సామాజిక సారథి, ఆమనగల్లు: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని డీసీసీబీ డైరెక్టర్, పీఎసీఎస్ చైర్మన్ గంప వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 10 రోజుల్లో ఆమనగల్లు, కడ్తాల్ మండలాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మద్దతు ధర పొందాలన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అదేవిధంగా రైతులకు కావలసిన ఋణ సదుపాయాన్ని వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ […]
సామాజిక సారథి, నడికూడ : రాష్ర్ట ప్రభుత్వం పంట నష్టం జరిగితే రైతులను ఆదుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా నడికూడలో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరకాల మండలాల్లోని పలు గ్రామాలలో రైతులతో కలిసి దెబ్బతిన్న మిర్చి పంటలు మొక్కజొన్న పంటలను పరిశీలించారు. అనంతరం పరకాల మండలం మలక్కపేటలో రైతులను పరామర్శించి మాట్లాడారు. ప్రకృతి సృష్టించిన ఈ బీభత్సానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి రైతులను ఆదుకోవాలని, వెంటనే పంట […]
మండిపడ్డ బీజేపీ నేత విజయశాంతి సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతరం సహా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్ నేడు రైతులను మోసగించాలని చూస్తున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. అయితే రైతన్నలు మోసపోయే స్థితిలో లేరని గ్రహించాలన్నారు. ఎన్ని ఎత్తులు, జిత్తులు చేసినా రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ను ప్రజలు గద్దె దించుతారని ఆమె జోస్యం చెప్పారు. రైతులు యాసంగి వరి సాగు చేయొద్దని చెప్పి, కాదని వేస్తే కొనుగోలు […]
సంగారెడ్డి జిల్లాలో రైతుబంధు జమ వెల్లడించిన కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి: రైతుబంధు పథకం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు జిల్లాలో 8 విడతలుగా 2,71,756 మంది రైతుల ఖాతాల్లో 2, 453 కోట్ల 48 లక్షల 26 వేల 654 రూపాయలు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు . జిల్లాలో తొలి విడత 280,50,35,800 రూపాయలు, రెండవ విడత 268 కోట్ల 08 లక్షల 87 వేల 450 రూపాయలు, […]
నేటినుంచి రైతుబంధు నిధులు విడుదల యాసంగి పెట్టుబడి కోసం ఖాతాల్లో జమ 66.61 లక్షల మంది రైతులకు రూ.7,645.66 కోట్లు సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతుబంధు సొమ్మును ఈనెల 28వ తేదీ నుంచి నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. యాసంగి పంట పెట్టుబడులకు సంబంధించి నిధులు పంపిణీ చేయనుంది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఏడు విడతల్లో రూ.43,036.63 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమచేశారు. ఈ సీజన్ […]
ధాన్యం అమ్ముకోలేక నానాఇబ్బందులు డిండి ముంపు రైతులను ఆదుకోవాలి ‘ధరణి’లో తప్పులు ప్రభుత్వ వైఫల్యమే బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నల్లమలలో కొనసాగుతున్న బహుజన రాజ్యాధికార యాత్ర సామాజికసారథి, అచ్చంపేట/చారకొండ: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పురుగుమందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం స్పందించడంలేదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ధరణి పోర్టల్ లో భూమి తప్పుగా నమోదైందని, భువనగిరి కలెక్టరేట్ […]
సామాజిక సారథి, వెల్దండ: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(డీ82) కాల్వలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని నాగర్ కర్నూల్ జిల్లా చెరుకూరు, పరిసర గ్రామాల బాధిత రైతులు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో భాగంగా చెరుకూరు, భర్కత్ పల్లి, గానుగట్టుతండా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెరుకూరు సర్పంచ్ రేవతి రాజశేఖర్ ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించారు. ప్రభుత్వం భూములు తీసుకొని ఏళ్లు గడుస్తున్నా నష్టపరిహారం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని […]
రైతులకు సూచించిన సీఎం కేసీఆర్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తండ్రి మృతికి నివాళి సామాజిక సారథి, జోగుళాంబ గద్వాల: గద్వాల పర్యటనలో భాగంగా గురువారం సీఎం కేసీఆర్ మార్గమధ్యంలో ఆగి మహేశ్వర్రెడ్డి, రాముడు అనే ఇద్దరు రైతులు సాగుచేసిన మినుము, వేరుశనగ పంటలను పరిశీలించారు. గింజనాణ్యత, రైతులు వాడుతున్న ఎరువుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరుతడి పంటలే వేయాలని సీఎం కేసీఆర్ రైతులకు సూచించారు. దీంతో రాజకీయ చీడ కూడా తొలగిపోతుందన్నారు. ఆరుతడి పంటల […]