Breaking News

ACCIDENT

జారిపడ్డ నన్నపనేని.. తలకు తీవ్రగాయం

సారథిన్యూస్​, తెనాలి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి ఆదివారం ప్రమాదవశాత్తు తన ఇంట్లో జారిపడ్డారు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు వెంటనే తెనాలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. మరోవైపు ఆమెకు ఆస్పత్రిలో ప్రస్తుతం పరీక్షలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, యువనేత లోకేశ్​, ఇతర సీనియర్​ నేతలు నన్నపనేని రాజకుమారి కుటుంబసభ్యులకు ఫోన్​చేసి ఆరోగ్య వివరాల గురించి ఆరా తీశారు. మరోవైపు […]

Read More
తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం

తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి శివారు వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచానూరు నుంచి తాడిపత్రికి వస్తున్న తుఫాన్ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా.. ఏడుగురికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతులు తాడిపత్రి వాసులేనని తేలింది. కాగా, ప్రమాదంలో మృతి చెందిన వారు హేమలత, సుబ్రమణ్యం, వెంకటరంగయ్యగా గుర్తించారు.

Read More

ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి

సారథిన్యూస్, రామడుగు: పేదరికం ఆ కుటుంబాన్ని చిదిమేసింది. విధి వెక్కిరించింది. చిన్న వయసులోనే ఇద్దరు పిల్లల నా అనేవాళ్లకు దూరమై అనాథలయ్యారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం రుద్రారం గ్రామానికి చెందిన గుర్రం వనిత (17), గుర్రం నవీన్ కుమార్(6)ల తల్లిదండ్రులు నాలుగేండ్ల క్రితం ఓ ప్రమాదంలో చనిపోయారు. దీంతో వాళ్ల నాన్నమ్మే పిల్లలిద్దరినీ పెంచి పోషించింది. సోమవారం వాళ్ల నాన్నమ్మ కూడా తుదిశ్వాస విడిచింది. దీంతో వీరు అనాథలయ్యారు. ప్రస్తుతం ఆ చిన్నారులు దిక్కుతోచని స్థితిలో […]

Read More
నిద్రమత్తే మృత్యువైంది

నిద్రమత్తే మృత్యువైంది

చింతపల్లి: హైదరాబాద్ – నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం ధైర్యపురితండా వద్ద కారు వేగం అదుపుతప్పి బోల్తాపడింది. రోడ్డు పక్కన వాటర్​లైన్​పిల్లర్​ను ఢీకొని కారు ఐదారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి మల్లేపల్లి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణం కారణమని తెలుస్తోంది. కారులో ఇరుక్కపోయిన మృతదేహాలను పోలీసులు అతికష్టం మీద […]

Read More

రోడ్డుప్రమాదంలో కానిస్టేబుల్​ మృతి

సారథి న్యూస్​, మానవపాడు: రోడ్డుప్రమాదంలో ఏఆర్​ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటన ఏపీలోని కర్నూల్​ సమీపంలో చోటుచేసుకున్నది. ఏఆర్​ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మాధవి ఎమ్మిగనూరు నుంచి కర్నూలు జిల్లా పంచలింగాలకు వెళ్తున్నది. ఈ క్రమంలో తుంగభద్ర బ్రిడ్జిపై వెనుక నుంచి వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధవి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Read More
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

వేటపాలెం : ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో బైక్​ను తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు. స్థానికుల, పోలీసుల కథనం ప్రకారం  కర్నూలు నుంచి చీరాలకు వేటపాలెం మండలం అక్కాయి పాలెం జాతీయరహదారి ప్తె వస్తున్న కారు ముందుగా వెళ్తున్న బైక్​ను తప్పించుకోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది..  ప్రమాదం లో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి..ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు […]

Read More
కేరళలో ఘోర విమానప్రమాదం

విమానం ముక్కలు.. 19 మంది మృతి

తిరువనంతపురం: దుబాయ్​ నుంచి కేరళ రాష్ట్రంలోని కోజికోడ్​కు వస్తున్న ఓ ఎయిర్​ ఇండియా విమానం కుప్పకూలింది. విమానం లోయలోపడి రెండు ముక్కలు కావడంతో పైలట్​, ఐదుగురు సిబ్బందితో పాటు మరో 19 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఎయిర్​ ఇండియాకు చెందిన డీఎక్స్ ​బీ​సీసీజే బోయింగ్​ 737 విమానం రన్​వే పై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 123 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో 15 మంది […]

Read More

రాఖీ కట్టేందుకు వెళ్తూ..

సారథిన్యూస్​, పెద్దపల్లి: ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా రాఖీ కడుదామనుకున్న ఓ సోదరి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు ఆ మహిళను బలితీసుకున్నది. సోదరుడి చేతుల్లోనే ఆ యువతి ప్రాణాలు విడిచింది. ఈ విషాధ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని రాజీవ్​ రహదారిపై శనివారం చోటుచేసుకున్నది. పెద్దపల్లి జిల్లాకు చెందని ఓ మహిళ రాఖీ పౌర్ణమి పండుగకోసం తన సోదరుడితో కలిసి గోదావరిఖనికి బైక్​పై వస్తుండగా.. రాజీవ్​ […]

Read More