Breaking News

చంద్రబాబు

కేసీఆర్, చంద్రబాబు కుమ్మక్కయ్యారు..

కేసీఆర్, చంద్రబాబు కుమ్మక్కయ్యారు..

570 టీఎంసీల నీటివాటా రాకుండా సంతకాలు సమస్యల పరిష్కారానికి ఆగస్టు 9 నుంచి పాదయాత్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సారథి, కొల్లాపూర్: తెలంగాణ రాష్ట్రానికి కృష్ణానది జలాల నుంచి 570 టీఎంసీల నీటివాటా రావాల్సి ఉండగా, సీఎం కేసీఆర్, చంద్రబాబుతో కుమ్మక్కై 299 టీఎంసీల నీటివాటా కోసం సంతకాలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు సీఎం కేసీఆర్ ఫొటోలు తగిలించుకొని […]

Read More
తిరుపతిలో గురుమూర్తి ఘనవిజయం

తిరుపతిలో గురుమూర్తి ఘనవిజయం

ఫ్యాన్​గాలికి కొట్టుకుపోయిన విపక్షాలు మిన్నంటిన వైఎస్సార్​సీపీ సంబరాలు తిరుపతి: తిరుపతి పార్లమెంట్​ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో వైఎస్సార్​ కాంగ్రెస్ ​పార్టీ అభ్యర్థి గురుమూర్తి 2,31,943 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచీ ఆయన ఆధిక్యం కనబరిచారు. వైఎస్సార్​ సీపీకి 5,37,152 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీకి 3,05,209 ఓట్లు వచ్చాయి. ఇక జనసేనతో కలిసి ఎన్నికల బరిలో దిగిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 50,739, కాంగ్రెస్​ అభ్యర్థి చింతా మోహన్​ […]

Read More
చంద్రబాబు కాన్వాయ్​లో సాంకేతికలోపం

చంద్రబాబు కాన్వాయ్​లో సాంకేతికలోపం

సారథి న్యూస్, నల్లగొండ: టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్​.చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న కాన్వాయ్ సాంకేతిక లోపం కారణంగా శుక్రవారం సాయంత్రం నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రి వద్ద నిలిచిపోయింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపునకు చంద్రబాబు వెళ్తున్నారు. ఇంతలో వాహనం నిలిచిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది మరో వాహనశ్రేణిలో ఆయనను హైదరాబాద్​కు తీసుకెళ్లారు.

Read More

తమ్మినేని.. ఇదేంది?

కొంతకాలంగా ఏపీ హైకోర్టు తీర్పులపై వైఎస్సార్​సీపీ నేతలు, ఆ పార్టీ సోషల్​ మీడియా విభాగం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ స్పీకర్​ తమ్మినేని సీతారాం కూడా హైకోర్టు తీర్పులను తప్పుపట్టారు. ఈ అంశంపై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం స్పీకర్​ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతయుతమైన రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నది. హైకోర్టు తీర్పులపై ఏమన్నా అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని.. […]

Read More

డ్రగ్స్​కేసుపై దివ్యవాణి షాకింగ్​ కామెంట్స్​

తెలుగుదేశం పార్టీ మహిళా నేత దివ్య వాణి తెలంగాణ ప్రభుత్వం, డ్రగ్స్​ కేసుపై షాకింగ్ కామెంట్స్​ చేశారు. ‘గతంలో ఓ సారీ టాలీవుడ్​లో డ్రగ్స్​కేసు అంటూ హడావుడి చేశారు. ఈ కేసు ఎందుకు మరుగున పడింది. విచారణ ఎందుకు ఆగిపోయింది. అందులో ఎవరెవరు ఉన్నారు.’ అంటూ వ్యాఖ్యానించారు. సోమవారం టీడీపీ-టీఎస్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్​లో ‘తెలంగాణ మహిళా కమిషన్‌ ఆవశ్యకత-ఏర్పాటు’ అనే అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దివ్యవాణి మాట్లాడారు. ఇంకా ఆమె […]

Read More

‘జలకళ’ పేదరైతులకు వరం

సారథిన్యూస్​, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం తీసుకొచ్చిన జలకళ పథకం పేదరైతులకు వరం లాంటిదని సీఎం వైస్​ జగన్మోహన్​రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో 2 లక్షల వ్యవసాయ బోర్లు వేస్తున్నట్టు చెప్పారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చే నాలుగు సంవత్సరాలలో రూ.2,340 కోట్లతో 2 లక్షల బోర్లు ఉచితంగా వేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ పథకం కోసం […]

Read More

చంద్రబాబు.. కరకట్ట ఇంటిని ఖాళీచేయండి

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటికి అధికారులు నోటీసులు జారీచేశారు. ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలో చంద్రబాబు అద్దె ఇంట్లో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కృష్ణానదికి వరద భారీగా వస్తుండటంతో చంద్రబాబు ఈ ఇంటిని వెంటనే ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీచేశారు. కొంతకాలంగా ఏపీలో వర్షాలు జోరుగా కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాల దాటికి వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 16.2 అడుగులకు […]

Read More

దుష్ప్రచారం ఆపండి.. ఆస్పత్రి తప్పేం లేదు

చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చికిత్సపొందుతూ గత శుక్రవారం గానగాంధర్వుడు, ఎస్పీ బాలు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ, కన్నడ రాష్ట్రాల్లోని ప్రజలేకాక యావత్​ దేశవ్యాప్తంగా ప్రజలంతా ఆయనకు నివాళి అర్పించారు. కాగా ఈ క్రమంలో ఎంజీఎం దవాఖానపై సోషల్​మీడియాలో కొన్ని రూమర్లు వినిపించాయి. ఆస్పత్రి యాజమాన్యం బాల సుబ్రహ్మణ్యానికి చికిత్స చేసేందుకు లక్షల రూపాయిలు ఫీజు వసూలు చేసిందని.. ఆయన కుమారుడు చరణ్​ దగ్గర అంత డబ్బు లేకపోవడంతో బాలూ స్నేహితులు […]

Read More