టాలీవుడ్, కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ నయనతార. ఆమె కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నష్ శివన్ తో ప్రేమలో ఉన్నట్టు అందరికీ తెలిసిన విషయమే. ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అది నిజమో కాదో తెలీదు కానీ..అవేమీ పట్టించుకోకుండా ఈ జంట ఓనమ్ కి సొంత ఊరు కొచ్చి కి వెళ్లారు. అక్కడ పండుగ జరుపుకొని కుటుంబంతో గోవా వెళ్లారు. అక్కడ అందరూ కలిసి నయన్ మదర్ బర్త్ డే […]
సారథిన్యూస్, అమరావతి: వైఎస్సార్ ఆసరా పేరుతో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకానికి జగనన్న టోకరా అనే పేరుపెట్టుకోవాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. మంగళవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ‘జగన్ మోహన్రెడ్డి ఆసరా పేరుతో మహిళలను మోసగిస్తున్నారు. డ్వాక్రా మహిళలంతా ఆసరా సొమ్ముతోనే బతుకుతున్నట్లు జగన్ తొత్తులు మాట్లాడుతున్నారు. ఈ పథకం జగన్మోహన్రెడ్డి కొత్తగా తీసుకురాలేదు. గత ప్రభుత్వంలోనే చంద్రబాబు డ్వాక్రా మహిళలకు రూ. 5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు […]
న్యూఢిల్లీ: లాక్డౌన్ తర్వాత భారతీయ రైల్వే 230 రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మే 12 నుంచి 30 స్పెషల్ రాజధాని రైళ్లు, జూన్ 1 నుంచి 200 స్పెషల్ మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడుపుతోంది. ఇక సెప్టెంబర్ 12వ తేదీ నుంచి మరో 80 రైళ్లను నడపనుంది. రైల్వేశాఖ ప్రకటించిన ప్రత్యేక రైళ్లలో కొన్ని తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ రైల్వే సర్వీసులను వినియోగించవచ్చు.తెలుగు […]
సారథిన్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో తమకు కావల్సిన బ్రాండ్ దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మందుబాబులకు ఏపీ హైకోర్టు గుడ్న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఎవరైనా ఇతర రాష్ట్రాలకు వెళ్లి తమకు నచ్చిన మూడు ఫుల్ బాటిళ్లు తెచ్చుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో తమకు కావాల్సిన బ్రాండ్లు దొరకక మందుబాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి తెచ్చుకుందామంటే పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సీజ్చేస్తున్నారు. ఏపీలోకి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురానివ్వక పోవడంపై దాఖలైన ఓ వ్యక్తి రిట్ […]
అమరావతి, సారథిన్యూస్: టీడీపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. ‘నాకు కరోనా సోకింది. ప్రస్తుతం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. 14 రోజులు క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచించారు. కొన్నిరోజుల పాటు కార్యకర్తలు, అభిమానులు ఎవరూ నా వద్దకు రావొద్దు. టీడీపీ అధినేత చంద్రబాబు, కార్యకర్తల ఆశీస్సులతో త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మీ ముందుకు వస్తా’ అంటూ ఆయన ట్వీట్టర్లో పేర్కొన్నారు. మరోవైపు […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. ప్రస్తుతం రమేశ్ ఆస్పత్రి, స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదంపై అధికార ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. రమేశ్ ఆస్పత్రి కరోనా పేషెంట్లను స్వర్ణప్యాలెస్ హోటల్లో ఉంచి చికిత్స అందించింది. ఈ క్రమంలో అగ్నిప్రమాదం జరిగి అందులో ఉన్న 10 మంది చనిపోయారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా, రమేశ్ ఆస్పత్రి యజమాని రమేశ్బాబు పరారీలో ఉన్నాడు. రమేశ్ బాబు కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి ప్రభుత్వం కక్ష గట్టిందని.. ప్రతిపక్ష టీడీపీ […]
సారథి న్యూస్, మానవపాడు: రోడ్డుప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటన ఏపీలోని కర్నూల్ సమీపంలో చోటుచేసుకున్నది. ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మాధవి ఎమ్మిగనూరు నుంచి కర్నూలు జిల్లా పంచలింగాలకు వెళ్తున్నది. ఈ క్రమంలో తుంగభద్ర బ్రిడ్జిపై వెనుక నుంచి వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధవి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
తూర్పుగోదావరి: ఎన్ని కఠినచట్టాలు వచ్చినా మృగాళ్ల ఆలోచనలో ఏ మార్పు రావడం లేదు. తాజాగా ఓ దుర్మార్గుడు ఓ బాలికకు టీలో మత్తుమందు ఇచ్చి ఆమెపై లైంగికదాడికి ఒడిగట్టాడు. ఈ దారుణఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మామాడికుదురు మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఓ గ్రామానికి చెందిన బాలిక కుటుంబంతో అదే గ్రామానికి చెందిన గుబ్బల రాజేంద్ర కుమార్ (21) సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం రాజేంద్ర బాలిక ఇంటికి వెళ్లాడు. అనంతరం బాలికకు, […]