సామాజికసారథి, చేవెళ్ల: విద్యార్థుల ఫీజ్ రీయంబర్స్మెంట్, పెండింగులో ఉన్న స్కాలర్షీప్ను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి రాజేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం చేవెళ్లలోని పలు పాఠశాల విద్యార్థులతో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. విద్యాసంస్థల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో సమస్యలను పరిష్కరించాలని, దానితోపాటు కనీస మౌలిక వసతులు కల్పించాలన్నారు. అంతేకాకుండా కార్పొరేటు ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల దోపిడీని అరికట్టాలని, అనుమతులు లేని పాఠశాలలను గుర్తింపు రద్దుచేయాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక ఆర్డీవోకు సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సురేష్, జైపాల్, రమాకాంత్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- December 17, 2022
- Archive
- హైదరాబాద్
- Comments Off on ఫీజురీయింబర్స్మెంట్ విడుదల చేయాలి