న్యూఢిల్లీ: మరో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సంగ్రామం మొదలైంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అస్సాం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా శుక్రవారం వెలువరించారు. కేరళలో 140, అస్సాం 126, తమిళనాడు 234, పశ్చిమబెంగాల్ 294, పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే […]
కేరళ లో అరెస్టు చేసిన పోలీసులు తిరువనంతపురం : సాంకేతికత పెరిగినకొద్దీ మోసాలు, అవి చేసే వాళ్ల ప్రవృత్తి కూడా పెరుగుతున్నది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి, ఆ వైరస్ నుంచి మనిషిని కాపాడడానికి తయారు చేసుకున్న మాస్కులో బంగారాన్ని స్మగ్లింగ్ చేశాడో వ్యక్తి. గురువారం కేరళలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేరళ నుంచి దుబాయ్ వెళ్లడానికి విమానం సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో అందులో వెళ్లే ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా […]
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ పేలుళ్లు జరిపి అల్లకల్లోలం సృష్టిద్దామనుకున్న ఉగ్రవాదుల కుట్రను ఎన్ఐఏ ( నేషనల్ ఇన్విస్టిగేషన్ ఎజెన్సీ) భగ్నం చేసింది. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు మెరుపుదాడి నిర్వహించి 9 మంది ఆల్ఖైదా టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు. టెర్రరిస్టులు దేశరాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లకు స్కెచ్ వేశారని అధికారుల దర్యాప్తులో తేలింది. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం, వెస్ట్ బెంగాల్ లో ముషీరాబాద్ లో ఉగ్రవాదులను పట్టుకున్నారు. ఓ వైపు దేశం […]
నయనతార ఇటీవల తన బాయ్ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్తో కలిసి ఓనమ్ పండుగను జరుపుకుంది. తన ప్రియుడితో కలిసి కొచ్చికి వెళ్లి అక్కడ ఓనమ్ వేడుకల్లో పాల్గొన్నది. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ పండుగలో పాల్గొనేందుకు నయన్ చెన్నై నుంచి ఓ చార్టర్డ్ ఫ్టైట్ను బుక్ చేసుకుని వెళ్లినట్టు టాక్. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ తమిళ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పెళ్లిపై వీరు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఓ అమ్మాయి చెట్లు, గోడలు ఎక్కుతుందంటే.. చుట్టూ ఉన్న జనం అదో తప్పుగా, వింతగా చూస్తుంటారు. ‘ఆ పిల్ల మగరాయుడిలా చెట్టు ఎక్కుతుంటే.. వాళ్ల అమ్మానాన్నలైనా బుద్ధి చెప్పొందా?’ అంటూ నలుగురూ ఆడిపోసుకుంటారు. ఇలాంటి నలుగురి నోళ్లే కాదు.. వందమంది అంటున్నా పట్టించుకోకుండా కుటుంబపోషణ కోసం కొబ్బరి చెట్లు ఎక్కుతోంది 25 ఏళ్ల శ్రీదేవి గోపాలన్.. తండ్రి సంపాదనతో పోషణశ్రీదేవి కుటుంబం కేరళలోని మలప్పురం గ్రామంలో ఉంటోంది. ఆమె తండ్రి గోపాలన్కొబ్బరి చెట్లు ఎక్కితే వచ్చే డబ్బుతో […]
దేవుడిని అతిసామాన్యుడి వద్దకు తీసుకొచ్చి దేవుడికి కులమత భేదాలు లేవని నిరూపించిన మహా దార్శనికుడు మహర్షి నారాయణగురు. ఆయన దేవాలయాలు భక్తి, ముక్తి కేంద్రాలుగా కాకుండా మలచిన మహాశిల్పి, సాహసికుడు. మానవులను అనాదిగా పట్టి పీడిస్తున్న అంధకారాన్ని ఙ్ఞానంతో తొలగించ వచ్చని, ఙ్ఞానం విద్యతోనే సాధ్యమని భావించి, అతి సామాన్యుడికి చదివించేందుకు అలుపెరుగని కృషి చేసిన మహాయోగి. చదువుతోనే స్వేచ్ఛ, సంఘటిమవడం ద్వారా శక్తి, చదువు అనేది స్వేచ్ఛ, సమానత్వాలను సాధించుకునేందుకు నిచ్చెనలా ఉపయోగపడుతుందని ప్రభోదించారు. మహాఙ్ఞాని, […]
తిరువనంతపురం: షార్జా నుంచి అక్రమ పద్ధతిలో ఓ ప్రయాణికుడు తీసుకొచ్చిన రూ.60.26 లక్షల విలువైన 1,357 గ్రాముల బంగారాన్ని కేరళలోని కన్నూర్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తిరువనంతపురం: దుబాయ్ నుంచి కేరళ రాష్ట్రంలోని కోజికోడ్కు వస్తున్న ఓ ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. విమానం లోయలోపడి రెండు ముక్కలు కావడంతో పైలట్, ఐదుగురు సిబ్బందితో పాటు మరో 19 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఎయిర్ ఇండియాకు చెందిన డీఎక్స్ బీసీసీజే బోయింగ్ 737 విమానం రన్వే పై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 123 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో 15 మంది […]