పెట్రోల్ ట్యాంక్ పగిలి ఇద్దరు సజీవదహనం సామాజిక సారథి, మెదక్: బైక్ గుంటలో పడి మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవదహనమయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లిలో శివారులో చోటుచేసుకుంది. నారాయణ్ ఖేడ్ మండలం మంగల్ పేట్ గ్రామానికి చెందిన దత్తు(23), వాసుదేవ్లు బైక్ పై సంగారెడ్డికి వెళ్తున్నారు. బొడ్మట్ పల్లి సమీపంలో రాంగ్ రూట్లో వెళుతుండగా, బైక్ అదుపుతప్పి డివైడర్ కోసం తవ్విన గుంటలో పడ్డారు. ఈ ప్రమాదంలో పెట్రోల్ ట్యాంక్ […]
సారథి న్యూస్, ఖమ్మం: కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారికి సిమ్యులేటర్ ఎంతో ఉపయోగకరమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని రవాణాశాఖ కార్యాలయంలో సోమవారం ఆయన డ్రైవింగ్ సిమ్యులేటర్ను ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కరోనా విపత్తువేళ రవాణాశాఖలో విప్లవాత్మక మార్పులు చేశామని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో రవాణాశాఖ అధికారులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.