Breaking News

ఎంపీ

బండి సంజయ్ దీక్ష భగ్నం.. అరెస్ట్

బండి సంజయ్ దీక్ష భగ్నం.. అరెస్ట్​

భారీగా పోలీసుల మోహరింపు సామాజిక సారథి, కరీంనగర్: జీవోనం.317ను సవరించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సంఘీభావంగా కరీంనగర్‌లో ఆదివారం రాత్రి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తన క్యాంపు కార్యాలయం వద్ద జాగరణ దీక్ష చేపట్టారు. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో దీక్షకు అనుమతి లేకపోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకొని ఎంపీ బండి సంజయ్‌ బైక్ పై క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. […]

Read More
బండి సంజయ్కు బాధ్యత లేదా?

బండి సంజయ్​కు బాధ్యత లేదా?

మంత్రి గంగుల కమలాకర్‌ సామాజికసారథి, కరీంనగర్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన జాగరణ దీక్ష, పోలీసులు భగ్నం చేయడంపై ఆదివారం రాత్రి మంత్రి గంగుల కమలాకర్‌ స్పందించారు. గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఒక ఎంపీ చట్టాలను ఉల్లంఘిస్తే ఎలా? అని నిలదీశారు. ఢిల్లీలో ఎవరైనా దీక్షలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకే జీవోనం.317 ఇచ్చామని తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటించే బాధ్యత […]

Read More
జీవోనం.317 నిలిపివేయాలి

జీవోనం.317 నిలిపివేయాలి

ఉద్యోగులతో చర్చించాకే నిర్ణయించాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌  సామాజికసారథి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ అనాలోచిత.. అర్ధరాత్రి నిర్ణయాలతో ఉద్యోగులు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ప్రభుత్వం వెంటనే జీవోనం.317ను నిలిపివేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల సమస్యపై సీఎం స్పందించకుంటే  వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ఉద్యోగుల బదిలీల విషయంలో తాము ఎలాంటి రాజకీయం చేయడం లేదని, స్థానికత, సీనియారిటీ ఆధారంగానే బదిలీలు చేయమని కోరుతున్నామని చెప్పారు. […]

Read More
షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు

షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు

కాంగ్రెస్‌ అదే కోరుకుంటోంది రాజ్యసభ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాలకు షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా జరపాలని కాంగ్రెస్‌ కోరుకుంటోందని రాజ్యసభ ఎంపీ మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు. ఎన్నికలను వాయిదా వేయాలా? వద్దా? అనే అంశంపై రాజకీయవర్గాల్లో తాజాగా జరుగుతున్న చర్చపై మంగళవారం ఆయన స్పందించారు. ఎన్నికలు జరపాలన్న వాదనకు మద్దతిచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్​సమావేశాలకు కూడా హాజరుకాకుండా స్వయంగా ర్యాలీల్లో పాల్గొంటూ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తూ పోతుంటే ఎన్నికలను మాత్రం […]

Read More
రేవంత్ రెడ్డి అరెెస్టు

రేవంత్​రెడ్డి అరెస్ట్​

జూబ్లీహిల్స్​లోని ఇంటివద్ద ఉద్రిక్తత ఉదయం నుంచే మోహరించిన పోలీసులు ఎర్రవెల్లి వెళ్లేందుకు ప్రయత్నించగా అదుపులోకి జగిత్యాలలో జీవన్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు కూడా అరెస్ట్‌ సామాజికసారథి, హైదరాబాద్‌: తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రవెల్లికి వెళ్లకుండా జూబ్లీహిల్స్​లోని ఆయన ఇంటివద్దకు ఉదయం నుంచే పోలీసులు చేరుకుని నిర్బంధించారు. దీంతో కాంగ్రెస్​కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. సోమవారం ఎర్రవల్లిలో […]

Read More
రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా?

రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా?

వానాకాలం పంటను ఎందుకు కొనడం లేదు సీఎం, మంత్రుల భాష మార్చుకోవాలి బీజేపీ చీఫ్​బండి సంజయ్​ఫైర్​ సామాజికసారథి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోమారు ధ్వజమెత్తారు. వర్షాకాలం పంట కొనబోమని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఎక్కడా చెప్పలేదన్నారు. వానాకాలం పంటను కొంటామని టీఆర్ఎస్​పార్లమెంటరీ పక్షనేత నామా నాగేశ్వర్​రావు ఎదుటే గోయల్‌ చెప్పారని వివరించారు. వానాకాలం పంటను సీఎం కేసీఆర్‌ ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనిపించడం […]

Read More
ఎంపీ సంతోష్ కు అరుదైన గిఫ్ట్

ఎంపీ సంతోష్ ​కు అరుదైన గిఫ్ట్​

న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఎంపీలు కేక్ ​కట్ ​చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ లో భాగంగా మొక్కనాటారు. రాజ్యసభ ఎంపీలు కె.కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్, కేఆర్ సురేష్ రెడ్డి, పార్లమెంట్ ​ఎంపీలు నామా నాగేశ్వరరావు, గడ్డం రంజిత్ రెడ్డి, పోతుగంటి రాములు, బోర్లకుంట్ల వెంకటేష్ నేత, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Read More
పట్టుపట్టి ఏడాదిలోనే నిర్మించుకుంన్రు

పట్టుపట్టి ఏడాదిలోనే నిర్మించుకుంన్రు

  – రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు సామాజిక సారథి, సిద్దిపేట: పెన్షనర్లు పట్టుపట్టి ఏడాదిలోనే భవనం నిర్మించుకున్నారని ఎంపీ, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం హుస్నాబాద్ పట్టణంలోని విశాంత్రి ఉద్యోగుల భవనం ప్రారంభోత్సవం చేసి మాట్లాడారు. విశ్రాంతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్య పట్టణ కేంద్రాల్లో పెన్షనర్ల భవనాలు తప్పనిసరిగుండాలన్నారు. విశ్రాంత ఉద్యోగుల భవన నిర్మాణాలకు అనేక చోట్ల నిధుల మంజూరు చేసిన నిర్మాణాలు పూర్తి కాలేదన్నారు. ఎంపీ నిధుల నుంచి […]

Read More