ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తప్పదు సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ నడుపుతోందని, స్టీరింగ్ వారిచేతుల్లోనే ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా ఆరోపించారు. శనివారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేస్తారని, ఇది 2024 సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలంటే ప్రతిపక్షాల పాత్ర కీలకం కాబోతోందన్నారు. […]
అధికార పార్టీల తీరు బీజేపీకి కలసివస్తోంది సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సామాజిక సారథి, తిరుపతి: పంజాబ్ రైతుల నిరసనపై ప్రధాని మోడీ కొత్త నాటకానికి తెరతీశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంజాబ్ లో తనను హత్య చేసేందుకు ప్రయత్నం జరిగిందని నరేంద్ర మోడీ సానుభూతి కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని, నటనలో నేచురల్ స్టార్ని మించిపోయారని ఎద్దేవా చేశారు. పంజాబ్లో రైతులు ఆగ్రహంతో ఉండి అడ్డుకునే ప్రయత్నం […]
మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ముంబై: కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తీవ్రం కావడంతో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించని పక్షంలో లాక్డౌన్ అమలు చేయక తప్పదని ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో గడిచిన ఎనిమిది రోజుల్లో 1.17 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, అందులో ఒక్క మహరాష్ట్రలోనే 41 వేల కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. రోజురోజుకు కరోనాతోపాటు ఒమిక్రాన్కేసులు పెరిపోతున్నాయని, లాక్డౌన్ వద్దనుకుంటే కరోనా నియమాలు […]
సామాజిక సారథి, వరంగల్: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో మరోసారి మెడికోలు కరోనా బారిన పడ్డారు. ఎంజీఎంలో విధులు నిర్వహిస్తున్న కొంత మందిలో మెడికల్ విద్యార్థులకు కరోనా లక్షణాలు ఉండడం తో టెస్టులు చేయగా టెస్టులు చేసిన వారిలో 17 మందికి కరోనా నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. కరోనా వచ్చిన వారిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
గుండెపోటు నివారణకు అత్యవసర మెడిసిన్ ఉచితంగా అందిస్తామన్న అదనపు ఈవో ధర్మారెడ్డి తిరుమల: శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చే భక్తులకు రుయా ఆస్పత్రి శుభవార్త చెప్పింది. అత్యవసర వైద్యం అవసరమైన పక్షంలో గుండెపోటు నుండి రక్షించేందుకు తిరుపతిలోని రుయా ఆసుపత్రివారి ఆధ్వర్యంలో టెనెక్టేస్ ప్లస్ ఇంజక్షన్ అందుబాటులోకి తెచ్చింది. శనివారం తిరుమలలోని రాంభగీచా గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న ప్రథమ చికిత్స కేంద్రంలో అదనపు ఈవో ధర్మారెడ్డి ఈ మెడిసిన్ను విడుదల చేశారు. గుండె రక్తనాళాల్లో రక్తం […]
కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలి ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సామాజికసారథి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులు ఉండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తుంటారు. ఇదే అనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని రకాల […]
మహిబాత్ పూర్లో దుండగుల దుశ్చర్య సామాజికసారథి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని మహిబాత్ పూర్ గ్రామ శివారులో గుర్తుతెలియని దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సమాధిని తవ్వి మహిళ పుర్రెను ఎత్తుకెళ్లారు. ఈఘటన గ్రామంలో కలకలం రేపింది. రాయికోడ్ మండలం మహాబథ్ పూర్ గ్రామానికి చెందిన కొనింటి ఏలిశా బెతూ అనే మహిళ అనారోగ్యంతో మూడేళ్ల క్రితం మృతిచెందింది. వారి గ్రామ శివారులో ఉన్న పొలం వద్ద అంత్యక్రియలు నిర్వహించి సమాధి చేశారు. కానీ, జనవరి 6న […]
అనాథల రక్షణకు ప్రభుత్వ కార్యాచరణ కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీగా చదువులు ఉన్నతంగా ఎదిగేలా చట్టబద్ధమైన రక్షణ ప్రభుత్వ బిడ్డలుగా గుర్తిస్తూ ఐడీ కార్డులు సీఎం కేసీఆర్కు కేబినెట్ సబ్కమిటీ ప్రతిపాదనలు సామాజికసారథి, హైదరాబాద్: అభాగ్యులను చేరదీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అద్భుత విధానం తీసుకురావడానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో అనాథలను అక్కున చేర్చుకుని వారికి ఉచితంగా విద్యను అందించాలని సంకల్పించింది. వారికి కేజీ నుంచి పీజీ వరకు ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ను ఏర్పాటుచేసి ప్రత్యేక […]