Breaking News

MEETING

బీసీ సదస్సును విజయవంతం చేయాలి

బీసీ సదస్సును విజయవంతం చేయాలి

సామాజిక సారథి, నల్లగొండ: హైదరాబాద్ లోని తార్నాకలో  సెయింట్ ఆన్స్ జనరేట్ కేంద్రంలో నిర్వహించనున్న బీసీ యువజన సదస్సును విజయవంతం చేయాలని ఆ సదస్సు ప్రతినిధులు డా.బాల శ్రీనివాస్, అంకం జయప్రకాష్, నక్కా నర్సింహ యాదవ్ కోరారు. పూలే అంబేద్కర్ ఆలోచనా సమితి, తెలంగాణ డిగ్రీ కళాశాల అసోసియేషన్ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 27,28 వ తేదీలలో నిర్వహిచే దస్సుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను నల్లగొండ జిల్లా కేంద్రంలో బీసీ యువజన సంక్షేమ సంఘం కమిటీని […]

Read More

ఇలా చేస్తే.. కరోనా ఎందుకు రాదు

మానోపాడు: ఒకవైపు కరోనా మహమ్మారి ఇంకా ప్రబలుతుంటే కొందరేమో సామాజిక దూరం, మాస్కు ధరించకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానోపాడు మండల కేంద్రంలోని ఎస్​బీఐ బ్యాంకు దగ్గర బ్యాంకు రుణాలపై మహిళా సంఘాలకు, సమైక్య అధికారులు ఎస్​బీఐ బ్యాంక్ సిబ్బంది అవగాహన కల్పించారు. అయితే ఈ సమావేశానికి100 మంది దాకా హాజరయ్యారు. అయితే వారేవరూ మాస్కు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.

Read More
చిల్డ్రన్ పార్క్ ను కబ్జా చేసేందుకు కుట్ర

చిల్డ్రన్ పార్క్ ను కబ్జా చేసేందుకు కుట్ర

సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్​ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ని చిల్డ్రన్ పార్కు లో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడంపై ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. కబ్జాచేసేందుకు కుట్రపన్నుతున్నారని ఆక్షేపించారు. శుక్రవారం నర్సాపూర్ ఎంపీడీవో ఆఫీసులో ఎంపీపీ జ్యోతిసురేష్ నాయక్ అధ్యక్షతన జనరల్ బాడీ మీటింగ్ ​నిర్వహించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ.. నర్సాపూర్ చెరువులో పెద్దఎత్తున ఇసుకను తవ్వుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. పేదలు ఇంటి బాత్​రూమ్​ను కట్టుకోవడానికి ట్రాక్టర్ […]

Read More

మీటింగ్​ కాదు.. ఫైటింగ్​

సారథి న్యూస్​, బిజినేపల్లి: నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండల పరిషత్​లో శనివారం నిర్వహించిన సర్వసభ్యసమావేశంలో తీవ్ర దుమారం చెలరేగింది. వాగ్వాదాలు, సవాళ్లు, చాలెంజ్​ విసురుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకరిమీదకు ఒకరూ కొట్టుకొనే స్థాయికి వెళ్లారు. సమావేశమంతా రసాబాసగా మారింది. ‘లక్షలు రూపాయలు అప్పులు తీసుకొచ్చి పనులు చేస్తుంటే.. మిషన్​ భగీరథ ఏఈ రాఘవేంద్రరావు బిల్లులు చేయకుండా వేధిస్తున్నారని.. ఆయన లంచాలకు మరిగారని బిజినేపల్లి సర్పంచ్​ బాల్​ ఈశ్వర్​ ధ్వజమెత్తారు. దీనిపై ఏఈ రాఘవేంద్రరావు కూడా తీవ్రంగా స్పందించారు. […]

Read More
నీట్​, జేఈఈ ఆపండి

నీట్​, జేఈఈ ఆపండి

ఢిల్లీ: నీట్, జేఈఈను ఆపాలంటూ విపక్షాలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నాయి. దేశవ్యాప్తంగా సెప్టెంబర్​ 1 నుంచి ఈ పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బుధవారం కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ విపక్ష పార్టీల సీఎంలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న పశ్చిమబెంగాల్​ సీఎం మమతా బెనర్జీ నీట్​, జేఈఈ అంశాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. ఆమె మొదటి నుంచి ఈ పరీక్షలను రద్దు చేయాలని కోరుతున్నారు. ఇటీవలే ప్రధాని మోడీకి లేఖ […]

Read More

సోనియమ్మకే మళ్లీ పగ్గాలు

ఢిల్లీ: కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగకుండానే కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ భేటీ ముగిసింది. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే కొనసాగించాలని కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ నిర్ణయం తీసుకున్నది. సోమవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని ఊహాగానాలు వెల్లువెత్తడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే పలు నాటకీయ పరిణామాల మధ్య సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. సోనియాగాంధీ పేరును పార్టీ సీనియర్​ నాయకులు మన్మోహన్​ […]

Read More

బహిరంగ ‘లేఖ’పై రాహుల్​ ఫైర్​

న్యూఢిల్లీ: ఎప్పడు ప్రశాంతంగా ఉండే రాహుల్​ గాంధీ ఒక్కసారిగా తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. సొంతపార్టీలోని సీనియర్​ నేతలను కడిగిపారేశారు. వారిపై తీవ్రకోపం ప్రదర్శించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సీడబ్ల్యూసీ (కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ ) సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్​లో పాల్గొన్న రాహుల్​.. 23 మంది సీనియర్లు నేరుగా సోనియాగాంధీకి లేఖ రాయడం.. దాన్ని మీడియాకు విడుదల చేయడంపై ఫైర్​ అయ్యినట్టు సమాచారం. ‘సోనియాగాంధీ అనారోగ్యంతో ఉండి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సమయంలో మీరు లేఖ ఎందుకు […]

Read More

సీడబ్ల్యూసీ.. గరం గరం

న్యూఢిల్లీ: కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సమావేశం వాడీవేడిగా సాగుతున్నది. బహిరంగ లేఖ విషయంపై రాహుల్​ గాంధీ సీనియర్​ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో రాహుల్ వైఖరిపై సీనియర్​ నేతలు గులాం నబీ ఆజాద్​, కపిల్​ సిబల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ఓ దశలో వారిద్దరూ రాజీనామాకు సిద్ధపడ్డట్టు జాతీయమీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్​ పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహిస్తున్న […]

Read More