Breaking News

క్రైమ్

ఎస్సై చొరవతో యువతి సేఫ్​!

ఎస్సై చొరవతో యువతి సేఫ్​!

సారథి న్యూస్, బిజినేపల్లి: కలహాలతో ఓ యువతి పురుగు మందు తాగి చనిపోవాలని అనుకుంది. తన చావుకు కొందరు కారణమని వీడియో తీసి వాట్సప్ గ్రూపుల్లో పెట్టడంతో అది కాస్తా వైరల్​గా మారింది. ఇంతలో ఎస్సైకి విషయం తెలియడంతో ఆమెను అత్యంత చాకచాక్యంతో ప్రాణాపాయం నుంచి రక్షించారు. ఈ ఘటన శనివారం నాగర్​కర్నూల్ ​జిల్లాలో సంచలనం రేపింది. బిజినేపల్లి మండలం సల్కర్​పేట గ్రామానికి చెందిన మాధవి వివాహిత. కుటుంబ కలహాలతో ప్రస్తుతం పుట్టిన ఊరులోనే ఉంటోంది. ‘వ్యక్తిగత […]

Read More
10 రోజుల్లో పెళ్లి.. అంతలోనే మృత్యుకేక

10 రోజుల్లో పెళ్లి.. అంతలోనే మృత్యుకేక

మహబూబాబాద్ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం ఆరుగురి దుర్మరణం‌‌.. పెళ్లింట విషాదఛాయలు సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి.. మంత్రుల విచారం సారథి న్యూస్, మహబూబాబాద్: మరో పది రోజుల్లో కూతురు పెళ్లి.. కొత్త వస్త్రాలు కొనేందుకు వెళ్లిన ఆ కుటుంబం ఇంటికి తిరిగిరాలేదు. శుభలేఖలతో బంధువుల వద్దకు వెళ్లాల్సిన పెళ్లింటి వారు విగతజీవులుగా మారారు. లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఆరుగురిని బలితీసుకుంది. పెళ్లిబాజాలు మోగాల్సిన ఆ ఇల్లు శోకసంద్రంగా మారింది. మహబూబాబాద్​ జిల్లా గూడురు మండలం ఎర్రకుంటతండాకు […]

Read More
ఏడుగురు కూలీలను బలిగొన్న లారీ

ఏడుగురు కూలీలను బలిగొన్న లారీ

లారీ ఢీకొని మహిళల దుర్మరణం పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద దుర్ఘటన తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్, నల్లగొండ: రెక్కాడితే గానీ డొక్కాడని పేదింటి బతుకులు.. కూలీ పనులకు వెళ్లినవారంతా తిరిగిరాని లోకాలకు వెళ్లారు. లారీ ఢీకొనడంతో ఏడుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అప్పటిదాకా వరినాట్లు వేసి అలసిసొలసి ముచ్చట్లు, నవ్వులతో ఇంటిదారి పడుతున్నవారంతా ఒక్కసారిగా విగతజీవులుగా మారారు. క్షణాల్లో మాంసపు ముద్దలుగా చెల్లాచెదురయ్యారు. ఈ ఘోరరోడ్డు ప్రమాదం […]

Read More
సంక్రాంతి వేళ విషాదం

సంక్రాంతి వేళ విషాదం

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. సంక్రాంతి పండుగ పూట ఈ విషాదకర ఘటన బుధవారం సాయంత్రం చిన్నశంకరంపేట గ్రామశివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన నిమ్మతోట ఆంజనేయులు(38) చిన్నశంకరంపేటలో వీక్లీ మార్కెట్ ముగించుకుని ఇంటికి బయలుదేరి వెళ్తున్నాడు. చిన్నశంకరంపేట – అంబాజీపేట గ్రామాల సరిహద్దు కల్వర్టుపై మెదక్ నుంచి ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఎక్సెల్ పై వెళ్తున్న ఆంజనేయులు తలకు తీవ్ర […]

Read More
తల్లిదండ్రులు మందలించారని..

తల్లిదండ్రులు మందలించారని..

సారథి న్యూస్​, గద్వాల: తల్లిదండ్రులు మందలించారని ఓ బాలుడు(16) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గద్వాల పట్టణ‌ ఎస్సై రమాదేవి కథనం మేరకు.. గద్వాల పట్టణం హాట్కర్ వీధిలో నివసించే ఓ బాలుడు‌ రెండు రోజులుగా సెల్ ఫోన్ లో ఆన్​లైన్​ క్లాసులు వినకుండా గేమ్స్ ఆడుతుండడంతో ఇది గమనించిన తల్లిదండ్రులు మందలించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ బాలుడు ఇంట్లోని ఫ్యాన్​కు […]

Read More
బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో భూమా అఖిలప్రియ అరెస్ట్​

బోయిన్​పల్లి కిడ్నాప్‌ కేసులో భూమా అఖిలప్రియ అరెస్ట్​

సారథి న్యూస్, హైదరాబాద్‌: బోయిన్​పల్లి కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్​చేశారు. ఏ2 నిందితురాలిగా చేర్చారు. కేసు వివరాలను హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ విలేకరులకు వెల్లడించారు. అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌కు ప్రమేయం ఉన్నట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. కిడ్నాప్‌ కేసులో ఏ1గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ2గా అఖిలప్రియ, ఏ3గా భార్గవ్‌రామ్‌ ఉన్నారని తెలిపారు. ఉదయం 11 గంటలకు భూమా అఖిలప్రియను అరెస్టు చేసి, వైద్యపరీక్షల కోసం గాంధీ […]

Read More
భార్యాభర్తలపై కత్తితో దాడి

భార్యాభర్తలపై కత్తితో దాడి

సారథి న్యూస్, రామయంపేట: పాత కక్షల నేపథ్యంలో భార్యాభర్తలపై కత్తితో ఓ వ్యక్తి దాడిచేశాడు. శనివారం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన బోయిని శ్రీనివాస్ అతని భార్య కనకవ్వలపై అదే గ్రామానికి చెందిన తమ్మల ప్రభాకర్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న పాతకక్షలే కారణమని గ్రామస్తులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలను చికిత్స కోసం రామాయంపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు […]

Read More
భూమి పేర చేయడం లేదని..

భూమి పేర చేయడం లేదని..

పురుగు మందు తాగి అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం మానవపాడు తహసీల్దార్ ఆఫీసు ఎదుట ఆందోళన సారథి న్యూస్, మానవపాడు: భూమిని తమ పేర చేయడం లేదని, అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా న్యాయం జరగడం లేదని ఇద్దరు అన్నదమ్ములు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట కలకలం రేపింది. బాధిత రైతుల కథనం మేరకు.. మండలంలోని చెన్నిపాడు గ్రామానికి చెందిన రైతులు శేషిరాజు, నాగరాజుకు […]

Read More