చంఢీఘర్: పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆ రాష్ట్రంలోని 11,12 వ తరగతి విద్యార్థినులకు బంపర్ఆఫర్ ప్రకటించారు. ఆన్లైన్ క్లాసులు వినేందుకు విద్యార్థినులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయనున్నారు. మొదటి విడత పంపిణీకి 50 వేల స్మార్ట్ ఫోన్లు సిద్ధంగా ఉన్నాయని సీఎం తెలిపారు. స్మార్ట్ ఫోన్ల పంపిణీకి చైనాకు చెందిన ఓ కంపెనీతో పంజాబ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం నిర్ణయం పట్ల ఆ రాష్ట్రంలోని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. రేపటి నుంచి ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ http//tsbie.cgg.gov.in ద్వారా సవరించిన మార్కులు, స్కాన్ చేసిన జవాబు స్క్రిప్టులు డౌన్లోడ్ చేసుకోచ్చని తెలిపింది. మొత్తం 37,387 మంది విద్యార్థులు 72,496 సబ్జెక్టుల్లో రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. అయితే ఇప్పటి వరకు […]
సారథిన్యూస్, చొప్పదండి: విద్యార్థులే తెలంగాణ సంపద అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా చొప్పదండి మోడల్ స్కూల్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలని సూచించారు. నలుగురికి సాయం చేసే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్, సింగిల్ విండో ఛైర్మన్ మల్లారెడ్డి, నాయకులు గొల్లపల్లి శ్రవణ్, తోట శేషాద్రి, మాచర్ల వినయ్, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే సీతక్క విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి, ప్రభుత్వ ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు నల్లెల కుమారస్వామి, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, ఎండీ చాంద్ పాషా, చెన్నోజు సూర్యనారాయణ, బండి శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, సాంబయ్య, రమణా కర్, అజ్జు తదితరులు పాల్గొన్నారు.
ఉన్నత విద్యావంతులు, ఉత్తమ బోధన, పరిపూర్ణ సౌకర్యాలు, పారదర్శక ఎంపిక, నాణ్యమైన విద్య కేంద్రీయ విద్యాలయాల ప్రత్యేకతలు. ఒకటో తరగతిలో ప్రవేశం పొందితే ప్లస్టూ వరకు ప్రశాంతంగా చదివే అవకాశం. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఏటా డిమాండ్ పెరుగుతోంది. అన్ని రంగాల్లో విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న ఈ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది. క్రమశిక్షణతో విద్యార్థులను […]
ఢిల్లీ: సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) 12 వతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలకు మొత్తం 11,92,961 మంది హాజరుకాగా 88 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రి రమేశ్ పోబ్రియాల్ ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. పరీక్షాఫలితాలను cbseresults.nic.inలో చూడవచ్చు. గత ఏడాది 83.40 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 5.38శాతం అధిక ఉత్తీర్ణత నమోదైంది. త్రివేండ్రంలో అత్యధికంగా 97.67 శాతం మంది, […]
భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి ఎంతో విలువ వుంది. అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తారు. విద్యార్ధులను విద్యా ప్రాప్తిరస్తు అని, పెళ్లయిన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అని, పురుషులను దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తుంటారు. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, వేదోక్తంగా జరిగే కార్యక్రమాల్లో అక్కడ పండితులు ‘గో బ్రాహ్మణో శుభం భవతు, లోకాస్సమస్త సుఖినోభవంతు’ అనే ఆశీర్వదిస్తారు. దేశంలో రాజు న్యాయంగా, ధర్మంగా పరిపాలించాలనీ, దేశం సుభిక్షంగా వుండాలనీ, గోవులు, బ్రాహ్మణులు, ప్రజలందరూ సుఖంగా వుండాలనీ, దేశంలో సకాలంలో […]
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా విదేశీ విద్యార్థులకు షాక్ ఇచ్చింది. వివిధ కాలేజీల్లో చదువుతున్న ఫారెన్ స్టూడెంట్స్ పూర్తి ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అయ్యేలా ఉంటే తమ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చాలా కాలేజీలు ఆన్లైన్ క్లాసులు ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా.. కొత్తగా అడ్మిషన్ తీసుకునే వారు కూడా ఆన్లైన్ క్లాసులను ఆప్ట్ చేసుకుంటే వారికి వీసాలు జారీ చేసేది లేదని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్ […]