కల్తీకల్లు తాగి 10 మందికి అస్వస్థత గ్రామాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు మెదక్జిల్లా కొంతాన్ పల్లిలో కలకలం సామాజికసారథి, మెదక్ ప్రతినిధి: కల్తీ కల్లు తాగి 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మంగళవారం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్పల్లిలో కలకలం రేపింది. గ్రామంలోని ఓ దుకాణంలో కల్లు తాగిన కుల్ల నాగరాజు, బ్యాగరి మనీలా, మడూరి రమేష్, వీరబోయిన స్వామి, తుమ్మల స్వామి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే వీరంతా […]
జోనల్ వ్యవస్థ పూర్తికాగానే నోటిఫికేషన్లు మంత్రి నిరంజన్రెడ్డి సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగుల విభజన ప్రక్రియ కొనసాగుతోందని, అది ముగియగానే కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 1,32,899 ప్రభుత్వ ఉద్యోగాలను టీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిందన్నారు. మిగతా ఖాళీలకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కసరత్తు […]
ఒమిక్రాన్ తాజా పరిస్థితిపై ఈసీ సమీక్ష కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతోచర్చలు ఐదు రాష్ట్రాల్లో వేగంగా వ్యాక్సినేషన్ జనవరిలో మరోమారు సమావేశం ఎలక్షన్నిర్వహణపై అప్పుడే నిర్ణయం న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఏంచేయాలనే అంశంపై సీఈసీ ఫోకస్ పెట్టింది. కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారు లతో సోమవారం సమావేశం నిర్వహించింది. ఆరోగ్యశాఖ సమాచారం ఆధారంగా.. ఎన్నికల నిర్వహణపై తుదినిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐదు […]
కేంద్రం అనుమతి రావడంతో ఏర్పాట్లు చేయండి రెండు డోసుల వ్యాక్సిన్తప్పనిసరి తీసుకోవాలి అధికారులతో మంత్రి హరీశ్రావు సమీక్ష సామాజికసారథి, హైదరాబాద్: కరోనాకు బూస్టర్ డోసుపై కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వచ్చేనెల 3 నుంచి మూడో డోసు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి సోమవారం […]
ప్రతిపాదనలు సమర్పించిన డిస్కంలు ఆర్థికభారం తగ్గించుకునే ప్రభుత్వం చర్యలు సామాజికసారథి, హైదరాబాద్: ఆర్థిక భారం తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు విద్యుత్ ఉత్పత్తి రంగ సంస్థలు టారిఫ్ ప్రతిపాదనలను సమర్పించాయి. సుమారు రూ.ఆరువేల కోట్ల మేర పెంపు ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలికి అందించినట్లు తెలుస్తోంది. సుమారు ఐదేళ్ల తర్వాత విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఇవ్వగా.. సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. చార్జీల పెంపుతో డిస్కంలకు రూ.6,831 […]
నగర శివార్లలో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా వార్షిక నివేదికను ఆవిష్కరించిన రాచకొండ సీపీ మహేష్ భగవత్ సామాజికసారథి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నాలుగు శాతం నేరాలు పెరిగాయి. అలాగే పోలీస్ స్టేషన్కు వచ్చి ఇచ్చిన ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంలో కేసుల సంఖ్య పెరిగిందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదికను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేరాలు చేసిన […]
జనవరిలోగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే.. లేకపోతే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంటింటికీ ఉద్యోగం ఏమైంది పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్ చుగ్ సామాజికసారథి, హైదరాబాద్: బీజేపీ చేపట్టిన నిరుద్యోగ దీక్షను సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని, దీక్షతో ప్రభుత్వానికి వణుకు పుట్టిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్అన్నారు. రాత్రికి రాత్రే ర్యాలీలు, సభలు నిషేధిస్తూ జీవో ఇచ్చారన్నారు. వైపు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతుంటే ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వం ఊడగొడుతోందని మండిపడ్డారు. […]
సామాజిక సారథి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ను గద్దె దించేందుకు నిరుద్యోగ యువత, విద్యార్థులు కలసి రావాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. నీరోచక్రవర్తిలా పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. ఏడాదిలో ఎక్కువ రోజులు ఫాంహౌస్లోనే ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని ఎద్దేవాచేశారు. ఎంతోమంది ఆఫీసర్లు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని, అలాంటి వారి పరిస్థితి ఏమైందో ఒక్కసారి చరిత్రను చూడండి అంటూ అధికారులపై ఈటల మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదని, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. […]