పురుగు మందు తాగి అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం మానవపాడు తహసీల్దార్ ఆఫీసు ఎదుట ఆందోళన సారథి న్యూస్, మానవపాడు: భూమిని తమ పేర చేయడం లేదని, అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా న్యాయం జరగడం లేదని ఇద్దరు అన్నదమ్ములు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట కలకలం రేపింది. బాధిత రైతుల కథనం మేరకు.. మండలంలోని చెన్నిపాడు గ్రామానికి చెందిన రైతులు శేషిరాజు, నాగరాజుకు […]
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఓ ఎయిర్ఫోర్స్ ఆఫీసర్ సూసైడ్ చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఇందర్పాల్ సింగ్(53)వైమానిక దళంలో వారెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. తన సర్వీస్ పిస్టల్తో తలపై కాల్చుకున్నాడు. వెంటనే సహచరులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికే చనిపోయాడని డాక్టర్లు ధ్రువీకరించారు. పోస్టుమార్టం పూర్తయిన వెంటనే ఇందర్పాల్ భౌతిక కాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. కాగా, ఈనెల జమ్ము రీజియన్లో సూసైడ్ చేసుకున్న రెండో వైమానికదళ ఉద్యోగి ఇందర్పాల్. ఆగస్టు 8న కూడా ఉదంపూర్లో వైమానిక దళానికి చెందిన […]
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో దారుణం చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిన 34 ఏళ్ల జర్నలిస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎయిమ్స్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. హిందీ డైలీ ‘డైనిక్ భాస్కర్’ పేపర్లో పనిచేస్తున్న జర్నలిస్ట్కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో భయపడిపోయిన ఆయన రెండు రోజుల నుంచి కొలీగ్స్, ఫ్రెండ్స్కు డిప్రెషన్ మెసేజ్లు పంపడం మొదలుపెట్టాడు. జర్నిలిస్టులు పరిస్థితి మరీ దారుణంగా తయారైందని, చాలా సార్లు […]