Breaking News

NAGARJUNASAGAR

మళ్లీ మొదలైన లీకేజ్..!?

మళ్లీ మొదలైన లీకేజ్..!?        

సామాజిక సారథి, నిడమనూరు: నిడమనూరు పరిధిలోని వేంపాడు సమీపంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు ఇటీవల గండి పడింది. దీంతో అప్రమత్తమైన సంబంధి ఉన్నతాధికారులు గండి పూడ్చారు. అదే ప్రదేశంలో శనివారం సాయంత్రం కట్టకు అతి తక్కువ మోతాదులో నీటి లీకేజీ ప్రారంభమైనట్లు గ్రామస్తులు తెలిపారు. కెనాల్ లో పూర్తిస్థాయిలో నీరు ప్రవహిస్తున్నందున గండి పూడ్చిన ప్రదేశాల్లో నీటి లీకేజీలు సహజంగా ఉంటాయని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందని రైతులు, స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి లీకేజీలు […]

Read More
నాగార్జునసాగర్​ లో నువ్వా.. నేనా?

నాగార్జునసాగర్ లో నువ్వా.. నేనా?

సారథి, నాగార్జునసాగర్​: నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఖరారైంది. టీఆర్ఎస్‌లో ఎన్నో ట్విస్ట్ ల మధ్య నోముల భగత్ కు టికెట్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి.. అభ్యర్థిని ప్రకటించడంతో పాటు వెంటనే బీ ఫామ్ కూడా అందజేయడంతో ఉత్కంఠతకు తెరతీసినట్లయింది. నర్సింహాయ్య కుటుంబానికి బాసటగా నిలుస్తానన్న హామీ మేరకు ఆయన కుమారుడికి టికెట్ కేటాయించారు. ఇక కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత కె.జానారెడ్డి అభ్యర్థిత్వం ఎప్పుడో ఖరారైంది. ఇప్పటికే నియోజకవర్గంలో తనదైన శైలిలో ప్రచారంలో […]

Read More
మోసం చేయడం ఆయన నైజం: భట్టి

మోసం చేయడం ఆయన నైజం : భట్టి

సారథి న్యూస్, తుంగపాడు(మిర్యాలగూడ): నూతన వ్యవసాయ చట్టాలు అమలైతే ఐకేపీ సెంటర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తేయడం ద్వారా ఇటు మహిళలు, అటు రైతులు కోలుకోలేని విధంగా నష్టపోతారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రుణమాఫీ అమలు చేయకుండా రైతులను సీఎం కేసీఆర్ ​మోసం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాయమాటలు చెప్పడం ఆ తర్వాత మోసం చేయడం ఆయన నైజమని ధ్వజమెత్తారు. రైతులతో ముఖముఖి కార్యక్రమంలో భాగంగా ఆయన శుక్రవారం నల్లగొండ […]

Read More
దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు ఘన నివాళి

దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు ఘన నివాళి

సారథి న్యూస్​, నల్లగొండ: అనారోగ్యంతో ఇటీవల కన్నుమూసిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు సంతాప సభను ఆదివారం నల్లగొండ జిల్లా హాలియాలో నిర్వహించారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్, గుంటకండ్ల జగదీశ్వర్​రెడ్డి, శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపురెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, […]

Read More
ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య కన్నుమూత

నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య కన్నుమూత

తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేసిన సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్, హైదరాబాద్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మార్క్సిస్టు దృక్పథంతో ప్రజాసమస్యలపై పాలకులను నిలదీసిన నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య(64) మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుండగా వెంటనే హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. నోముల 30ఏళ్లకు పైగా రాజకీయ, ప్రజాజీవితంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. 1987లో జరిగిన మండల […]

Read More
నిద్రమత్తే మృత్యువైంది

నిద్రమత్తే మృత్యువైంది

చింతపల్లి: హైదరాబాద్ – నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం ధైర్యపురితండా వద్ద కారు వేగం అదుపుతప్పి బోల్తాపడింది. రోడ్డు పక్కన వాటర్​లైన్​పిల్లర్​ను ఢీకొని కారు ఐదారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి మల్లేపల్లి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణం కారణమని తెలుస్తోంది. కారులో ఇరుక్కపోయిన మృతదేహాలను పోలీసులు అతికష్టం మీద […]

Read More
సాగర్ నుంచి కృష్ణమ్మ ప‌ర‌వ‌ళ్లు

సాగర్ నుంచి కృష్ణమ్మ ప‌ర‌వ‌ళ్లు

సారథి న్యూస్, నాగార్జునసాగర్: కృష్ణానది ప‌ర‌వ‌ళ్లు తొక్కుతుంది. వ‌ర‌ద ఉధృతి కొన‌సాగుతుండ‌డంతో శ్రీ‌శైలం గేట్లను ఎత్తి నాగార్జునసాగర్​డ్యాంకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్​14 గేట్లను ఎత్తి 3,28,440 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్​ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 587.3 అడుగుల మేర ఉంది. 3,28,440 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రిజర్వాయర్​లోకి కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటినిల్వ 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 305.6838 టీఎంసీలు ఉంది. నాగార్జున […]

Read More
నాగార్జునసాగర్​4 గేట్ల ఎత్తివేత

నాగార్జునసాగర్ ​4 గేట్ల ఎత్తివేత

నాగార్జునసాగర్: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో శుక్రవారం మధ్యాహ్నం నాగార్జునసాగర్‌ 4 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి 3.45 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల కొనసాగుతోంది. నాగార్జునసాగర్​ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 585 అడుగుల మేర ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 312.04 టీఎంసీలకు గాను ప్రస్తుతం 271.37 టీఎంసీల నిల్వ ఉంది.

Read More