వేటపాలెం : ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో బైక్ను తప్పించబోయి కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు. స్థానికుల, పోలీసుల కథనం ప్రకారం కర్నూలు నుంచి చీరాలకు వేటపాలెం మండలం అక్కాయి పాలెం జాతీయరహదారి ప్తె వస్తున్న కారు ముందుగా వెళ్తున్న బైక్ను తప్పించుకోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. ప్రమాదం లో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి..ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు […]
వాషింగ్టన్: అమెరికాకు చెందని పౌరహక్కుల నేత, కాంగ్రెస్ సభ్యుడు జాన్ లూయిస్(80) ప్రాణాలు కోల్పోయారు. గత కొంతకాలంగా ఆయన ప్యాంక్రియాటిక్ కేన్సర్తో బాధపడుతున్నారు. జాన్ అమెరికాలో ఎన్నో పౌరహక్కుల ఉద్యమాలు చేశారు. యూఎస్ ప్రతినిధుల సభలోనూ సభ్యుడికి వ్యవహరించారు. 1965లో ఆయనను అమెరికన్ పోలీసులు దారుణంగా కొట్టారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అప్పుడు ప్రాణాలతో బయటపడ్డ జాన్ పౌరహక్కుల ఉద్యమనేతగా ఎదిగారు. ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఆయన మృతికి అమెరికా మాజీ ప్రెసిడెంట్ […]
సారథి న్యూస్, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా ఇందారం ఓపెన్ కాస్ట్ ఓబీ కంపెనీలో విధినిర్వహణలో ఉండగా చనిపోయిన కార్మికుడి కుటుంబానికు రూ. 50 లక్షలు పరిహారం చెల్లించాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కడారి సునీల్, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తోకల రమేష్ డిమాండ్ చేశారు. ఓబీ కంపెనీలో సర్వే అధికారుల పనులను జనరల్ క్యాటగిరి కాంట్రాక్టు కార్మికులతో పని చేయడం మూలంగా కార్మికుడు చనిపోయాడని ఆరోపించారు. కార్యక్రమంలో […]