Breaking News

రైతుల అభ్యున్నతికి కృషి

రైతుల అభ్యున్నతికి కృషి

సారథి న్యూస్, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని మొరిపిరాల, కాంట్రావపల్లి, కేశవపురం గ్రామాల్లో గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సుడిగాలి పర్యటన చేశారు. రూ.1.57 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలో జరిగిందన్నారు. రైతుల అభ్యున్నతికి పాటుపడిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. కార్యక్రమంలో వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.