Breaking News

వెల్దండ

తెల్లారిన బతుకులు

తెల్లారిన బతుకులు

సామాజికసారథి, రంగారెడ్డి బ్యూరో/వెల్డండ: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు.. నలుగురికి రుచికరమైన వంటలు చేసిపెట్టడమే వారి వృత్తి. ఓ శుభకార్యంలో వంటలు చేసి ఇళ్లకు బయలుదేరిన నలుగురు యువకులు శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్​- శ్రీశైలం హైవేపై మహేశ్వరం మండలం తుమ్మలూర్​ వద్ద ఈ యాక్సిడెంట్​ జరిగింది. నాగర్​ కర్నూల్​ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన ఇమ్మరాజు రామస్వామి(36), బైకాని యాదయ్య (35), హెచ్.​ […]

Read More
ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ చోరీ

కొట్ర ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ చోరీ

సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్​ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో ఇటీవల పున:ప్రతిష్టాపన చేసిన అభయ ఆంజనేయస్వామి ఆలయంలో దొంగలుపడ్డారు. భక్తులు సమర్పించిన కానుకలను ఉంచిన హుండీని రాత్రికిరాత్రే ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగుచూసింది. హుండీలో సుమారు రూ.రెండులక్షల మేర ఉండవచ్చని గ్రామ సర్పంచ్, ఆలయ ధర్మకర్త పొనుగోటి వెంకటేశ్వర్​రావు తెలిపారు. కాగా, ఆలయం పున:నిర్మాణం అనంతరం మార్చి 23, 24, 25వ తేదీల్లో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలను అంగరంగ వైభవంగా జరిపించారు. విశేషసంఖ్యలో […]

Read More
సీసీ కెమెరాల ఏర్పాటు భేష్​

సీసీ కెమెరాల ఏర్పాటు భేష్​

సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా ఎస్పీ మనోహర్​ మంగళవారం వెల్దండ పోలీస్​స్టేషన్​ను ఆకస్మికంగా సందర్శించారు. ఎస్సై నర్సింహులును అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. పోలీస్​స్టేషన్​కు వచ్చే బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, వాటి సత్వర పరిష్కారం చూసి ప్రశంసించారు. రికార్డులను పరిశీలించి భేష్ ​అని కితాబు ఇచ్చారు. సీసీ కెమెరాలను ఏర్పాటుకు చూపిన ప్రత్యేక చొరవను చూసి ఎస్సైని ప్రత్యేకంగా అభినందించారు. గార్డెనింగ్, స్టేషన్ ​ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి ప్రశంసలు కురిపించారు. సీసీ కెమెరాలు ఏర్పాటుతో […]

Read More
జేపీ.. గొప్ప గుణం

జేపీ.. గొప్పగుణం

తండ్రి జ్ఞాపకార్థం బెంచీల వితరణ సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండల మాజీఎంపీపీ పకాడి జయప్రకాశ్ (జేపీ)​ మరోసారి తన గొప్ప సేవాగుణాన్ని చాటుకున్నారు. ప్రయాణికులు, సామాన్యులు, సందర్శకుల కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి తహసీల్దార్ ఆఫీసు, ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ, సీఐ కార్యాలయం ఆవరణలో సిమెంట్ ​బెంచీలను ఏర్పాటుచేశారు. కాగా, మండలంలోని బొల్లంపల్లి పంచాయతీ చల్లపల్లి గ్రామానికి చెందిన దివంగత మాజీ సర్పంచ్ పకాడి రత్నయ్య ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. అప్పట్లో పేదలకు […]

Read More
వైభవంగా మహా మండల పూజ

వైభవంగా మహా మండల పూజ

సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలంలోని కొట్ర గ్రామంలో ఆంజనేయ ఆలయం పున:ప్రతిష్టాపన సందర్భంగా భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో సర్పంచ్ పొనుగోటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం మహా మండల పూజను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పుణ్యహవచనం, అభిషేకం, గణపతి నవగ్రహ మన్య సూక్తహోమం భక్తాంజనేయ స్వామి సహస్ర నామావళి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హోమాలు జరిపించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. గ్రామస్తులు సర్పంచ్​ పొనుగోటి వెంకటేశ్వరరావు, రుక్మిణి దంపతులను […]

Read More
నమో.. లక్ష్మీనారసింహా!

నమో.. లక్ష్మీనారసింహా!

సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్​ జిల్లా వెల్దండ మండలంలోని భైరాపూర్ గ్రామంలో మూడు రోజుల నుంచి కొనసాగిన స్వయంభు లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం రథోత్సవం , చక్రస్నానం, ఆశీర్వచనం, దీపోత్సవ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. మూడు రోజులుగా నుంచి నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామి వారి కల్యాణ మహోత్సవం, సోమవారం నిత్యహోమం, పూర్ణహుతి, పుష్పయాగం తదితర కార్యక్రమంలో మంగళవారం రథోత్సవం ముగించారు. బ్రహ్మోత్సవాలకు గ్రామస్తులు, బంధువులు పెద్దఎత్తున తరలివచ్చారు. గ్రామంలో పండగ వాతావరణం […]

Read More
ఆంజనేయుడి ఆలయానికి భారీ విరాళం

ఆంజనేయుడి ఆలయానికి భారీ విరాళం

సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలంలోని కొట్ర గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయ పున: ప్రతిష్టాపన సహిత ధ్వజ నవగ్రహ, శిఖర యంత్ర ప్రతిష్టాపన మహోత్సవం శనివారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కార్యక్రమంలో భాగంగా ఉదయం గణపతిపూజ, పుణ్యహవాచనం, పంచగవ్య మేళనంతో పాటు నవగ్రహవిగ్రహాలను ఊరేగింపుగా నిర్వహించారు. అదేవిధంగా సాయంత్రం అగ్ని త్రిష్ట, కుండసంస్కారం, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ పొనుగోటి భాస్కర్​రావు, […]

Read More
ఎమ్మెల్యే, ఆర్డీవో, తహసీల్దార్​ముంచిన్రు

ఎమ్మెల్యే, ఆర్డీవో, తహసీల్దార్​ ముంచిన్రు

55.02 ఎకరాల మా భూమిను రియల్ ఎస్టేట్ వెంచర్ కు అమ్ముకున్నరు వెల్దండ తహసీల్దార్ ​ఆఫీసు ఎదుట బాధిత రైతుల ఆందోళన సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్​ జిల్లా మండలంలోని చెర్కూర్ శివారులో చౌదర్ పల్లి రైతులకు సంబంధించిన 55.02 ఎకరాల భూమిని కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికారులు కలిసి ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ కు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపిస్తూ.. మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధిత రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ […]

Read More