Breaking News

NAGARKURNOOL

కందనూలుకు తీరనున్న కష్టాలు

# పెరిగిన నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీ పడకలు# 300 పడకల నుంచి 605 పడకలకు పెంపు# ఫలించిన ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కృషి# హెల్త్ మినిష్టర్ దామోదర రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే సామాజికసారథి, నాగర్ కర్నూల్: కందనూలు ప్రజలకు వైద్యం కష్టాలు తీరనున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ వద్ద మెడికల్ కాలేజీ పడకలు భారీగా పెరుగనున్నాయి. ఇదివరకు ఇక్కడ కేవలం 300 పడకల ఆసుపత్రి ఉండగా రోగులకు సరిపడ వైద్య సేవలు […]

Read More
మిద్దె కూలి తల్లీకూతుళ్లు, కొడుకు మృతి

మిద్దె కూలి తల్లీకూతుళ్లు, కొడుకు మృతి

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాగర్​ కర్నూల్​ మండలం పరిధిలోని వనపట్లలో ఆదివారం రాత్రి ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన తల్లి, పిల్లలు నలుగురు మృతిచెందారు. స్థానికుల కథనం.. గ్రామానికి చెందిన గొడుగు పద్మ (26), భర్త భాస్కర్​.. ఇద్దరు కూతుళ్లు పప్పి(6), వసంత(6), కుమారుడు విక్కి(7నెలలు)తో నివాసం ఉంటున్నారు. భాస్కర్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే తిని ఇంట్లో పడుకున్నారు. ఆదివారం కురిసిన వర్షానికి […]

Read More

సీరియల్ కిల్లర్ కేసుపై పోలీస్ ఉన్నతాధికారుల నజర్

. వనపర్తి జిల్లా రేవల్లి హత్య కేసు వివరాల పై ప్రత్యేకంగా ఆరా. 2020 లోనే సీరియల్ కిల్లర్ కు సహకరించిన వనపర్తి జిల్లా పోలీసులు. కాసుల కక్కుర్తితో సీరియల్ కిల్లర్ పై దృష్టిపెట్టని పోలీసులు. ఇదే అదునుగా మరింత రెచ్చిపోయిన సీరియల్ కిల్లర్. 2022 లో నాగర్ కర్నూల్ జిల్లాలో మరి కొందరి బలి సామాజిక సారథి, నాగర్ కర్నూల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ హత్యల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. […]

Read More
ప్రచారానికి కొన్నిగంటలే!

ప్రచారానికి కొన్నిగంటలే!

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల సమరానికి తెలంగాణ రాష్ట్రంలో నేటితో ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. నాలుగో విడతలో భాగంగా సోమవారం తెలంగాణ రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలలో పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి నేటి సాయంత్రంతో ప్రచార గడువు ముగుస్తుండటంతో అభ్యర్థులు పోల్ మేనేజ్ మెంట్​ పైన దృష్టిపెట్టనున్నారు. దీనికి ఆదివారం ఒక్కరోజు కీలక కావడంతో ఏయే నియోజకవర్గాల్లో ఏ వ్యూహాలను అనుసరించాలి, ఎక్కడెక్కడ తమకు అనుకూలంగా లేని పరిస్థితులను మార్చుకోవాలన్న దానిపై దృష్టిసారించారు. […]

Read More
మల్లు రవి సారూ.. ఇదేం తీరు?

మల్లు రవి సారూ.. ఇదేం తీరు?

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్​ కర్నూల్​ ఎంపీ అభ్యర్థి డాక్టర్​ మల్లు రవిపై కేడర్​ లో అసహనం వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గ్రామాల్లో తిరగనీయకుండా కార్యకర్తలపై దాడిచేసి వాళ్లను తిరిగి మళ్లీ ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం పట్ల పలు నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. ఇలా చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగే కంటే కీడు ఎక్కువగా జరుగుతుందని, పార్టీ […]

Read More
పాలమూరుకు కేసీఆర్‌ అన్యాయం

పాలమూరుకు కేసీఆర్‌ అన్యాయం

సామాజికసారథి, కొడంగల్​/నాగర్​ కర్నూల్​ బ్యూరో: పాలమూరుకు కేసీఆర్‌ తీరని అన్యాయం చేశారని సీఎం రేవంత్​ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కమీషన్ల కక్కుర్తితో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా ఉందన్నారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, రాజోలిబండ, తుమ్మిళ్ల ప్రాజెక్టుల వద్ద కుర్చీ వేసుకుని పనులు పూర్తిచేస్తానని చెప్పిన కేసీఆర్‌.. సీఎం అయిన తర్వాత ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. మంగళవారం నారాయణపేట జిల్లా మద్దూరులో కొడంగల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ముఖ్యనాయకుల సమావేశంలో […]

Read More
నాగర్​ కర్నూల్​ లో మల్లు రవికి షాక్​

నాగర్​ కర్నూల్​లో మల్లు రవికి షాక్​

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈలోపే ఆయా పార్టీల్లో లుకలుకలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున నాగర్ కర్నూల్ పార్లమెంట్​ అభ్యర్థిగా పోటీచేస్తున్న మల్లు రవి ప్రచారంలో కాస్త వెనకబడ్డారని చెప్పొచ్చు. బుధవారం నిర్వహించిన రోడ్​ షో అట్టర్​ ప్లాప్​ అయింది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఎస్సీల్లో మెజారిటీ అయిన మాదిగల ఓట్లు 3.80 లక్షలకు పైగా ఉండగా మాలల […]

Read More
ఎస్సీ వర్గీకరణపై నేను కొట్లాడతా..

ఎస్సీ వర్గీకరణపై నేను కొట్లాడతా..

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​ బ్యూరో: ఎస్సీ వర్గీకరణపై నాగర్​ కర్నూల్​ బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థి డాక్టర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ స్పందించారు. ఎస్సీలను కాంగ్రెస్​, బీజేపీలు మోసం చేశాయని విమర్శించారు. శనివారం ఆయన నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లిలో మీడియాతో మాట్లాడారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పదేళ్లలో ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కనీసం ఒక ఆర్డినెన్స్​ ను కూడా తీసుకురాలేకపోయారని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేశారా? ప్రజలకు చెప్పాలని […]

Read More