కోల్కతా: కరోనా నయా వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తున్నాయి. జనం పెద్దఎత్తున గుమికూడడం, సభలు, సమావేశాలకు అనుమతి నిరాకరిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నాయి. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ మరో అడుగు ముందుకేసింది. దాదాపు లాక్డౌన్ తరహా ఆంక్షలను ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జూలు, వినోద పార్కులను జనవరి 3 నుంచి మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి హెచ్కే ద్వివేదీ ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ, ప్రైవేట్కార్యాలయాలు 50 శాతం సామర్థ్యంతో మాత్రమే కార్యకలాపాలను కొనసాగించాలని స్పష్టం చేశారు. పాలనా పరమైన సమావేశాలను వర్చువల్గా నిర్వహించుకోవాలని సూచించారు. ఒమిక్రాన్ అణచివేతకు ఈ స్థాయిలో ఆంక్షలు విధించిన రాష్ట్రం ప్రస్తుతానికి పశ్చిమ బెంగాల్ ఒకటే కావడం విశేషం.
- January 3, 2022
- Archive
- Top News
- జాతీయం
- లోకల్ న్యూస్
- Calcutta
- Corona
- LOCKDOWN
- Omicron
- STATE
- Variant
- WEST BENGAL
- ఓమిక్రాన్
- కరోనా
- కలకత్త
- పశ్చిమబెంగాల్
- రాష్ట్రం
- లాక్డౌన్
- వేరియంట్
- Comments Off on పశ్చిమబెంగాల్ లో లాక్డౌన్?