సామాజిక సారథి, వరంగల్: వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో మరోసారి మెడికోలు కరోనా బారిన పడ్డారు. ఎంజీఎంలో విధులు నిర్వహిస్తున్న కొంత మందిలో మెడికల్ విద్యార్థులకు కరోనా లక్షణాలు ఉండడం తో టెస్టులు చేయగా టెస్టులు చేసిన వారిలో 17 మందికి కరోనా నిర్ధారణ అయిందని వైద్యులు తెలిపారు. కరోనా వచ్చిన వారిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.
సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: పటాన్ చెరువు మండలం ముత్తంగి బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. గురుకుల పాఠశాలలో నిన్న కరోనా కలకలం రేగిన విషయం తెలిసిందే. పాఠశాలలోని ఉపాధ్యాయురాలు పాటు 43 మందికి కరోనా పాజిటివ్ రావడంతో పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పాఠశాల సిబ్బందితో మాట్లాడారు. భయం భయం వద్దని, అందరికీ అండగా జిల్లా యంత్రాంగం […]
సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విద్యార్థుల కోసం ఓ కళాశాలకోసం దానం చేసిన స్థలంలో ప్రస్తుతం కబ్జాకోరులు కన్నుపడి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అఖిల భారత మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేడల ప్రసాద్ ఆరోపించారు. మున్సిపల్ పరిధిలోని కాశీబుగ్గ వివేకానంద జూనియర్ కళాశాల ఆవరణ లోపల అక్రమంగా నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని ప్రజల సంఘాల నాయకులు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఆంగ్ల అధ్యాపకుడిగా పనిచేస్తున్న అజ్మీర రాజు కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారు. కాగా శనివారం ఆయనకు హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో ఆపరేషన్ నిర్వహించారు. దీంతో ఆపరేషన్ వికటించి ప్రాణాలు కోల్పోయాడు. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని అజ్మీరా తండాకు చెందిన రాజు.. 15 ఏళ్లుగా పెద్దశంకరంపేటలో పార్ట్టైమ్ లెక్చరర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రాజు మృతికి ప్రిన్సిపాల్ అవనీష్ రెడ్డి, అధ్యాపకులు మల్లేశం, అనంత రాజ్ […]
సారథి న్యూస్, రామగుండం: ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి అన్నిరంగాల్లోనూ అద్భుతాలు సాధించవచ్చని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్ పేర్కొన్నారు. సోమవారం మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో ఓ జాతీయ సదస్సును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. మైనింగ్ ఇంజినీరింగ్ నిపుణులు, వివిధ శాఖల అధికారులు ఈ సదస్సులో పాల్లొన్నారు. వారంపాటు ఈ వీడియో కాన్ఫరెన్స్ కొనసాగనున్నది. కార్యక్రమంలో మైనింగ్ సేఫ్టీ (సౌత్ సెంట్రల్ జోన్) డిప్యూటీ డైరెక్టర్ మలయ్ టికేదార్, డిప్యూటీ డెరెక్టర్ ఆఫ్ మైన్ […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు మెడికల్ కాలేజీ నెఫ్రాలజీ విభాగానికి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ కు రెండు సీట్లు అప్రూవల్ వచ్చాయని డీఎంఈ, ప్రిన్సిపల్ డాక్టర్ పి.చంద్రశేఖర్ శనివారం తెలిపారు. ఇన్నిరోజుల తర్వాత అప్రూవల్వచ్చిందన్నారు.