Breaking News

ఎర్రబెల్లి

రైతుల అభ్యున్నతికి కృషి

రైతుల అభ్యున్నతికి కృషి

సారథి న్యూస్, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని మొరిపిరాల, కాంట్రావపల్లి, కేశవపురం గ్రామాల్లో గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సుడిగాలి పర్యటన చేశారు. రూ.1.57 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలో జరిగిందన్నారు. రైతుల అభ్యున్నతికి పాటుపడిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. కార్యక్రమంలో వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, వివిధ శాఖల […]

Read More
వైద్యారోగ్యశాఖ పనితీరు భేష్​

వైద్యారోగ్యశాఖ పనితీరు భేష్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: వైద్యారోగ్యశాఖను బలోపేతం చేసేందుకు సీఎం కె.చంద్రశేఖర్​రావు నియమించిన కేబినెట్ సబ్ కమిటీ గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమావేశమైంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి కె.తారక రామరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఆరునెలలుగా వైద్యారోగ్యశాఖ చాలా బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకున్నారని కొనియాడారు. మహమ్మారి కట్టడికి కృచేసిన వైద్యులు, […]

Read More
మహిళాసాధికారతే ప్రభుత్వ ధ్యేయం

మహిళాసాధికారతే ప్రభుత్వ ధ్యేయం

సారథి న్యూస్, హైద‌రాబాద్: మ‌హిళా సాధిరాకత, స్వయం సమృద్ధే లక్ష్యంగా పేద మ‌హిళ‌ల‌ను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఫుడ్​ప్రాసెసింగ్​యూనిట్లపై ప్రభుత్వం దృష్టిపెట్టిందని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. పేద‌రిక నిర్మూల‌న సంస్థ(సెర్ప్) ఆధ్వర్యంలో హైద‌రాబాద్లోని రాజేంద్రనగర్​, టీఎస్ ఐపార్డ్ లో గురువారం నిర్వహించిన వర్క్​షాపునకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాళేశ్వరం, దేవాదుల‌, ఎస్సారెస్పీ వంటి అనేకానేక ప్రాజెక్టుల‌తో జ‌లవిప్లవం వచ్చిందన్నారు. వ్యవసాయ ఆధారిత […]

Read More
ముంపు బాధితులకు అండగా ఉంటాం

ముంపు బాధితులకు అండగా ఉంటాం

సారథి న్యూస్​, వరంగల్​: వరంగల్ మహానగరంలో భారీవర్షాలకు నీటమునిగిన లోతట్టు కాలనీలు, పలు ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం పరిశీలించారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నగరంలోని ములుగు రోడ్డు, కాశీబుగ్గ, పద్మానగర్, ఎస్ఆర్ నగర్, చిన్నవడ్డేపల్లి చెరువు, తులసి బార్, సమ్మయ్య నగర్, నయీనగర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా కలియ […]

Read More
ఆ సత్తా మనకుంది

ఆ సత్తా మనకుంది

సారథి న్యూస్​, వరంగల్​ : ‘కరోనా లాంటి విపత్తులను అనేకం మనం ఎదుర్కొన్నాం..దీనిని ఎదుర్కొనే సత్తా మనకు ఉంది.. ప్రజలెవ్వరూ భయపడవద్దు’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్​, ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. మంత్రులు మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులతో  సీఎస్సార్ గార్డెన్స్ లో కోవిడ్ 19 పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ మన రాష్ట్రాన్నే కాదు కరోనా మహమ్మారి యావత్ […]

Read More
కరోనా పేషంట్లను కరుణతో చూద్దాం

కరోనా పేషంట్లను కరుణతో చూద్దాం

 ప్రజల్లో ధైర్యాన్ని నింపండి తప్పుడు ప్రచారాలు చేయొద్దంటూ…మీడియా, సోషల్ మీడియాకు విజ్ఞప్తి  సారథి న్యూస్​, హైదరాబాద్: మనమంతా మనుషులం..సాటి మనుషుల మీద మానవత్వాన్ని చాటుదాం. మన తోటి వాళ్లందరినీ గౌరవిద్దాం. మరీ ముఖ్యంగా కరోనా పేషంట్లని కరుణతో చూద్దాం. కరోనా బాధిత శవాలకు గ్రామాల్లో అంత్యక్రియలు నిర్వహించేలా అనుమతిద్దాం…అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాక్షేత్రంలో తనతోపాటు విస్తృతంగా తిరిగిన తన సిబ్బందిలో కొందరికి పాజిటివ్ […]

Read More
మాస్కు లేదా.. తీస్కో

మాస్కు లేదా.. తీస్కో

సారథి న్యూస్, జనగామ: జనగామ జిల్లా కొండకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామం నుంచి మంగళవారం కొండకండ్ల మండల కేంద్రానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెళ్తున్నారు. మార్గమధ్యంలో వ్యవసాయ పనులు చేస్తున్న కూలీలను చూసి కారు ఆపారు. వారికి మాస్కులు లేకపోవడంతో వాటిని పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కూలీలకు సూచించారు.

Read More

హరితహారానికి రెడీ కండి

సారథి న్యూస్​, మెదక్​: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్​ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులకు సూచించారు. సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన అధికారులతో మాట్లాడారు. ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. మొక్కలను పూర్తిగా శాస్త్రీయ పద్ధతుల్లో మట్టి తీసి, వర్మి కంపోస్టు ఎరువును వాడుతూ నాటాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో హనోక్ […]

Read More