సారథిన్యూస్, రామడుగు: సాంకేతికరంగం కొత్తపుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో మోసాలు సైతం అదే తరహాలో జరుగుతున్నాయి. తాజాగా ఓ యువకుడు తెలుగు మ్యాట్రిమోనిలో పరిచయమైన యువతి చేతిలో దారుణంగా మోసపోయాడు. అక్షరాలా నాలుగు లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. రామడుగుకు చెందిన ఓ యువకుడికి తెలుగు మ్యాటిమోనిలో ఓ యువతి పరిచయమైంది. తాను అమెరికాలో ఉంటున్నానంటూ పరిచయం చేసుకున్న యువతి..పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, డైమండ్ రింగ్, యుస్ డాలర్స్ పంపుతానని యువకుడిని నమ్మించింది. అనంతరం […]
గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లాలో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుమ్మడిదల మండలం దోమడుగులోని సాల్వెంట్ రసాయన పరిశ్రమలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. జీడిమెట్ల, అన్నారం ఎయిర్ఫోర్స్ అకాడమీ నుంచి అగ్నిమాపక యంత్రాలను రప్పించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఓ ఎయిర్ఫోర్స్ ఆఫీసర్ సూసైడ్ చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఇందర్పాల్ సింగ్(53)వైమానిక దళంలో వారెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. తన సర్వీస్ పిస్టల్తో తలపై కాల్చుకున్నాడు. వెంటనే సహచరులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే చనిపోయాడని డాక్టర్లు ధ్రువీకరించారు. పోస్టుమార్టం పూర్తయిన వెంటనే ఇందర్పాల్ భౌతిక కాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. కాగా, ఈనెల జమ్ము రీజియన్లో సూసైడ్ చేసుకున్న రెండో వైమానికదళ ఉద్యోగి ఇందర్పాల్. ఆగస్టు 8న కూడా ఉదంపూర్లో వైమానిక దళానికి చెందిన […]
సారథి న్యూస్, రామగుండం: బాలిక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్లో శనివారం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా కొహెడ మండలం బస్వాపూర్ సమీపంలో ఈనెల 15న మోయతుమ్మెదవాగులో గల్లంతైన లారీడ్రైవర్ శంకర్ డెడ్బాడీ శనివారం లభించింది. నీటి ప్రవాహానికి బస్వాపూర్ శివారులోని వాగు ఒడ్డుకు కొట్టుకురావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. గత శనివారం నీటిఉధృతిలో గల్లంతైన లారీడ్రైవర్ శంకర్ గా గుర్తించారు. ఘటన స్థలాన్ని ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఏసీసీ మహేందర్ పరిశీలించారు.బస్వాపూర్ గ్రామస్తుల చేయూతలారీ డ్రైవర్ శంకర్ కుటుంబానికి ఆర్థిక సాయమందించానే సంకల్పంతో బస్వాపూర్ గ్రామానికి చెందిన […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఓ దళిత యువతపై ఏండ్ల తరబడి 143 మంది లైంగికదాడికి పాల్పడ్డారు. దేశంలోని పలుప్రాంతాలకు ఆమెను తిప్పి అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆమెపై అత్యాచారం జరిపిన వాళ్లలో విద్యార్థినాయకులు, రాజకీయనాయకుల పీఏలు, పలువురు టీవీ, సినీ రంగానికి చెందినవారు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ కేసును హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనతో ఒక్క హైదరాబాద్ నగరమే కాదు.. యావత్ తెలంగాణ సమాజమే ఉలిక్కిపడింది. ప్రస్తుతం 143 మందిపై కేసు నమోదైనట్టు […]
లక్నో: వైద్యవిద్యార్థిని దారుణహత్యకు గురైన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రాలో గురువారం వెలుగుచూసింది. కొంతకాలంగా ఆమెను ప్రేమపేరుతో వేధిస్తున్న యువకుడే కిడ్నాప్చేసి హత్యచేశాడని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈఘటనపై ప్రస్తుతం యూపీ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఢిల్లీలోని శివపురి ప్రాంతానికి చెందిన డాక్టర్ యోగిత గౌతమ్(25) ఆగ్రా ఎస్ ఎన్ మెడికల్ కళాశాలలో గైనకాలజీ విభాగంలో వైద్యురాలిగా పని చేస్తున్నారు. అదే కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం నుంచి ఆమె కనిపించడం లేదు. […]
సారథి న్యూస్, కర్నూలు: కోవిడ్ చికిత్స పేరుతో అమాయక ప్రజల నుంచి డబ్బులు లాగుతున్న ఓ ఆర్ఎంపీని పోలీసులు బుధవారం అరెస్ట్చేశారు. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామం కొయిటాలవీధికి చెందిన డి.రంగన్న స్థానికంగా ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. కరోనా పేరుతో చికిత్స అందిస్తున్నట్లు అధికారుల దృష్టికి రావడంతో నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి విచారణ చేశారు. కోయిలకుంట్ల వీఆర్వో రవిప్రసాద్ రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. సంబంధించి సదరు ఆర్ఎంపీపై క్రిమినల్కేసు పెట్టించి అరెస్ట్చేయించినట్లు కర్నూలు […]