సారథి న్యూస్, ఎల్బీ నగర్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ గుంతలుపడి బురదమయంగా మారాయి. మరమ్మతులు చేపట్టడంలో జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టేలా టీడీపీ నాయకులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం హయాత్నగర్ డివిజన్ పరిధిలోని అన్మగల్, హయత్నగర్ లో టీడీపీ డివిజన్ అధ్యక్షుడు దాసరమొని శ్రీనివాస్ ముదిరాజ్, పార్టీ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్ఫర్మేషన్ కాలనీ, వెంకటాద్రికాలనీ, సత్యనారాయణ కాలనీల్లో వరి నాట్లు వేసి నిరసన […]
సారథి న్యూస్, ఎల్బీనగర్: టీడీపీ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎస్ వీ కృష్ణప్రసాద్ జన్మదినం సందర్భంగా బుధవారం హయత్నగర్ డివిజన్ పార్టీ అధ్యక్షుడు దాసరమోని శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి మురళీధర్రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఎస్వీ కృష్ణప్రసాద్ను బుధవారం ఆయన నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ డివిజన్ జనరల్ సెక్రటరీ కాటెపాక ప్రవీణ్కుమార్, పిడుగు రవీందర్, జెనిగె మహేందర్, భరత్ రెడ్డి, జాన్ రెడ్డి, పలువురు […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమితమైన సోమిశెట్టి వెంకటేశ్వర్లును సోమవారం ఘనంగా సన్మానించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పార్టీ కార్యదర్శి ధరూరు జేమ్స్, కార్యదర్శి కె.నాగేంద్ర కుమార్, పోతురాజు రవికుమార్, సత్రం రామక్రిష్ణ, టీఎన్ఎస్ఎఫ్నాయకులు రాజుయాదవ్, తిరుపాల్ బాబు, నారాయణరెడ్డి, మంచాలకట్ట భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
సారథిన్యూస్, అమరావతి: ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని ఎలాగైనా బలోపేతం చేయాలని చంద్రబాబు నాయుడు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోపార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జీలుగా కొత్తవారికి బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు ప్రతి రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఒక సమన్వయకర్తను నియమించారు. ప్రస్తుతం కొనసాగుతున్నవారిని పక్కనపెట్టి ఈ అవకాశం కల్పించారు. కొత్తనేతలంతా పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేయాలని బాబు పిలుపునిచ్చారు. పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుల జాబితా విజయవాడ : నెట్టెం రఘురాంమచిలీపట్నం: కొనకళ్ళ నారాయణగుంటూరు: తెనాలి శ్రవణ్ […]
హయత్నగర్లో కార్యకర్తలతో భారీర్యాలీ ఆయన వెంటే పలువురు అనుచరులు సారథి న్యూస్, ఎల్బీ నగర్: హయత్నగర్ డివిజన్కు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి ఆ పార్టీని వీడారు. శనివారం ఆయన పెద్దసంఖ్యలో తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి టీడీపీ హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు దాసరమోని శ్రీనివాస్ ముదిరాజ్ సమక్షంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ఎస్వీ క్రిష్ణప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. హయత్నగర్ డివిజన్ కేంద్రంలో టీడీపీ జెండాను ఎగరవేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు […]
ఫిర్యాదుచేసిన వ్యక్తికే తెలియకుండా.. కేసు నమోదు ఎస్పీని కలుస్తానన్న ఫిర్యాదుదారుడు సారథి న్యూస్, కర్నూలు: లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కైలాస్ నాయక్ అరెస్టు వెనక రాజ‘కీ’య కారణాలు ఉన్నాయనే విమర్శలు వ్కక్తమవుతున్నాయి. జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని కర్నూలు మండలం సుగాలితండాకు చెందిన 150 కుటుంబాలకు రుద్రవరం గ్రామంలో 1975లో అప్పటి ప్రభుత్వ ఐదెకరాల చొప్పున పంపిణీ చేసింది. సర్వేనం.507‘ఏ’ లోని దాదాపు 95 ఎకరాలను ఇటీవల పేదలకు ఇళ్లస్థలాల కోసం రాష్ట్ర […]
సారథిన్యూస్, విశాఖపట్నం: ‘మేము మూడు రాజధానులకు ఒప్పుకోం.. అమరావతే ఆంధ్రుల రాజధాని’ అని మంకుపట్టు పట్టిన టీడీపీకి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. ఇప్పటికే విశాఖకు చెందిన పలువురు నేతలు టీడీపీని వీడి వైఎస్సాఆర్ కాంగ్రెస్లో చేరారు. తాజాగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీకి గుడ్బై చెప్పనున్నారని సమాచారం. గణేశ్తో పాటు మరో ఎమ్మెల్యే కూడా చంద్రబాబుకు వీడ్కోలు చెప్పనున్నారట. గణేశ్.. కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఆదివారం ఆయన సీఎం […]
తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ బుధవారం సాయంత్రం కన్నుమూశారు. కొంత కాలంగా కరోనాతో అనారోగ్యంతో బాధపడుతున్న దుర్గాప్రసాద్ చైన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే హఠాత్తుగా గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దుర్గా ప్రసాద్ గతంలో చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2019లో వైఎస్సార్ సీపీలో చేరి తిరుపతి ఎంపీగా విజయం […]