మహాశివరాత్రికి ఏర్పాట్లు 5లక్షల మందిపైగా భక్తులు వచ్చే అవకాశం దేవాలయం ఏర్పాట్లు చేస్తున్న పాలకవర్గం సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ బీరంగూడ శివాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. అందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా శివాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీరు, వైద్య, సౌకర్యాలు ఏర్పాటు చేస్తుండడంతో పాటు కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ భక్తులకు పండ్లు కూడా పంపిణీ చేయనున్నారు. మహాశివరాత్రి పండుగకు […]
సామాజిక సారథి, సంగారెడ్డి: సంగారెడ్డి వాసవీ క్లబ్స్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఫ్రై డే మార్కెట్ మానిక్ ప్రభు మందిరంలో ఉచిత హోమియోపతి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎం.ఎం.ఆర్ వైద్యశాల సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వాసవీ క్లబ్ ప్రతినిధులు చంద శ్రీధర్, ఇరుకుల్లా ప్రదీప్, కొంపల్లి విద్యాసాగర్, కటకం శ్రీనివాస్, చిలమకూరి నరేంద్ర, నామ శ్రీనివాస్ , నామ భాస్కర్, పుట్నాల లక్ష్మణ్, వెంకటేశం, మధుసూదన్, వాసవీ సభ్యులు, ఎం.ఎం.ఆర్. వైద్య బృందం, తదితరులు పాల్గొన్నారు.
సామాజిక సారథి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో జనవరి 23 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత శాఖల అధికారులను కోరారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖ , అనుబంధ శాఖలతో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజర్షి మాట్లాడుతూ ఈ […]
జిల్లా కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి: జిల్లాలో అర్హులందరూ జాప్యం చేయకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. దేశ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. టీకా పొందినవారికి ప్రమాదం లేదని, రెండు డోసులు టీకా పొందినవారు సురక్షితమన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకోవాలన్నారు. […]
మహిబాత్ పూర్లో దుండగుల దుశ్చర్య సామాజికసారథి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని మహిబాత్ పూర్ గ్రామ శివారులో గుర్తుతెలియని దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సమాధిని తవ్వి మహిళ పుర్రెను ఎత్తుకెళ్లారు. ఈఘటన గ్రామంలో కలకలం రేపింది. రాయికోడ్ మండలం మహాబథ్ పూర్ గ్రామానికి చెందిన కొనింటి ఏలిశా బెతూ అనే మహిళ అనారోగ్యంతో మూడేళ్ల క్రితం మృతిచెందింది. వారి గ్రామ శివారులో ఉన్న పొలం వద్ద అంత్యక్రియలు నిర్వహించి సమాధి చేశారు. కానీ, జనవరి 6న […]
పెట్రోల్ ట్యాంక్ పగిలి ఇద్దరు సజీవదహనం సామాజిక సారథి, మెదక్: బైక్ గుంటలో పడి మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవదహనమయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లిలో శివారులో చోటుచేసుకుంది. నారాయణ్ ఖేడ్ మండలం మంగల్ పేట్ గ్రామానికి చెందిన దత్తు(23), వాసుదేవ్లు బైక్ పై సంగారెడ్డికి వెళ్తున్నారు. బొడ్మట్ పల్లి సమీపంలో రాంగ్ రూట్లో వెళుతుండగా, బైక్ అదుపుతప్పి డివైడర్ కోసం తవ్విన గుంటలో పడ్డారు. ఈ ప్రమాదంలో పెట్రోల్ ట్యాంక్ […]
సామాజిక సారథి, సంగారెడ్డి: వాసవీ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులుగా 2022 వ సేవ సంవత్సరానికి సంగారెడ్డి పట్టణానికి చెందిన చంద శ్రీధర్ ఎన్నికయ్యారు. విజయవాడ పట్టణంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన చంద శ్రీధరతో అంతర్జాతీయ అద్యక్షలు పాత సుదర్శన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్బంగా వాసవి క్లబ్ జిల్లా ప్రతినిధులు చంద శ్రీధర్ ను అభినందించారు.
చిన్న వయసులోనే పెద్ద ప్రదర్శనలు కరోనా సమయంలోనూ నృత్యంలో ట్రైనింగ్ ఆసక్తి నుంచి అభిరుచి వైపు అడుగులు ఎన్నో రివార్డులు, అవార్డులు ఆమెకే సొంతం సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: కరోనా లాక్ డౌన్ సమయంలో కూచిపూడి నృత్యం నేర్చుకుని ఎన్నో అవార్డులు సాధించి అందిరిచేత శభాష్ అనుపించుకుంటోంది. రెండేళ్ల నుంచి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందుతోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం డివిజన్లోని కొత్తపేటకు చెందిన వేదపల్లి దీపిక, సన్నీ దంపతుల కుమార్తె ఐశ్వర్య కూచిపూడిపై […]