చిన్నారులపై ప్రభావం నిర్లక్ష్యమే కారణం జాగ్రత్తలు సూచిస్తున్న నిపుణులు న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ చిన్నారులపై తీవ్రప్రభావం చూపుతోంది. దేశరాజధాని ఢిల్లీలో ఈనెల 9 నుంచి 12 తేదీల మధ్యలోనే ఏడుగురు చిన్నారులు మృతిచెందినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఐదేళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్కూడా విస్తృతంగా లేకపోవడంతో రిస్క్ ఎక్కువగా కనిపిస్తుంది. పెద్దవారిలో లక్షణాలు కనిపించకపోగా వారిలో ఇబ్బందులు తక్కువగానే ఉంటున్నాయి. పిల్లల్లో వాంతులు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. బయట నుంచి రాగానే శానిటైజ్ చేసుకోకుండా […]
దేశంలో విస్తరిస్తున్న కరోనా ఒమిక్రాన్ కేసులు 3,071 న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. వరుసగా శనివారం రెండవరోజు కొత్తగా కేసులు లక్ష దాటాయి. ముందురోజు కంటే 21శాతం ఎక్కువగా కొత్త కేసులు నమోదయ్యాయి. వేగంగా విస్తరిస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు మూడువేలకు పైగానే నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. శుక్రవారం 15 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా, 1,41,986 మందికి వైరస్ పాజిటివ్గా […]
కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు వెసులుబాటు 50శాతం మంది ఇంటినుంచి పనిచేసేలా అనుమతి వీడియో కాన్ఫరెన్స్ల నిర్వహణకు ప్రాధాన్యం కరోనా, ఒమిక్రాన్వ్యాప్తి నేపథ్యంలో నిర్ణయం ఖరగ్ పూర్ఐఐటీలో 60 మందికి కరోనా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొవిడ్పాజిటివ్ న్యూఢిల్లీ/చండీగఢ్: దేశంలో కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. అండర్ సెక్రటరీ కంటే దిగువస్థాయి ఉద్యోగుల్లో 50శాతం మంది ఇంటి నుంచే పనిచేసేందుకు అనుమతించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సోమవారం ఉత్తర్వులు […]
శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం దాకా.. ఉద్యోగులకు వర్క్ఫ్రంహోం వెసులుబాటు కరోనా కేసులు పెరుగుతుండటంతో కీలక నిర్ణయం న్యూఢిల్లీ: కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం మరింత అలర్ట్ అయింది. వీకెండ్ కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే చాలారాష్ట్రాల్లో ఆంక్షలు అమలవుతున్నాయి. ఆ దిశగానే కీలక నిర్ణయం తీసుకున్నది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ విధించనున్నట్లు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం శుక్రవారం […]
కోల్కతా: కరోనా నయా వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తున్నాయి. జనం పెద్దఎత్తున గుమికూడడం, సభలు, సమావేశాలకు అనుమతి నిరాకరిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నాయి. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ మరో అడుగు ముందుకేసింది. దాదాపు లాక్డౌన్ తరహా ఆంక్షలను ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జూలు, వినోద పార్కులను జనవరి 3 నుంచి మూసివేస్తున్నట్లు […]
ఐదు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక 4 ఒమిక్రాన్ కేసులు నమోదు న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ దేశంలో భయాందోళనలకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న ఐదు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం శనివారం హెచ్చరికలు జారీచేసింది. ఒడిశా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మిజోరం, జమ్మూ కాశ్మీర్ లో రోజువారీగా కరోనా కేసులు, మరణాల రేటు వేగంగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. జమ్మూ కాశ్మీర్ లోని […]
యూకే టు హైదరాబాద్ ఓ మహిళకు కరోనా పాజిటివ్గా గుర్తింపు గచ్చిబౌలి టిమ్స్లో వైద్యపరీక్షలు కరోనా ఇంకా కనుమరుగు కాలే.. మాస్క్ లేకుంటే రూ.వెయ్యి జరిమానా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటేనే బెటర్ రెండు, మూడు నెలలు జాగ్రత్తగా ఉండాల్సిందే పబ్లిక్హెల్త్డైరెక్టర్శ్రీనివాస్ రావు వెల్లడి సామాజిక సారథి, హైదరాబాద్: దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 24 దేశాలకు విస్తరించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒమిక్రాన్దేశానికి రావొచ్చని, యూకే నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన […]
ఒమిక్రాన్ను తట్టుకోవడానికి సిద్ధం కావాలి ప్రధాని మోడీకి సీఎం కేజ్రీవాల్ ట్వీట్ సామాజిక సారథి, న్యూఢిల్లీ: ‘ప్రపంచవ్యాప్తంగా కొత్త కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దయచేసి అంతర్జాతీయ విమానాల రాకపోకలను ఆపండి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. మనం ఎందుకు ఆలస్యం చేస్తున్నామని హిందీలో చేసిన ట్వీట్లో కేజీవ్రాల్ అత్యవసరంగా విజ్ఞప్తి చేశారు. ‘అనేక దేశాలు ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి విమానాల రాకపోకలను నిలిపి వేశాయని, కరోనా […]