోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు సామాజికసారథి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజల్ లోని వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో చివరి కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం రోశయ్య పార్థివదేహాన్ని అమీర్పేటలోని స్వగృహం నుంచి గాంధీభవన్కు తరలించారు. కాంగ్రెస్ కురువృద్ధులు, రాష్ట్ర ఆర్థికానికి అద్భుతంగా దిశానిర్దేశం చేసిన మహామేధావి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య పార్థివదేహం […]
సామాజిక సారథి, రామాయంపేట: నేషనల్ రూరల్ కబడ్డీ ఈవెంట్స్ లో మెదక్ జిల్లా టీం ఛాంపియన్ లుగా నిలిచారు. ఈ నెల 3,4,5 తేదీలలో మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ లోని ప్రీతి సుధాజి ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో మహారాష్ట్ర రూరల్ గేమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్ లో ఆదివారం మెదక్ టీం ఛాంపియన్ లుగా నిలిచినట్లు కెప్టెన్ రాకేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారికి హర్యానా నేషనల్ ఇన్ స్ట్యూట్ ఆఫ్ […]
సామాజిక సారథి, నవాబుపేట్: దళితుల భూములు ఆక్రమిస్తే జైలుకు వెళ్లడం ఖాయమనీ మానవ హక్కుల నాయకులు రాములు అన్నారు. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని గురుకుంట గ్రామ శివారులో గలా సర్వే నెంబర్ 53,64/2 ప్రభుత్వ పట్టా భూమి ఇనాం, గైరాన్ భూములను ఆక్రమించి రోడ్డు వేసిన వ్యక్తులు, నవాబుపేట్ మెడికల్ డాన్ సిద్దూ, రాజేష్ ప్రతినామం కొండల్, దరిపల్లి శివారు సర్వేనెంబర్ 201 పట్టడారులు వెంకటేష్ గౌడ్, వెంకటేష్ కుమారుడు శ్రీకాంత్ గౌడ్, విజయ్ రామగౌడ్, […]
ఆత్మగౌరవం కోసమే ఎమ్మెల్సీగా పోటీ టీఆర్ఎస్ పార్టీకి చెమటలు పట్టిస్తున్నాం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి వంగూరి లక్ష్మయ్య సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యంచేసే కుట్ర చేస్తోందని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య ఆరోపించారు. నల్లగొండలోని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి స్థానిక సంస్థలకు […]