Breaking News

Day: July 23, 2020

నీరాకేఫ్​ ప్రారంభం

నీరాకేఫ్​ ప్రారంభం

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ ​మహానగరంలోని నెక్లెస్ రోడ్డులో సుమారు రూ.మూడు కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన నీరా కేఫ్ ను గురువారం మంత్రులు కె.తారక రామారావు, వి.శ్రీనివాస్​గౌడ్, తలసాని శ్రీనివాస్​యాదవ్​ తదితరులు బుధవారం ప్రారంభించారు. భువనగిరి ఎంపీ మాజీ బూర నర్సయ్యగౌడ్, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, గౌడ సంఘం నాయకులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Read More
పంద్రాగస్టు.. వీళ్లే ఆహ్వానితులు

పంద్రాగస్టు.. వీళ్లే ఆహ్వానితులు

సారథి న్యూస్, హైదరాబాద్: పంద్రాగస్టు వేడుకలకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డి కోలుకున్న వారిని ఆగస్టు 15న‌ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని రాష్ట్రాలకు సూచించింది. ఇక‌, రాష్ట్ర రాజధానుల్లో ఉదయం 9 గంటలకు వేడుకలు నిర్వహించాలని సూచించారు. పోలీసు, ఆర్మీ, పారామిలటరీ, ఎన్‌సీసీ దళాలు మార్చ్‌ఫాస్ట్‌కు మాస్క్‌ ధరించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. కరోనా దృష్ట్యా భారీస్థాయిలో ప్రజలు వేడుకల్లో పాల్గొనకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు […]

Read More
చాలెంజ్​గా తీసుకున్నరు

సెలబ్రెటీల గ్రీన్ చాలెంజ్

‘పుడమి పచ్చగుండాలే.. మన బతుకులు చల్లగుండాలే’ అనే నినాదంతో మొదలుపెట్టిన జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’కు మంచి స్పందన వస్తోంది. ప్రభుత్వాలు అటవీ సంపదను పెంచి కాలుష్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో చేపడుతున్న ఈ కార్యక్రమంలో సినీరాజకీయ క్రీడా ప్రముఖులు, సినీసెలబ్రిటీలు కూడా భాగస్వాములు అవుతున్నారు. మొదట ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటి చాలెంజ్ విసరడంతో హీరో అఖిల్ అక్కినేని, ఎంపీ కవిత మొక్కలు నాటారు. ఆ తర్వాత గ్రీన్ చాలెంజ్ స్వీకరించిన […]

Read More

తెలంగాణ‌లో డేంజర్​ బెల్స్​

సారథిన్యూస్​, హైదరాబాద్: తెలంగాణ‌లో క‌రోనావైర‌స్ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి స్టేజ్ 3కి చేరుకుంద‌ని, క‌మ్యూనిటీ స్ప్రేడ్ అవుతుంద‌ని సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించారు తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు. వ‌చ్చే నాలుగు-ఐదు వారాలు చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, ప్ర‌జ‌లంతా మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ఇక‌, రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి న‌గ‌రాల్లో కూడా క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయ‌న్న శ్రీ‌నివాస‌రావు ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన స‌మ‌యం అన్నారు. ల‌క్ష‌ణాలు లేనివారు క‌రోనా టెస్ట్‌ల […]

Read More

పోలీస్ ​గస్తీ మరింత పటిష్టం

సారథి న్యూస్, హుస్నాబాద్ : గ్రామాల్లో రాత్రి వెళల్లో పోలీస్​గస్తీని పటిష్ఠం చేయాలని ఏసీపీ సందేపొగు మహేందర్ అన్నారు. గురువారం కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలతో అనేక మంది మృత్యువాత పడుతున్నారన్నారు. వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. దర్యాప్తలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ సీఐ రఘు, […]

Read More
లంచం తీసుకుంటూ దొరికిన పెద్దడాక్టర్​

అడ్డంగా దొరికిన పెద్ద డాక్టర్

సారథిన్యూస్​, గద్వాల: లంచం తీసుకుంటూ జోగుళాంబ గద్వాల జిల్లా డీఎంహెచ్​వో భీమ్​నాయక్​ ఏసీబీ అధికారులను రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని వడ్డేపల్లి మండలంలో డాక్టర్​ ఏ మంజుల మెడికల్​ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె కాకతీయ యూనివర్సిటీలో పీజీలో జాయిన్​ అయ్యారు. ఇందుకోసం రిలీవింగ్​ ఆర్డర్​ కోసం డీఎంహెచ్​వోకు దరఖాస్తు చేసుకున్నారు. లంచాలకు అలవాటు పడ్డ డీఎంహెచ్​వో తన కిందిస్థాయి ఉద్యోగిని సైతం రూ. 7000 లంచం అడిగాడు. దీంతో మంజుల […]

Read More

కలెక్టర్​ ఆకస్మిక పర్యటన.. షాకింగ్​ నిజాలు

సారథిన్యూస్​, నాగర్​కర్నూల్​: నాగర్​కర్నూల్​ కలెక్టర్​ ఆకస్మిక పర్యటనతో షాకింగ్​ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాల్లో సిబ్బంది ఎవరూ సమయానికి ఆఫీస్​కు రారని.. ప్రజలను ఏమాత్రం పట్టించుకోవడంలేదని కలెక్టర్​ పర్యటనలో తేలింది. కొత్త కలెక్టర్​ శర్మన్​ విధుల్లో చేరినప్పటినుంచి బిజీబిజీగా గడుపుతున్నారు. ఎప్పటికప్పుడు ఆకస్మికపర్యటనలు చేస్తూ.. ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు. తాజాగా గురువారం ఆయన నాగర్​కర్నూల్​లో కాలినడకన తిరిగి పలు కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీచేశారు. ఉదయం 10:15 గంటలకు  డీఆర్వో మధుసూదన్ నాయక్ తో కలిసి […]

Read More
కరోనాతో 9 మంది మృతి

కరోనాతో 9 మంది మృతి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం 1,567 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా 50,826కు పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా 1,661 మంది రికవరీ అయ్యాయి. మహమ్మారి బారినపడి ఒకేరోజు 9 మంది కరోనా మృత్యువాతపడ్డారు. ఇప్పటిదాకా 438 మంది మృతిచెందారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ 662 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి 213, మేడ్చల్​33, సంగారెడ్డి 32, ఖమ్మం 10, కామారెడ్డి 17, వరంగల్ ​అర్బన్​75, వరంగల్ ​రూరల్​ 22, కరీంనగర్ 38, జగిత్యాల […]

Read More