దసరా నాటికి రైతు వేదికల నిర్మాణం కరోనా కష్టకాలంలోనూ రైతులకు సాయం యాజమాన్య హక్కు సమస్యలను పరిష్కరించాలి నియంత్రిత సాగు.. రైతుల్లో గొప్ప పరివర్తన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కె.చంద్రశేఖర్రావు సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలన ఎవరున్నా వెంటనే గుర్తించి, చిట్టచివరి రైతు వరకు అందరికీ ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన మేరకే రైతులు వందకు వందశాతం నియంత్రిత పద్ధతిలో […]
జులై 10న సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ‘రోరి’ సినిమాలోని లుక్ రిలీజ్ చేశారు టీమ్ సభ్యులు. ఏ పాత్రకైనా హుందాతనాన్ని తెచ్చే కోట పొలిటికల్ క్యారెక్టర్స్ ఎన్నో పోషించారు. కానీ సీఎం పాత్రలో ఇప్పటిదాకా నటించలేదు. చరణ్ రోరి నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రోరి’ సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర పోషించనున్నారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఆర్.రామన్న చౌదరిగా సెన్సిటివ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు […]
ఫైటర్ గా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన పొన్నంబళమ్ విలన్ గా అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. 90లో విలన్ గా పొన్నాంబళమ్ బాగా ఫేమస్ అయ్యారు. తెలుగులో కూడా ఆయన చిరంజీవి, బాలకృష్ణ వంటి పెద్ద హీరోల చిత్రాలతో పాటు శ్రీకాంత్, జగపతిబాబు నటించిన చిత్రాల్లోనూ కీలకపాత్రల్లో విలన్గా నటించారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు పొన్నంబళమ్. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షణించింది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పొన్నంబళమ్ చెన్నై […]
వణికిపోతున్న పల్లెజనం ఏపీలో కొత్త ప్రాంతాలకు మహమ్మారి సారథి న్యూస్, కర్నూలు: ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్లో పాగా వేస్తోంది. కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇటీవలే ప్రభుత్వం కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు కూడా చికిత్సల కోసం అనుమతులు ఇచ్చింది. కరోనా వైరస్ సోకిన వారికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యసేవలు పొందేలా ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ప్రజల్లో […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శనివారం 1,178 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా మహమ్మారి బారినపడి 9 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు మొత్తంగా 348 మంది బలయ్యారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 33,402 కు చేరాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,62,171 టెస్టులు చేశారు. జీహెచ్ఎం పరిధిలో 736 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి జిల్లా 125, మేడ్చల్101, సంగారెడ్డి 13, వరంగల్ అర్బన్ 20, కరీంనగర్24, సిరిసిల్ల […]
సారథిన్యూస్, రామడుగు: తెలంగాణ సంస్కృతిలో వ్యవసాయం ఓ భాగమని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో రైతువేదిక భవనానికి ఆయన భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మరో మంత్రి గంగుల కమాలకర్, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. రైతువేదికల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 60 కోట్లు ఖర్చుచేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ వీర్ల సరోజ, కలెక్టర్ శశాంక, గ్రంథాలయసంస్థ చైర్మన్ రవీందర్ రెడ్డి, […]
సారథిన్యూస్, రామగుండం: సింగరేణి యాజమాన్యం ఇష్టానుసారం కార్మికులను బదిలీ చేస్తున్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. అక్రమ బదిలీలను వెంటనే ఆపకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. ఆర్జీవన్ డివిజన్లోని జీకే ఓకటో గని కార్మికులను యాజమాన్యం ఎందుకు బదిలీ చేస్తున్నదని ప్రశ్నించారు. శనివారం ఆయన కార్మికులను కలిశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఒకటో గనిలో కార్మికులు అవసరం ఉన్నప్పటికీ యజమాన్యం పద్ధతి లేకుండా కార్మికులను అడ్డాయలప్రాజెక్టుకు ఆర్జీ3కి బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. […]
సారథి న్యూస్, వాజేడు: భౌతికదూరం పాటించడం, నిరంతరం చేతులను శుభ్రపరుచుకోవడం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు పాటించి కరోనాను జయించాలని వాజేడు ఎంపీపీ శారద సూచించారు. శనివారం ములుగు జిల్లా వాజేడు మండలం ఆరుగుంటపల్లిలో ఆమె వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా గ్రామస్థులకు మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మంకిడి వెంకటేశ్వర్రావు , హెచ్ఎస్ కోటిరెడ్డి, హెచ్ఏ శ్రీనివాస్, ఆశాకార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.