రాష్ట్రంలో ఇద్దరి మృతి సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణలో 146 కరోనా కేసులు ఆదివారం నమోదయ్యాయి. ఇద్దరు మృతిచెందారు. 24 గంటల్లో 26,625 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 146 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 72 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 20 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 189 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,78,288 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,70,435 మంది […]
సామాజిక సారథి, జహీరాబాద్: ప్రజలు కోవిడ్ బారిన పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని, విధిగా వ్యాక్సినేషన్ తీసుకోవాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా కోరారు. సోమవారం జహీరాబాద్ మండలపరిధిలోని షేఖాపూర్ గ్రామ పంచాయతీ లో వాక్సినేషన్ ప్రక్రియ ను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలో డోర్ టు డోర్ వాక్సినేషన్ కార్యక్రమములో పాల్గొని మాట్లాడుతూ అందరూ వాక్సిన్ తీసుకోవాలన్నారు. కొవిడ్ క్రొత్త రకం ఒమిక్రాన్ కేసులు దేశములో పెరుగుతున్నాయనీ తెలిపారు. జిల్లాలో డిసెంబర్ 31 వరకు […]
ఐదు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక 4 ఒమిక్రాన్ కేసులు నమోదు న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ దేశంలో భయాందోళనలకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న ఐదు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం శనివారం హెచ్చరికలు జారీచేసింది. ఒడిశా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మిజోరం, జమ్మూ కాశ్మీర్ లో రోజువారీగా కరోనా కేసులు, మరణాల రేటు వేగంగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. జమ్మూ కాశ్మీర్ లోని […]
సమాజిక సారథి, మెదక్ ప్రతినిధి: మెదక్ జిల్లా హావేలి ఘనపూర్ లోని జ్యోతిబాపులే బాలికల రెసిడెన్షియల్ స్కూల్ లో బాలికలకు వైద్యాధికారులు పరీక్షలు చేయగా ఇద్దరు విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ నిర్దారణ వైద్యాధికారులు తెలిపారు. అదే విధంగా బాలుర పాఠశాలలో విద్యార్థులకు కరోనా పరీక్షలు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలన్నారు. స్కూల్ లో విద్యార్థుల అందరికీ టెస్ట్ చేస్తామని సర్ధన పీ హెచ్ సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్ర శేఖర్ తెలిపారు.
యూకే టు హైదరాబాద్ ఓ మహిళకు కరోనా పాజిటివ్గా గుర్తింపు గచ్చిబౌలి టిమ్స్లో వైద్యపరీక్షలు కరోనా ఇంకా కనుమరుగు కాలే.. మాస్క్ లేకుంటే రూ.వెయ్యి జరిమానా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటేనే బెటర్ రెండు, మూడు నెలలు జాగ్రత్తగా ఉండాల్సిందే పబ్లిక్హెల్త్డైరెక్టర్శ్రీనివాస్ రావు వెల్లడి సామాజిక సారథి, హైదరాబాద్: దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 24 దేశాలకు విస్తరించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒమిక్రాన్దేశానికి రావొచ్చని, యూకే నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన […]
సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: పటాన్ చెరువు మండలం ముత్తంగి బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. గురుకుల పాఠశాలలో నిన్న కరోనా కలకలం రేగిన విషయం తెలిసిందే. పాఠశాలలోని ఉపాధ్యాయురాలు పాటు 43 మందికి కరోనా పాజిటివ్ రావడంతో పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పాఠశాల సిబ్బందితో మాట్లాడారు. భయం భయం వద్దని, అందరికీ అండగా జిల్లా యంత్రాంగం […]
ఒమిక్రాన్ను తట్టుకోవడానికి సిద్ధం కావాలి ప్రధాని మోడీకి సీఎం కేజ్రీవాల్ ట్వీట్ సామాజిక సారథి, న్యూఢిల్లీ: ‘ప్రపంచవ్యాప్తంగా కొత్త కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దయచేసి అంతర్జాతీయ విమానాల రాకపోకలను ఆపండి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. మనం ఎందుకు ఆలస్యం చేస్తున్నామని హిందీలో చేసిన ట్వీట్లో కేజీవ్రాల్ అత్యవసరంగా విజ్ఞప్తి చేశారు. ‘అనేక దేశాలు ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి విమానాల రాకపోకలను నిలిపి వేశాయని, కరోనా […]
11 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ ప్రత్యేక పర్యవేక్షణలో ట్రీట్మెంట్ సామాజిక సారథి, హైదరాబాద్: సౌతాఫ్రికా నుంచి హైదరాబాద్కు మూడు రోజుల్లో 185 మంది ప్రయాణికులు వచ్చారు. నవంబర్ 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఒమిక్రాన్ వేరియంట్తో వణికిపోతున్న బోట్స్వానా నుంచి 16 మంది వచ్చారు. దీంతో చాలామంది భయపడుతున్నారు. అంతేకాకుండా కరోనా కొత్త వేరియెంట్ కేసులున్న 12 దేశాల నుంచి వచ్చిన వారు కూడా ఇందులో ఉన్నారు. హైదరాబాద్కు వచ్చిన […]