సారథి న్యూస్, మహబూబ్ నగర్: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శనివారం పర్యటించారు. నాలాలపై చేపట్టిన అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రి జిల్లా కేంద్రంలో భారీవర్షం కారణంగా జలమయమైన ప్రాంతాల్లో పర్యటించారు. రామయ్యబౌలి, బీకేరెడ్డి కాలనీ, భగీరథ కాలనీ, గణేష్ నగర్, ఎంబీసీ కాంప్లెక్స్, బృందావన్ కాలనీలో కలియతిరిగారు. జలదిగ్బంధమైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాలాలపై […]
ఎస్పీబి మృతిపై ఇళయరాజా దిగ్భ్రాంతి చెన్నై : గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం మృతిపై భారతీయ సంగీత లోకం కన్నీటి నివాళులర్పిస్తోంది. బాలు మరణంపై ఆయన ప్రాణమిత్రుడు, మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఎక్కడికెళ్లావ్ బాలూ..!’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎస్పీబీ మరణవార్త తెలియగానే ఆయన స్పందిస్తూ… ‘ఎక్కడికి వెళ్లిపోయావ్ బాలు. త్వరగా కోలుకుని రమ్మని చెప్పాను. కానీ నూవ్ నా మాట వినలేదు. ఎక్కడికెళ్లావ్. అక్కడ గంధర్వుల కోసం పాడడానికి వెళ్లావా..? నూవ్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు వరద పోటెత్తుతున్నాయి. దీంతో తెలంగాణ తడిసి ముద్దయింది. కొన్నిప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వాన కురుస్తోంది. ఈ క్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అధికారులంతా హెడ్ క్వార్టర్స్ లో ఉండాలని ఆదేశాలు జారీచేసింది. వర్షాలు, వరదలు దృష్ట్యా అధికారులకు ప్రభుత్వం సెలవులు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని […]
బిగ్బాస్ సీజన్ 4 ఈ వారం కొంత ఆసక్తికరంగా సాగింది. అయితే ఈ వారం హౌస్నుంచి మెహబూబ్ బయటకు వెళ్లిపోనున్నట్టు సమాచారం. ఇటీవల హౌస్లో నిర్వహించిన ఉక్కు హృదయం టాస్క్లో మెహబూబ్ ఓవరాక్షన్ చేయడంతో ప్రేక్షకులు అతడికి తక్కువ ఓట్లు వేశారట. దీంతో మెహబూబ్ ఈ వారం ఎలిమినేట్ అవుతున్నట్టు టాక్. ఈ వారం మోనాల్, లాస్య, దేవి, కుమార్ సాయి, మెహబూబ్, అరియానా, హారికలు ఎలిమినేషన్కు నామినేట్ అయ్యారు. అయితే గత వారం వరకు మెహబూబ్పై […]
బీజేపీలో డీకే అరుణ, పురందేశ్వరికి కీలక పదవులు పదవులు దక్కని రాంమాధవ్, మురళీధర్ రావు బిహార్ ఎన్నికల వేళ బీజేపీ కొత్త కార్యవర్గం న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఆ పార్టీ మహిళా నేతలు, మాజీమంత్రులు డీకే అరుణ, పురందరేశ్వరికి కీలక పదవులు దక్కాయి. బిహార్ ఎన్నికల వేళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొత్త టీమ్ను ప్రకటించారు. కీలక పదవుల నుంచి కొందరిని తప్పించారు. కొత్తవారికి, యువతకు కీలక పదవులు కట్టబెట్టారు. పార్టీ జాతీయ […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హేమంత్ హత్యకేసులో పలు కీలక నిజాలు వెలుగుచూస్తున్నాయి. హేమంత్ హత్యకు నెలముందే స్కెచ్వేసినట్టు సమాచారం. ఈ హత్యకు కీలక సూత్రధారి అవంతిక మేనమామ యుగందర్రెడ్డి అని పోలీసులు తెలిపారు. అతని కేసులో ఏ1గా పెట్టారు. యుగంధర్రెడ్డి నెలక్రితమే హేమంత్ హత్యకు స్కెచ్ వేసినట్టు సమాచారం.. పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించిన వివరాల ప్రకారం.. చందానగర్కు చెందిన లక్ష్మారెడ్డి, అర్చన దంపతుల కుమార్తె అవంతికి జూన్ 10న ఇంట్లో నుంచి […]
సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టిపెట్టింది. పేద రైతులను ఆదుకునేందుకు వీలుగా ‘వైఎస్సార్ జలకళ’ పథకాన్ని సెప్టెంబర్ 28న ప్రారంభించనుంది. చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం ద్వారా ఫ్రీగా బోర్లు తవ్వించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ నిధులుతో ఒక్కో రిగ్ వేయనుంది. ఐదెకరాల ఎకరాల పొలం ఉన్న చిన్న, సన్నకారు ఈ పథకానికి అర్హులు. తమ భూముల్లో ఓపెన్ వెల్, బోర్ వెల్, […]
సారథి న్యూస్, బిజినేపల్లి: ఇటీవల ఒంటరి మహిళలపై గుర్తుతెలియని దుండగులు బైక్లపై వచ్చి గొలుసులు దొంగలించుకుంటున్నారని, వారి పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని బిజినేపల్లి ఎస్సై వెంకటేశ్ సూచించారు. మహిళలు రోడ్లపైకి వచ్చినప్పుడు అనుమానాస్పదంగా బైక్లపై చుట్టూ తిరిగే వారిపై ఓ కన్నేసి ఉంచాలన్నారు. అంతేకాకుండా గ్రామాలు, కాలనీల్లో గుర్తుతెలియని వ్యక్తులు తిరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. నేరాలను అదుపుచేసే క్రమంలో ప్రజలు పోలీసులకు సహకరించాని కోరారు.