Breaking News

భారీవర్షం

పల్లె, పట్టణం అతలాకుతలం

పల్లె, పట్టణం అతలాకుతలం

సారథి న్యూస్, హైదరాబాద్: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ​రాష్ట్రాల వ్యాప్తంగా భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఆదివారం రాత్రి ప్రారంభమైన వాన ఆగుతూ.. ఆగుతూ పడుతూనే ఉంది. ఇప్పటికే రాజధాని నగరం హైదరాబాద్.. ​భారీ వర్షానికి జలమయమైంది. నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హిమాయత్​ సాగర్​ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరింది. ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా జీహెచ్ఎంసీ అధికారులు, హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల‌ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో పలుచోట్ల […]

Read More
ఉప్పొంగిన పెద్దవాగు

ఉప్పొంగిన పెద్దవాగు

రాయిచూర్ మార్గంలో నిలిచిపోయిన రాకపోకలు మానవపాడు– అమరవాయి మధ్య స్తంభించిన రవాణా సారథి న్యూస్, మానవపాడు: భారీ వర్షాలు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఉమ్మడి మండలంలోని పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో మానవపాడు –అమరావతి గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బ్రిడ్జి పైనుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో అటుగా వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇదే వాగు బొంకూరు శివారులో రాయిచూరు ప్రధాన రహదారిపై ఉప్పొంగి ప్రవహించడంతో […]

Read More
భారీవర్షానికి కూలిన ఇల్లు

భారీవర్షానికి కూలిన ఇల్లు

సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూర్ గ్రామంలో భారీవర్షానికి గ్రామానికి చెందిన బోయ నడిపి ఉషన్న ఇల్లు శనివారం రాత్రి కూలిపోయింది. సర్పంచ్ శ్రీలత భాస్కర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణ సాయంగా రూ.రెండువేలు అందజేశారు. బాధిత కుటుంబసభ్యులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని భరోసా ఇచ్చారు. ఆమె వెంట భాస్కర్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.

Read More
సిటీలో వర్ష బీభత్సం

సిటీలో వర్ష బీభత్సం

ఎల్బీనగర్ నియోజకవర్గంలో పలు కాలనీలు జలమయం ఇబ్బందుల్లో పలు లోతట్టు కాలనీవాసులు సారథి న్యూస్, ఎల్బీనగర్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్​నగరంలో శుక్రవారం రాత్రి కురిసిన కుండపోత వానకు ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని చైతన్యపురి, కర్మన్​ఘాట్, హస్తినాపురం, హయత్​నగర్, నాగోల్, మన్సురాబాద్, బీఎన్​రెడ్డి నగర్ డివిజన్లలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హయత్ నగర్ లో రోడ్ల వరద నీటి ఉధృతికి కోతకు గురయ్యాయి. మట్టిరోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. లోతట్టు కాలనీల్లోని ఇళ్లలోకి […]

Read More
వరద ప్రాంతాల్లో మంత్రి పర్యటన

వరద ప్రాంతాల్లో మంత్రి పర్యటన

సారథి న్యూస్, మహబూబ్ నగర్: మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శనివారం పర్యటించారు. నాలాలపై చేపట్టిన అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రి జిల్లా కేంద్రంలో భారీవర్షం కారణంగా జలమయమైన ప్రాంతాల్లో పర్యటించారు. రామయ్యబౌలి, బీకేరెడ్డి కాలనీ, భగీరథ కాలనీ, గణేష్ నగర్, ఎంబీసీ కాంప్లెక్స్, బృందావన్ కాలనీలో కలియతిరిగారు. జలదిగ్బంధమైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాలాలపై […]

Read More
ముంపు బాధితులకు అండగా ఉంటాం

ముంపు బాధితులకు అండగా ఉంటాం

సారథి న్యూస్​, వరంగల్​: వరంగల్ మహానగరంలో భారీవర్షాలకు నీటమునిగిన లోతట్టు కాలనీలు, పలు ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం పరిశీలించారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నగరంలోని ములుగు రోడ్డు, కాశీబుగ్గ, పద్మానగర్, ఎస్ఆర్ నగర్, చిన్నవడ్డేపల్లి చెరువు, తులసి బార్, సమ్మయ్య నగర్, నయీనగర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా కలియ […]

Read More
మట్టిమిద్దెల్లో ఉండేటోళ్లు జాగ్రత్తగా ఉండాలే

మట్టిమిద్దెల్లో ఉండేటోళ్లు జాగ్రత్తగా ఉండాలే

సారథి న్యూస్, వెల్దండ: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నాగర్​కర్నూల్​ జిల్లా వెల్దండ తహసీల్దార్ జి.సైదులు సూచించారు. గ్రామాల్లో పాత మట్టిమిద్దెల్లో నివాసం ఉంటున్నవారు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించకుండా ముందస్తుగా సురక్షిత నివాస ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వర్షాలకు గ్రామాల్లో దెబ్బతిన్న ఇళ్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత వీఆర్వో, వీఆర్ఏలకు తెలియజేయాలని కోరారు. రెవెన్యూ సిబ్బంది గ్రామాల్లో అందుబాటులో ఉంటారని స్పష్టంచేశారు. ఇళ్లు కోల్పోయి ఇబ్బంది పడుతున్న వారు ప్రభుత్వ […]

Read More
వాగులో చిక్కినవారు సేఫ్​

చలివాగులో చిక్కినవారు సేఫ్​

జయశంకర్‌ భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చలివాగులో చిక్కుకున్న టేకుమాట్ల మండలం కుందనపల్లికి చెందిన 10 మంది రైతులు సురక్షితంగా బయటపడ్డారు. ఉదయం వ్యవసాయ బావి మోటార్లను తీసుకొచ్చేందుకు వాగులోకి వెళ్లిన రైతులు అందులోనే చిక్కుకున్నారు. తక్షణం స్పందించిన మంత్రి కె.తారక రామారావు రెండు ఎయిర్ ఫోర్స్ ​హెలిక్యాప్టర్లను పంపించారు. వారిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. వారు క్షేమంగా బయటికిరావడంతో కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మంత్రి ఎర్రవబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి […]

Read More