సారథి న్యూస్, బిజినేపల్లి: రైతు వేదికల ప్రారంభం సందర్భంగా నిరసన తెలిపేందుకు వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్చేశారు. పాలెం గ్రామంలో నిర్మించిన రైతు వేదికను బుధవారం ప్రారంభించేందుకు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వస్తున్నారన్న విషయం తెలుసుకుని పెద్ద సంఖ్యలో వివిధ గ్రామాల నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. రైతువేదిక భవనాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి లక్షల రూపాయలు వస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ చిత్రపటం లేదని ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అడ్డగించి అరెస్ట్ చేశారు.
- December 30, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- BJP
- NAGARKURNOOL
- RYTHUVEDIKA
- SINGIREDDY
- నాగర్కర్నూల్
- బీజేపీ
- రైతు వేదిక
- సింగిరెడ్డి
- Comments Off on బీజేపీ కార్యకర్తల అరెస్ట్