Breaking News

మహిళాసాధికారతే ప్రభుత్వ ధ్యేయం

మహిళాసాధికారతే ప్రభుత్వ ధ్యేయం

సారథి న్యూస్, హైద‌రాబాద్: మ‌హిళా సాధిరాకత, స్వయం సమృద్ధే లక్ష్యంగా పేద మ‌హిళ‌ల‌ను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఫుడ్​ప్రాసెసింగ్​యూనిట్లపై ప్రభుత్వం దృష్టిపెట్టిందని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. పేద‌రిక నిర్మూల‌న సంస్థ(సెర్ప్) ఆధ్వర్యంలో హైద‌రాబాద్లోని రాజేంద్రనగర్​, టీఎస్ ఐపార్డ్ లో గురువారం నిర్వహించిన వర్క్​షాపునకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాళేశ్వరం, దేవాదుల‌, ఎస్సారెస్పీ వంటి అనేకానేక ప్రాజెక్టుల‌తో జ‌లవిప్లవం వచ్చిందన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. సెర్ప్ ఆధ్వర్యంలో ఇప్పటికే 65,362 మ‌హిళా రైతుల‌తో 14,131 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేశామన్నారు. 9 జిల్లాల్లో యాక్టివ్ గా ప‌నిచేస్తున్న రైతు మ‌హిళా ఉత్పత్తి సంఘాలతో సంఘాలతో రాష్ట్ర సమాఖ్యను ఏర్పాటు చేస్తామన్నారు.