సారథి న్యూస్, అనంతపురం: వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే చాలు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీచేశారు. కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించనుందని ప్రకటించారు. సోమవారం సీఎం తన క్యాంపు ఆఫీసులో ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ మల్లికార్జున్తో సమావేశమయ్యారు. ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న తీరుపై సీఎం ఆరాతీశారు. ఈ సందర్భంగా వెంటనే మరిన్ని జిల్లాలకు ఆరోగ్యశ్రీని వర్తింపు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ […]
సారథి న్యూస్, కర్నూలు: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనువాదులు దళితులు, మైనార్టీలు, ఇతర కులాల పేదలపై దాడులు పెరిగాయని కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు క్ష్మినరసింహా యాదవ్ ఆరోపించారు. సోమవారం నంద్యాల చెక్ పోస్టు సమీపంలోని పార్టీ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 7న అంబేద్కర్ ఇంటిపై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. ఈ దాడులను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలన్నారు. దాడికి నిరసనగా మంగళవారం అన్ని నియోజకవర్గాల్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలు […]
టాలీవుడ్.. కోలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శృతిహాసన్. మంచి ఫామ్ లో ఉన్నప్పుడు సినిమాలకు బ్రేక్ అప్ ఇచ్చి ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. రవితేజ ‘క్రాక్’ సినిమాలో నటిస్తోంది. హీందీలో విద్యత్ జమ్వాల్ తో చేసిన ‘యారా’ సినిమా రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ కానుంది. అయితే శృతి చెల్లెలు అక్షర హాసన్ చెల్లెలు అన్న విషయం అందరికీ తెలిసిందే. ‘మిస్టర్ కెకె’లో కీలక పాత్ర పోషించింది ఈ బ్యూటీ. అయితే అక్క చెల్లెళ్లు […]
సారథి న్యూస్, మహబూబ్ నగర్: జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన వీరన్నపేటలో 660 డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. అక్కడి నుంచి బయలుదేరుతున్న సమయంలో మంత్రి కాన్వాయ్ కు ఓ కుటుంబం అడ్డుకుంది. తమ భూమిని కబ్జా చేసి టీఆర్ఎస్ నేతలు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టారని, తమను బెదిరిస్తున్నారని న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే […]
సారథిన్యూస్, రామాయంపేట: తెలంగాణ ప్రభుత్వం పరిశుభ్రతకే అధిక ప్రాధాన్యమిస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆమె మెదక్ జిల్లా నిజాంపేట మండలకేంద్రంతోపాటు మండలపరిధిలోని నస్కల్, రాంపూర్, నందగోకుల్, చల్మేడ గ్రామాలలో డంప్ యార్డ్ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ వైరస్ ను తరిమి కొట్టాలంటే ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అందే ఇందిరా, జెడ్పీటీసీ విజయ్ కుమార్, మండల స్పెషల్ ఆఫీసర్ రామాయంపేట మున్సిపల్ […]
నల్లగొండ: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో పోలీస్ సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని నల్లగొండ జిల్లా అదనపు ఎస్పీ నర్మద సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రీడ్ స్వచ్చంద సంస్థ ప్రతినిధి డాక్టర్ అనూష ఆధ్వర్యంలో జిల్లాలోని 2000 మంది పోలీస్సిబ్బందికి రోగనిరోధకశక్తిని పెంచే హోమియో మందలను అందించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సీఐ రమేశ్, సత్యం, డీపీవో సూపరింటెండెంట్ దయాకర్, ఆర్ఐ నర్సింహాచారి, డీటీఆర్సీ సీఐ అంజయ్య, కార్తీక్, శంకర్, నవీన్, […]
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్ గ్రీన్చాలెంజ్ను స్వీకరించి కలెక్టరేట్ వద్ద మూడు మొక్కలు నాటారు. జిల్లా అదనపు కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో సన్యాసయ్య, డీఆర్డీఏ పీడీ విద్యాచందన లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ఓ సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ సిబ్బంది కవిత, మున్సిపల్ సిబ్బంది గురు లింగం, పర్యావరణ సూపర్వైజర్ దైదా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, రామడుగు: కరోనాను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ వెన్న రాజమల్లయ్య ఆరోపించారు. సోమవారం ఆయన తననివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు 30 వేల కేసులు నమోదైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా పరీక్షలు చేయడం లేదని విమర్శించారు. పారిశుధ్య కార్మికులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ఏఎన్ఎంలు, జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.