సారథి న్యూస్, బిజినేపల్లి: రైతు వేదికల ప్రారంభం సందర్భంగా నిరసన తెలిపేందుకు వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్చేశారు. పాలెం గ్రామంలో నిర్మించిన రైతు వేదికను బుధవారం ప్రారంభించేందుకు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వస్తున్నారన్న విషయం తెలుసుకుని పెద్ద సంఖ్యలో వివిధ గ్రామాల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. రైతువేదిక భవనాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి లక్షల రూపాయలు వస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ చిత్రపటం […]
సారథి న్యూస్, ఖమ్మం: ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని రఘునాథపాలెం మండల కేంద్రంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రూ.40 లక్షలు సొంత ఖర్చులతో తన దివంగత సోదరుడు పువ్వాడ ఉదయ్ కుమార్ స్మారకార్థం రైతుల కోసం నిర్మించిన రైతువేదిక భవనాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సన్న ఒడ్లను కొంటామని స్పష్టంచేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రధాని సొంతం రాష్ట్రం […]
సారథి న్యూస్, హయత్నగర్: రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా హయత్నగర్డివిజన్ పరిధిలోని రంగనాయకులగుట్ట, బంజారాకాలనీ, అంబేద్కర్ కాలనీ, భగత్ సింగ్ కాలనీ లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. టీడీపీ హయత్ నగర్ డివిజన్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో తరలి వెళ్లి వరద నీళ్లలో చిక్కిన బాధితులను తాడు సాయంతో ఎత్తు ప్రదేశానికి తరలించారు. బాధితులందరికీ పునరావాసం […]
హయత్నగర్లో కార్యకర్తలతో భారీర్యాలీ ఆయన వెంటే పలువురు అనుచరులు సారథి న్యూస్, ఎల్బీ నగర్: హయత్నగర్ డివిజన్కు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి ఆ పార్టీని వీడారు. శనివారం ఆయన పెద్దసంఖ్యలో తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి టీడీపీ హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు దాసరమోని శ్రీనివాస్ ముదిరాజ్ సమక్షంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ఎస్వీ క్రిష్ణప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. హయత్నగర్ డివిజన్ కేంద్రంలో టీడీపీ జెండాను ఎగరవేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు […]
సారథి న్యూస్, అచ్చంపేట: కరోనా విపత్తులోనూ రూ.1,173కోట్లను రైతుబీమా కోసం చెల్లించామని వ్యవసాయశాఖ మంత్రి ఎస్.నిరంజన్రెడ్డి అన్నారు. రైతుబంధు పథకం ద్వారా 57లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.ఐదువేల చొప్పున అందించామన్నారు. గురువారం అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి నియామకం, అభినందన సభ నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా మంత్రి ఎస్.నిరంజన్రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్.నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. పంటల నమోదును రాష్ట్రంలో శాస్త్రీయంగా అమలు […]
సారథి న్యూస్, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్ఐ)లో భాగమైన గుడిపల్లి లిఫ్ట్ -3 నుంచి ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నీటిని విడుదల చేశారు. దీంతో కృష్ణాజలాలు కాల్వల వెంట పరుగులు తీశాయి. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ పద్మావతి, కలెక్టర్ ఎల్ శర్మన్, సర్పంచ్లు, […]
సారథి న్యూస్, రంగారెడ్డి: లాక్ డౌన్ సమయంలో పేదలకు ఆకలి తీర్చడంలోనే అసలైన సంతోషం ఉంటుందని శ్రీగాబ్రీయేల్ స్కూలు, న్యూటన్ గ్రీన్ ప్లే స్కూల్ విద్యాసంస్థల చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి అన్నారు. సోమవారం టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ జెండాను ఎగరవేశారు. అనంతరం హయత్ నగర్, మన్సురాబాద్ డివిజన్ లో ప్రింట్, అండ్ ఎలక్ర్టానిక్ మీడియా విలేకరులకు బియ్యం, నిత్యావసర సరుకులను […]