Breaking News

ngkl

బిజినేపల్లిలో విషపు రెడ్డి

బిజినేపల్లిలో విషపు రెడ్డి!

సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలానికి చెందిన ఓ కాంగ్రెస్ లీడర్ నిర్వాకం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడినంటూ ఆ లీడర్ చేస్తున్న అరాచకాలు అన్నీఇన్ని కావు. అధికార పార్టీ లీడర్ నంటూ బిజినేపల్లి మండలంలో ఏకంగా మూడు గ్రామాలపై పెత్తనం చెలాయిస్తుండటంపై స్థానిక కాంగ్రెస్ నాయకులు గుర్రుగా ఉన్నారు. ఆరంభంలోనే ఆ లీడర్ గలీజ్ దందాలకు అడ్డుకట్ట వేయకపోతే మూడు గ్రామాల కార్యకర్తలు, నాయకులు […]

Read More
వట్టెంలో త్రిపుర గవర్నర్ పూజలు

వట్టెంలో త్రిపుర గవర్నర్ పూజలు

సామాజికసారథి, బిజినేపల్లి: త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి మంగళవారం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వారికి మాజీఎంపీ పి.రాములు, సీనియర్ నాయకులు బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, జనుంపల్లి రాంచంద్రారెడ్డి, సేవికాసమితి విభాగ్ కార్యవాహిక బి.దేదీప్యశ్రీ, బుసిరెడ్డి శకుంతల, నాగర్ కర్నూల్ నియోజకవర్గం రెడ్డి సేవాసమితి అధ్యక్షుడు ద్యాసాని లింగారెడ్డి, క్యాడెట్ బి.సాయిసుధాంశురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More
420 రేవంత్​ రెడ్డిని ఓడించండి: ఆర్​ఎస్పీ

420 రేవంత్​ రెడ్డిని ఓడించండి: ఆర్​ఎస్పీ

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​ బ్యూరో: గ్యారెంటీలు కాదు.. గారడీ మాటలు, 420 హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్​ రెడ్డిని పార్లమెంట్​ ఎన్నికల్లో ఓడించాలని నాగర్​ కర్నూల్​ బీఆర్​ఎస్​ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ పిలుపునిచ్చారు. శనివారం ఆయన బిజినేపల్లితో పాటు తిమ్మాజిపేటలో రోడ్​ షో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి డాక్టర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ ప్రసంగించారు. కేసీఆర్​ అమలుచేసిన పథకాలే తప్ప.. […]

Read More
ఏనుగుపై ‘మందా’ సవారీ!

ఏనుగుపై ‘మందా’ సవారీ!

సామాజికసారథి, నాగర్‌కర్నూల్ బ్యూరో: బీఎస్పీ నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా మాజీఎంపీ మందా జగన్నాథంకు దాదాపు టికెట్ ఖరారైంది. ఈనెల 18న ఆయన బీఎస్పీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. మందా జగన్నాథం మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత. అలంపూర్​ కు చెందిన ఆయన స్వయానా డాక్టర్​. ఆయన టీడీపీ నుంచి రాజకీయ అరగేట్రం చేశారు. 1999-2008(టీడీపీ), 2008-2013 (కాంగ్రెస్), 2013- 2014(టీఆర్‌ఎస్)లో ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో […]

Read More
అంబేద్కర్​ జయంతి వేడుకల్లో ఘర్షణ

అంబేద్కర్​ జయంతి వేడుకల్లో ఘర్షణ

బిజినేపల్లి మండలం వెలుగొండలో ఉద్రిక్తత సామాజికసారథి, బిజినేపల్లి: అంబేద్కర్​ జయంతి వేడుకల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డీజే పాటలతో ఊరేగింపు నిర్వహిస్తున్న కొందరు దళిత యువకులపై అదే గ్రామానికి చెందిన పలువురు అగ్రకులస్తులు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటన ఆదివారం రాత్రి నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు, స్థానికుల కథనం మేరకు వివరాలు.. భారతరత్న డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ జయంతి సందర్భంగా గ్రామంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఊరుఊరంతా కదిలివచ్చి ఆ […]

Read More
ప్రాణం తీసిన వివాహేతర బంధం

ప్రాణం తీసిన వివాహేతర బంధం

సామాజికసారథి, బిజినేపల్లి: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్నాయి. పిల్లలు, ఫ్యామిలీ సంబంధాలను రోడ్డు పాలు చేస్తున్నాయి. ఈ అక్రమబంధానికి మరో వివాహిత బలైపోయింది. ఈ బంధంలో చిక్కుకున్న ఓ యువతి దారుణ హత్యకు గురైంది. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో వెలుగుచూసింది. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు.. వట్టెం పరిధిలోని కల్వకుంటతండాకు చెందిన గిరిజన యువతి చిట్టెమ్మ(28) తన భర్తతో విడాకులు తీసుకుంది. అనంతరం […]

Read More

పాఠశాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేని పిలిచి అవమానించిన విద్యాశాఖ

# ఆగ్రహంతో డీఈఓ పై దాడికి దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు # ప్రభుత్వాలు మారిన ఇంకా మాజీలకే ప్రాధాన్యతనిస్తున్న అధికారులుసామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో:ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవానికి ప్రోటోకాల్ ప్రకారము స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ని ఆహ్వానించిన విద్యాశాఖ అధికారి గోవిందరాజులు స్థానిక ఎమ్మెల్యే రాకముందే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సమక్షంలో పాఠశాలను ప్రారంభించడంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది తాడూరు మండలం శిరిసవాడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను […]

Read More
YSR సన్నిహితుడు కె.వెంకట్రామిరెడ్డి కన్నుమూత

YSR సన్నిహితుడు కె.వెంకట్రామిరెడ్డి కన్నుమూత

సామాజికసారథి, నాగర్​ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లికి చెందిన బ్లాక్​ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సీనియర్​ నేత కె.వెంకట్రామిరెడ్డి(82) శనివారం అర్ధరాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దివంగత వెంకట్రామిరెడ్డికి భార్య భాగ్యమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు. సతీమణి గతంలో జెడ్పీటీసీగా పనిచేశారు. కుమారులు వేర్వేరు రంగాల్లో స్థిరపడ్డారు. కాగా, కె.వెంకట్రామిరెడ్డి ఈ ప్రాంత […]

Read More