భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి ఎంతో విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. విద్యార్ధులను విద్యా ప్రాప్తిరస్తు అని, పెళ్లయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, పురుషులను దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తుంటారు. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాల్లో అక్కడ పండితులు ‘గో బ్రాహ్మణో శుభం భవతు, లోకాస్సమస్త సుఖినోభవంతు’ అనే ఆశీర్వదిస్తారు. దేశంలో రాజు న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలనీ, దేశం సుభిక్షంగా వుండాలనీ, గోవులు, బ్రాహ్మణులు, ప్రజలందరూ సుఖంగా వుండాలనీ, దేశంలో సకాలంలో […]
వ్యక్తి జన్మించే సమయంలో సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరలో ఉన్నాడో దాన్నే జన్మ నక్షత్రంగా జ్యోతిష్యశాస్త్రంగా చెబుతుంటారు. జీవన గమనంలో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెబుతారు. ఈ శాస్త్రంలో జీవితంలో సంభవించే సమస్యలు ఎలా వస్తాయో, వాటికి ఏ గ్రహాలకు శాంతులు చేయాలో ఈ శాస్త్రంలో పరిహారాలు సూచించారు. దానికనుగుణంగా మనం నక్షత్రశాంతులు, గ్రహశాంతులు జరిపించుకోవాల్సి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలోని 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు, అధిదేవతలు ఉన్నట్లుగానే వాటికి సంబంధించిన వృక్షాలు కూడా […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 796 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు శనివారం హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. 24 గంటల్లో 24,458 టెస్టులు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 12,285కి చేరింది. కాగా ఈ రోజు నమోదైన కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన ఐదుగురికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 51 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. 24 గంటల్లో కృష్ణా […]
సారథి న్యూస్, తిరుపతి: జూన్ 24వ తేదీన బుధవారం తిరుమల శ్రీవారిని 9,059 మంది భక్తులు దర్శించున్నారు. స్వామి వారికి హుండీలో రూ.62లక్షల కానుకలు సమర్పించారు. 2,929 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమల శ్రీవారిని ఈనెల 27వ తేదీన దర్శించుకునే భక్తులకు జూన్ 26వ తేదీ ఉదయం 5 గంటలకు తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో అంటే విష్ణునివాసం (8 కౌంటర్లు), శ్రీనివాసం (6 కౌంటర్లు), అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లో (4 కౌంటర్లు), మొత్తం […]
సాధారణంగా మనం ఏ ఆలయానికి వెళ్లిన ఆలయం చుట్టూ పూర్తిగా సవ్యమార్గంలో ప్రదక్షిణలు చేస్తాం. కానీ శివాలయాల్లో మాత్రం ప్రదర్శన క్రమం అలా చేయొద్దని శైవ ఆగమం చెబుతోంది. దీన్నే చండీశ్వర ప్రదక్షిణలు అని పిలుస్తారు. ఆలయానికి వెళ్తే మనస్సుకు ప్రశాంతత కలగడమే కాకుండా, ఆ పరిసరాల్లో ఉండే పాజిటివ్ శక్తి మనలోకి ప్రవేశిస్తుంది. దీంతో కొత్త ఉత్సాహం వస్తుంది. ఏ దేవాలయానికి వెళ్లినా దైవాన్ని దర్శించుకునే ముందు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. కొందరు తమ […]
సారథి న్యూస్, రామాయంపేట: అత్యంత దైవభక్తి.. గ్రామదేవతలకు పూజలకు ప్రాముఖ్యం ఉన్న ఆషాఢ మాసం వచ్చేసింది. గ్రామీణ ప్రాంతాలు మొదలుకుని పట్టణ, నగర ప్రాంతాల ప్రజలు ఈ మాసంలో అత్యంత భక్తి పారవశ్యలో గడుపుతారు. గ్రీష్మరుతువు పోయి వర్షరుతువు వస్తున్న తరుణంలో తొలకరి చినుకులు పుడమి పులకింతల్లో ఆషాఢ మాస ఆగమనం ఎన్నో కొత్త సొబగులను తీసుకొస్తుంది. ప్రకృతి పలకరింపుల పరిమళాలను.. అరచేతిలో పండిన గోరింటాకుల మనసును ముద్దాడుతుంది. నాగలి దున్నిన నేలంతా పులకిస్తూ విచ్చుకునే సమయాన […]
తెలంగాణ రాష్ట్రంలోని 44వ జాతీయ రహదారికి ఆనుకుని జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో కృష్ణానది తీరాన ఈ బీచుపల్లి క్షేత్రం ఉంది. ఇక్కడి ప్రధాన దైవం ఆంజనేయస్వామి. వ్యాసరాయుల వారి ప్రతిష్ఠాపన అయిన ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితం. పవిత్ర కృష్ణానది తీరాన ఉన్న ఈ పుణ్యస్థలంలో ఎంతో మంది మహాపురుషులు, యోగులు, రుషులు తపమాచరించిన దివ్యధామంగా వెలుగొందుతోంది. అంతేకాకుండా రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధమైన హనుమాన్ ఆలయాల్లో ఒకటిగా ప్రఖ్యాతి చెందింది. ఇక్కడ ఆంజనేయస్వామి ప్రధాన […]
తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠం అలంపూర్ జోగుళాంబ ఆలయం. ఇది గద్వాల పట్టణానికి 55 కి.మీ., కర్నూలు జిల్లా కేంద్రానికి 20 కి.మీ. చేరువలో ఉంది. ఇక్కడి శిల్పసౌందర్యాన్ని వీక్షించడానికి దేశవిదేశాల నుంచి అధిక సంఖ్యలో వస్తుంటారు. అన్ని క్షేత్రాలు, ఆలయాలకు సంప్రదాయాలకు భిన్నంగా షణ్మతాలకు నిలయంగా అలంపురం విరాజిల్లుతోంది. ఈ క్షేత్రం దక్షిణకాశీ, పర శురామ క్షేత్రం, భాస్కర క్షేత్రంగా భాసిల్లుతోంది. ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా అలంపూరంలో నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడికి […]